More

ఈటల రాజేందర్‌పై పూనమ్‌ కౌర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

20 Nov, 2021 14:05 IST

నటి పూనమ్‌ కౌర్‌ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె ఎప్పుడు, ఎవరి మీద కామెంట్స్‌ చేస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకు చేస్తుందో కూడా తెలియదు. తాజాగా ఈ పంజాబీ బ్యూటీ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గెలుపోటముల గురించి తాజాగా పూనమ్ స్పందించింది.

గురునానక్‌ జయంతి సందర్భంగా ఈటలను ప్రత్యేకంగా కలిసి ఏక్ ఓంకార్ అనే తన మతంలో పవిత్రమైన గుర్తును కానుకగా ఇచ్చింది పూనమ్‌.  అంతేకాకుండా ఆయనతో కలిసి శాంతి కపోతమైనా పావురాన్ని ఎగుర వేసింది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ధర్మ యుద్ధం ఎప్పుడూ గెలుస్తుందంని కామెంట్‌ చేసింది. అలాగే రైతు చట్టాలు రద్దు చేయడంతో మళ్లీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపించిందని పూనమ్ కౌర్ అభిప్రాయపడింది. మొత్తానికి పూనమ్ కౌర్ ఇలా కనిపించడంతో నెటిజన్లకు కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. పూనమ్ కౌర్ కొంపదీసి బీజేపీలో చేరుతుందా? అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Bigg Boss 7: శివాజీ భజన చేస్తున్న బిగ్‌బాస్! చివరకు నాగార్జున కూడా అలానే?

క్రికెట్ వరల్డ్‌కప్‌పై సాంగ్స్.. ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఏది బెస్ట్ అంటే?

పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!

మరింత అందంగా మహేశ్ కూతురు.. మేకప్ లేకుండా చిట్టి!

బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. నో ఎలిమినేషన్‌