మరో విషాదం: కరోనాతో ప్రముఖ నిర్మాత కన్నుమూత

Published on Sat, 05/29/2021 - 10:11

తమిళ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత వెంకట్‌ సుభా శనివారం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కోవిడ్‌ పాజిటివ్‌ పరీక్షించిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మే 29(శనివారం) తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తకు కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.

అలాగే వెంకట్‌ సుభా మృతి బాధాకరం అంటు నటి రాధిక శరత్‌ కుమార్‌, ప్రకాశ్‌ రాజ్‌లతో పాటు పలువురు నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు. కాగా వెంకట్ సుభా ‘మొజి, అఘగియా తీయే, కందనాల్ ముధల్’ వంటి చిత్రాలకు పనిచేశారు. అంతేగాక పలు తమిళ సీరియల్స్‌లో కూడా ఆయన నటించారు. ఇక టూరింగ్ టాకీస్ అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో ఆయన సినిమా రివ్యూయర్‌గా వ్యవహరించారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