More

ఫిలిప్పీన్స్‌ తుపాను.. 375కు చేరిన మరణాలు

21 Dec, 2021 05:31 IST

మనీలా: ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం సంభవించిన తీవ్ర తుపాను ‘రాయ్‌’ తీవ్రతకు మరణించిన వారి సంఖ్య భారీస్థాయిలో పెరుగుతోంది. తాజాగా మరణాల సంఖ్య మొత్తంగా 375కు చేరుకుంది. మరోవైపు, ఈ తుపాను ధాటికి 56మంది జాడ తెలియడం లేదని అధికారులు సోమవారం తెలిపారు. గోడలు, చెట్లు కూలిపడటం, ఆకస్మిక వరదలు, కొండచెరియలు విరిగి పడిన ఘటనల్లో మరో 500 మంది గాయపడ్డారన్నారు.

తుపాను తాకిడికి గురైన 25 నగరాలు, పట్టణాల్లో ఇప్పటికీ సమాచార వ్యవస్థలను పునరుద్ధరించడం వీలుకాలేదని చెప్పారు. మరో 200కు పైగా నగరాలు, పట్టణాలు చీకట్లోనే మగ్గుతున్నాయన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఆహారం, మంచినీరు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

బ్రిటీష్‌ ప్రధానికి భారత్‌ దీపావళి కానుక

అమెరికాలో విషాదం.. ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో సైనికులు మృతి

‘టైటానిక్‌’ ఆఖరి డిన్నర్‌ మెనూ వేలం.. ఎంత పలికిందో తెలుసా?

హమాస్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు