More

Kadambari Kiran Met CM KCR: కేసీఆర్‌ను కలిసిన 'మనం సైతం' కాదంబరి కిరణ్‌.. ఎందుకంటే ?

30 Nov, 2021 11:04 IST

Manam Saitham Founder Kadambari Kiran Met CM KCR: రాజకీయనాయకులు, సినీ సెలబ్రిటీలకు మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒకరివేడుకల్లో ఒకరు పాల్గొంటూ అనుబంధాలు పెంచుకోవడం పరిపాటే. టాలీవుడ్‌ నటుడు, 'మనం సైతం' వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కలిశారు. డిసెంబర్‌ 8న జరగనున్న తమ కుమార్తె వివహ మహోత్సవానికి రావల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. అలాగే 'మనం సైతం' ద్వారా సమాజహితం కోసం నిరంతరం అందిస్తున్న సేవా కార్యక‍్రమాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు కాదంబరి కిరణ్‌.

కాదంబరి కిరణ్‌ ఎక్కువగా హాస్యప్రాధాన్యమున్న పాత్రల్లో నటించారు. ఇప్పటికీ 270 సినిమాల్లో నటించారు. 'అమ్మ నాన్న తమిళ అమ్మాయి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో 'మనం సైతం' సంస్థ ఏర్పాటు చేసి అనేక సేవా కార‍్యక‍్రమాలు అందిస్తున్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి కాదంబరి కిరణ్‌ మ‍ద్దతు కూడా ఇచ్చారు. కాదంబరి కిరణ్‌ ఒక్కాగానొక్క కుమార్తె శ్రీకృతి వివాహం డిసెంబర్‌ 8న నిర్వహించనున్నారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మళ్లీ వార్తల్లో నిలిచిన మా ఎన్నికలు.. మంచు విష్ణుపై ప్రకాశ్‌ రాజ్‌ కామెంట్లు

జవాన్‌ పాటకు మెగాస్టార్‌ డ్యాన్స్‌.. పార్టీలోనే హైలైట్!

ప్రియుడిని ముద్దుల్లో ముంచెత్తిన శృతి హాసన్‌

కమల్‌ హాసన్‌ను కలిసిన అట్లీ.. భారీ ప్రాజెక్ట్‌పై రివీల్‌

ఐశ్వర్య రాయ్‌పై పాక్ క్రికెటర్ బలుపు మాటలు.. రజాక్‌,అఫ్రిది,అక్తర్‌ క్షమాపణలు