-
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
తెలుగు బుల్లితెర నటి జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు సీరియల్తో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటి దాదాపు 20కి పైగా సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ కనిపించింది. శాండల్వుడ్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో జ్యోతిరాయ్ ఒకరు. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసే ఈ బ్యూటీ ఇప్పుడు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.కర్ణాటకకు చెందిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అసభ్యకర వీడియో కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా.. ప్రముఖ కన్నడ టెలివిజన్ నటి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియో, ఫోటోలు లీక్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన వీడియో ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ సహా అన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో షేర్ అవుతుంది. జ్యోతిరాయ్ ఏం చెప్పారు..?ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న అశ్లీల వీడియో, ఫొటోలపై నటి జ్యోతిరాయ్ మీడియా ముందు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఫోటోలు, వీడియోలు చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైన జ్యోతిరాయ్ ఈ విషయమై కొద్ది రోజుల క్రితం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 'వీటికి సంబంధించిన కొన్ని మెసేజ్లు రావడంతో నేను మానసికంగా షాక్ అయ్యాను. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే వారిని పట్టించుకోకపోతే అది నా వ్యక్తిగత జీవితంపైనే కాకుండా వృత్తి జీవితంపైనా ప్రభావం చూపుతుంది.వీటి వల్ల నాతో పాటు నా కుటుంబ ప్రతిష్ట ప్రమాదంలో ఉన్నందున చట్టపరంగా వారిపై వెంటనే చర్యలు తీసుకుంటారని నేను అభ్యర్థిస్తున్నాను. తప్పుడు వీడియోలు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుంటే నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. వీలైనంత త్వరగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.' అని జ్యోతిరాయ్ కోరినట్లు తెలిసింది.వార్నింగ్ ఎంటి..?జ్యోతిరాయ్కు సంబంధించిన పర్సనల్ వీడియో, ఫోటోలు అంటూ.. మొదటగా ఒక సోషల్ మీడియా ఖాతా నుంచి వైరల్ అయ్యాయి. అందులో అశ్లీలంగా ఉన్న దృశ్యాలను చూసిన వారందరూ షాక్ అయ్యారు. తన పేజీకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కాగానే.. జ్యోతిరాయ్ ఫోటోలు, వీడియోలు మరిన్ని పోస్ట్ చేస్తానని ఒక మేసేజ్ కూడా చేర్చడంతో కర్ణాటకలో పెద్ద దుమారమే రేగుతుంది. అందులో ఉండేది జ్యోతిరాయ్నేనా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఆ వీడియోలో ఉండేది జ్యోతిరాయ్ కాదంటూ ఆమెకు మద్ధతుగా అభిమానులు నిలిచారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటి వరకైతే ఈ వీడియో, ఫోటోల గురించి జ్యోతిరాయ్ అధికారికంగా రియాక్ట్ కాలేదు. త్వరలో ఆమె స్పందిస్తారని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) -
నటుడు 'దయ' మృతికి కారణాలివే..
సీరియల్ నటుడు దయ అలియాస్ పవిత్రనాథ్ మృతి అభిమానులను కలిచివేస్తోంది. మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్తో పవిత్రనాథ్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా దయ పాత్రతో అందరికీ గుర్తుండిపోయారు. ఈ రోల్ తన కెరీర్కు ఎంతో ప్లస్ పాయింట్ అయింది. ఈ పాత్ర ద్వారానే తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. తర్వాత ఎన్నో సీరియల్స్లో నటించినా మొగలిరేకులు, చక్రవాకం తెచ్చిపెట్టినంత పేరు మాత్రం రాలేదు. నాలుగురోజులుగా అస్వస్థత కొంతకాలంగా బుల్లితెర మీద కనిపించకుండా పోయిన పవిత్రనాథ్ మార్చి 1న మరణించారు. ఆయన ఆకస్మిక మరణంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే మరణించడానికి గల కారణాలేంటని ఆరా తీస్తున్నారు. పవిత్రనాథ్ కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారట. ఇండస్ట్రీ మిత్రులకు సైతం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది! గత నాలుగురోజులుగా పవిత్రనాథ్ అస్వస్థతకు లోనయ్యారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది! ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించగా.. హార్ట్ ఫెయిల్యూర్ కారణంతో పవిత్రనాథ్ మరణించారని వైద్యులు వెల్లడించారు. కాగా కొన్నేళ్ల క్రితం పవిత్రనాథ్.. అతడి భార్య శశిరేఖ మధ్య గొడవలు తలెత్తాయి. భర్త మీద ఎన్నో ఆరోపణలు చేసింది. అయినా సరే నటుడు వాటి గురించి పట్టించుకోలేదు. ఏనాడూ సదరు ఆరోపణల మీద స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. అయితే ఆ సమయంలో మానసికంగా వేదన అనుభవించాడని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ.. వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్ -
ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. నడవలేని స్థితిలో నటుడు..
