బాలీవుడ్ పనైపోయింది అని విరగబడి నవ్వినవాళ్లకు పఠాన్తో సమాధానం చెప్పాడు షారుక్ ఖాన్. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్తో కమ్బ్యాక్ ఇచ్చిన షారుక్ ముప్పైకి పైగా రికార్డులను బద్ధలు కొట్టాడు. పఠాన్ రిలీజై 50 రోజులకు పైనే అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1049.50 కోట్ల గ్రాస్ రాబట్టిందీ చిత్రం. ఇందులో ఇండియా వాటా రూ.657.25 కోట్లు కాగా ఓవర్సీస్ది రూ.392.35 కోట్లుగా ఉంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది.
వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన షారుక్ తాజాగా ఓ ఖరీదైన కారు కొనుగోలు చేసిశాడు. రోల్స్ రాయిస్ క్యులినన్ బ్లాక్ బెడ్జ్.. ఎస్యూవీ కారును తన గ్యారేజీకి తెచ్చుకున్నాడు. దీని ధర దాదాపు రూ.10 కోట్లు ఉండవచ్చని అంచనా! భారత్లో అమ్ముడవుతున్న ఖరీదైన ఎస్యూవీ కార్లలో ఇది ఒకటి అని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం షారుక్ తన కొత్త కారులో షికారుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా గత నెలలో రూ.5 కోట్లు విలువ చేసే వాచీ చేతికి ధరించి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడీ బాలీవుడ్ స్టార్.
ప్రస్తుతం షారుక్ ఖాన్.. అట్లీ దర్శకత్వంలో 'జవాన్', రాజ్కుమార్ హిరానీ డైరెక్షన్లో 'డుంకీ' చిత్రాల్లో నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు భోగట్టా!