మలయాళ సీరియల్ నటుడు కార్తీక్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి దయనీయంగా ఉంది. వారం రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న ఆయన ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. గత వారం మౌనరాగం సీరియల్ షూటింగ్ ముగించుకుని రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో ఆర్టీసీ(కేఎస్ఆర్టీసీ) బస్సు ఆయనను వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లిపోయిన ఆయనను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. తలకు, కాలికి బలమైన గాయాలు తగిలినట్లు వైద్యులు గుర్తించారు. తాజాగా నటి బీనా ఆంటోని.. కార్తీక్ హెల్త్ అప్డేట్ వెల్లడించింది. 'కార్తీక్ పరిస్థితి ఎలా ఉందని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. నిజంగా తన పరిస్థితి ఏమీ అంత బాగోలేదు. నడవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. రెండు కాళ్ల చర్మం ఊడిపోయింది. అక్కడ మాంసం ముద్ద కూడా లేదట! ఇప్పటికే రెండు, మూడు ప్లాస్టిక్ సర్జరీలు చేశారు. ఇంకా చేయాలంటున్నారు. కార్తీక్తో మాట్లాడలేదు కానీ అతడి భార్యతో మాట్లాడాను. భరించలేనంత నొప్పి ఉండటంతో పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారట!' అని చెప్పుకొచ్చింది. చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ.. -
'మొగలిరేకులు' నటుడు దయ కన్నుమూత
ప్రముఖ బుల్లితెర నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు. మొగలిరేకులు సీరియల్లో దయగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన చిన్నవయసులోనే మరణించారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో వెల్లడించింది. 'పవి.. ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నాం.. మా జీవితాల్లో నువ్వు ఎంతో ముఖ్యమైనవాడివి. నీ మరణవార్త అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. ఇది నిజం కాకూడదు.. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. చివరి చూపు కూడా.. కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్బై కూడా చెప్పలేకపోయాం. నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ భగవంతుడు నీ కుటుంబానికి మరింత శక్తినివ్వాలి' అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. అయితే నటుడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా బుల్లితెరపై సంచలనం రేపిన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్లో పవిత్రనాథ్ ముఖ్యపాత్రలో నటించారు. 'మొగలిరేకులు' ధారావాహికలో ఇంద్రనీల్ తమ్ముడు దయగా మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. View this post on Instagram A post shared by Meghna Raami (@raamimeghna) చదవండి: డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు.. క్రిష్ నమూనాల సేకరణ..! -
మూడేళ్ల ముచ్చట.. విడిపోయిన బుల్లితెర జంట
ఈ మధ్య పెళ్లిళ్లు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. బుల్లితెర జంట అభిషేక్ మాలిక్- సుహాని చౌదరి కూడా ఆ కోవలోకే వస్తారు. వీరిద్దరూ 2021లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మీ జంట చూడముచ్చటగా ఉందని, కలకాలం కలిసుండాలని కోరుతూ అతిథులు అక్షింతలు వేసి దీవించారు. కానీ మూడేళ్లకే వీరి వైవాహిక బంధం బీటలు వారింది. తాము విడిపోయామంటూ నటుడు అభిషేక్ వెల్లడించాడు. తమ మధ్య సరైన సఖ్యత లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కనెక్షన్ మిస్ అవుతోంది అభిషేక్ మాలిక్ మాట్లాడుతూ.. 'మా ఇద్దరి మనస్వత్వాలు వేరు. మా మధ్య సరైన అండర్స్టాండింగ్ కూడా లేదు. మా మధ్య ఏదో కనెక్షన్ మిస్ అవుతున్నాం. దీని గురించి ఇద్దరం చర్చించుకున్నాం. విడాకులు తీసుకుంటేనే ఇద్దరం సంతోషంగా ఉండలగమని నిర్ణయించుకున్నాం. కలిసి బంధాన్ని కొనసాగించేందుకు మాకు సహేతుక కారణాలేవీ కనిపించట్లేదు. బలవంతంగా కలిసుండి ఒకరి జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం? అందుకే విడిపోయాం. తనకేమో కలలు.. నేనేమో బిజీ నేను నా వర్క్తో చాలా బిజీగా ఉంటున్నాను. తనేమో ఏవేవో కలలు కంటోంది. పైగా తను ముంబైకి కొత్త. ఇక్కడ తనకు పెద్దగా స్నేహితులు కూడా లేరు. నా ఫ్రెండ్సే తనకు మిత్రులుగా మారారు. ఇండస్ట్రీకి చెందిన నా స్నేహితులు తనను ఎంతో ప్రేమిస్తారు. నాకంటే తనే ఎక్కువగా వారితో కలిసి బయటకు వెళ్తూ ఉండేది. అయితే ఆ ఫ్రెండ్స్ కూడా నేను నా భార్యకు ఎక్కువ సమయం కేటాయించడం లేదని అనేవారు. ఆ మాట నాకు బలంగా గుచ్చుకుంది. అది కాస్తా ఇంతవరకు వచ్చింది. విడాకుల కోసం దరఖాస్తు కూడా చేశాం' అని చెప్పుకొచ్చాడు. ప్రేమ పెళ్లి- మూడేళ్లకే విడాకులు కాగా అభిషేక్- సుహాని తొమ్మిదినెలల పాటు డేటింగ్ చేసి 2021లో పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లకే విడాకులు తీసుకోబోతుండటంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ మాలిక్.. ఛల్-షే ఔర్ మాత్ అనే సీరియల్తో 2012లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఏక్ వివాహ్ ఐసా బీ, భాగ్యలక్ష్మి, యే హై మొహబ్బతే, కుంకుమ్ భాగ్య వంటి సీరియల్స్తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. సుహాని చౌదరి మోడల్గా రాణిస్తోంది. చదవండి: శాలువా ఎందుకు విసిరేశారు? వివాదంపై క్లారిటీ ఇచ్చిన హీరో తండ్రి -
ప్యాంక్రియాటిక్ కేన్సర్ వల్ల గుండె ఆగిపోతుందా?
ప్రముఖ బాలీవుడ్ టీవీ నటుడు రితురాజ్ సింగ్ 59 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్టుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన గత కొంతకాలం ప్యాంక్రియాటిక్ (క్లోమ గ్రంధి క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లారు. ఏమైందో ఏమో గత రాత్రి అకస్మాత్తుగా కార్షియాక్ అరెస్టుకు గురై చనిపోయారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అస్సలు ఈ ప్యాక్రియాటిక్ క్యాన్సర్ గుండె లయలపై ప్రభావం చూపిస్తుందా?. అది ప్రాణాంతకమా? ఇక్కడ ప్యాంక్రియాస్ అనగా క్లోమ గ్రంధి. ఇది శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఎందుకంటే శరీరంలోని గ్లూకోజ్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది కాలేయం కింద, పిత్తాశయం, కడుపు, ప్రేగులకు దగ్గరగా ఉండే ఆకు ఆకారంలో ఉండే అవయవం. ఆహారం జీర్ణం చేయడానికి ముఖ్యమైన ఎంజైమ్ని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల దీనిలో ఏదైనా సమస్య వస్తే పలు రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్యాంక్రియాటిక్ రుగ్మతలు అంటే.. జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణలో సమస్యలను కలిగిస్తాయి. ఇది సర్వసాధారణ రుగ్మత అధిక ఆల్కహాల్ తీసుకోవడం లేదా పిత్తాశయ రాళ్లు వంటి కారణాల వల్ల క్లోమగ్రంధిలో సమస్య తలెత్తి కడపు నొప్పి, వికారం, వాంతులకు దారితీస్తుంది. తీవ్రమైన రుగ్మత కాలేయ క్యాన్సర్. దీని కారణంగా కామెర్లు, అతిగా బరువు తగ్గడం తదితర సమస్యలు వస్తాయి. ప్యాంక్రియాటిక్ రుగ్మత లక్షణాలు.. పొత్తి కడుపు నొప్పి నిరంతరం తీవ్రమైన కడుపు నొప్పి, తరచుగా వెనుకకు ప్రసరించడం. ప్యాంక్రియాటిక్ రుగ్మతల లక్షణం. ఈ నొప్పి తీవ్రతలో మారవచ్చు మరియు తినడం లేదా పడుకున్న తర్వాత తీవ్రమవుతుంది. ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి పరిస్థితుల వల్ల చుట్టుపక్కల కణజాలంపై వాపు, అడ్డుపడటం లేదా ఒత్తిడి కారణంగా ఇది సంభవిస్తుంది. వికారం, వాంతులు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు జీర్ణక్రియలో ఆటంకాలు కలిగిచడంతో వికారం, వాంతులు వంటి వాటికి దారితీస్తుంది. ఈ లక్షణాలు తరచుగా పొత్తికడుపు నొప్పితో పాటుగా ఉంటాయి. ఇవి కొవ్వు లేదా పెద్దగా భోజనం తినడం ద్వారా వస్తుంది. కామెర్లు చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడాన్ని కామెర్లు అని పిలుస్తారు. అది కాస్త ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లేదా పిత్త వాహిక అవరోధం వంటి కాలేయ రుగ్మతలకు దారితీయొచ్చు. ముఖ్యంగా పిత్తాశయం నుంచి ప్రేగులలోకి పిత్త ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల రక్తప్రవాహంలో బిలిరుబిన్ అధికంగా ఏర్పడటంతో కామెర్లు రావడం జరుగుతుంది. అనూహ్యంగా బరువు తగ్గడం అనూహ్యంగా బరువు తగ్గడం అనేది ప్యాంక్రియాటిక్ రుగ్మతకు సంబంధించిన సాధారణ లక్షణం. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఆకలి లేకపోవడం, పోషకాలు శోషించుకోలేకపోవడం, తగిన జీవక్రియలు లేకపోవడం తదితర లక్షణాలు తలెత్తుతాయి. ప్రేగు కదలికల్లో మార్పులు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు విరేచనాలు, జిడ్డుగల లేదా జిడ్డుగల మలం లేదా లేత-రంగు మలం వంటి ప్రేగు కదలికలలో మార్పులకు దారితీయవచ్చు. సరైన జీర్ణక్రియకు అవసరమైన ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం వల్ల ఈ మార్పులు సంభవించవచ్చు. మధుమేహం దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి కొన్ని ప్యాంక్రియాటిక్ రుగ్మతలు ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇది డయాబెటిస్ మెల్లిటస్కు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు ఉన్న వ్యక్తులు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, తక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్న తర్వాత కూడా కడుపు నిండిన అనుభూతి వంటి జీర్ణ సమస్యలతో బాధపడతారు. క్లోమ గ్రంధి రుగ్మతలు కార్డియాక్ అరెస్ట్కు ఎలా దారితీస్తాయంటే.. ప్యాంక్రియాటైటిస్ లేదా క్లోమ గ్రంధి క్యాన్సర్ వంటి క్లోమ సంబంధిత రుగ్మతలు కార్డియాక్ అరెస్ట్కు కారణమయ్యే అవకాశం ఉంది. ప్యాంక్రియాస్ వాపు లేదా క్యాన్సర్ బారిన పడినప్పుడు, అది గుండెతో సహా సమీపంలోని అవయవాలకు తీవ్రమైన మంట, హాని కలిగించే పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ వాపు శరీరంలో రకరకాల సమస్యలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా గుండె పనితీరుకు కీలకమైన పొటాషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యతకు దారితీస్తుంది. అలాగే, ప్యాంక్రియాటిక్ రుగ్మతలు శరీరంపై గణనీయమైన నొప్పి, ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది.క్రిటికల్ పరిస్థితుల్లో అది కాస్త గుండెపై ఈ ఒత్తిడి ఏర్పడి ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడి తత్ఫలితంగా గుండె ఆగిపోవడానికి దారితీస్తుంది. ఇక్కడ గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతుంది. (చదవండి: నటుడు శరత్బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!) -
బిగ్బాస్ షోలో కలిశారు.. రెండేళ్లుగా సహజీవనం.. ఇంతలో!
వాలంటైన్స్ డేకు ఇంకా ఒక్క రోజే సమయముంది. రేపు (ఫిబ్రవరి 14న) ప్రేమికులు తమ స్పెషల్ డేను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుని మురిసిపోతారు. వన్సైడ్ లవర్స్.. తమ ప్రేమను ఈసారైనా బయటపెట్టాల్సిందే, అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిందే అన్న విధంగా ప్లాన్లు చేసుకుంటున్నారు. అంతా ప్రేమ మైకంలో ముగిని తేలుతున్న ఈ సమయంలో బుల్లితెర జంట మాత్రం విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఒకే ఇంట్లో ఉంటూ.. నటీనటులు ఇజాజ్ ఖాన్- పవిత్ర పూనియా.. హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అన్నీ కలిసొస్తే.. అదే ఏడాది పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ అంతలోనే పెళ్లి విషయం పక్కనపెట్టేసి రెండేళ్లు సహజీవనం చేశారు. కొద్ది నెలలుగా వీరి మధ్య విభేదాలు వస్తున్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఇదే నిజమని తేలిపోయింది. బ్రేకప్ నిజమని అంగీకరించారు. మొన్నటివరకు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉండగా గత నెలలో ఇజాజ్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. పవిత్ర మాత్రం ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటోంది. ఎక్స్పైరీ అయిపోయింది బ్రేకప్ గురించి పవిత్ర మాట్లాడుతూ.. 'ప్రతిదానికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఏదీ శాశ్వతంగా ఉండిపోదు. ప్రేమ బంధాలకు కూడా ఇది వర్తిస్తుంది. రిలేషన్స్ కూడా కలకాలం ఉండిపోవు. కొన్ని నెలల క్రితమే ఇజాజ్, నేను విడిపోయాం. అప్పటికి, ఇప్పటికి అతడిని గౌరవిస్తూనే ఉన్నాను. తన క్షేమమే కోరుకుంటున్నాను. కానీ మా మధ్య ప్రేమబంధం మాత్రం ముగిసిపోయింది' అని చెప్పుకొచ్చింది. బ్రేకప్ నిజమే.. అటు ఇజాజ్ కూడా బ్రేకప్ నిజమేనని ఒప్పుకున్నాడు. పవిత్ర తన కెరీర్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించాడు. కాగా పవిత్ర చివరగా నాగమణి అనే సీరియల్లో కనిపించింది. ఇజాజ్.. జవాన్ సినిమాలో కనిపించాడు. బిగ్బాస్ షో ద్వారా ఒక్కటైన ఈ జంట పలు ఈవెంట్లకు, షోలకు కలిసే వెళ్లేవారు. ఎంతో ముచ్చటగా కనిపించే ఈ లవ్ బర్డ్స్ విడిపోతున్నారని తెలిసి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ధనుష్ పాటపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాజీ భార్య -
రెండోసారి ఆడపిల్ల.. సంతోషంలో నటి.. ఘనంగా ఫంక్షన్
పర్ల్ మానే.. మొదట్లో పాటల ప్రోగ్రామ్కు, తర్వాత వంట ప్రోగ్రామ్, డ్యాన్స్ షో.. ఇలా దాదాపు అన్ని రకాల కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరించింది. యాంకర్గా వచ్చిన గుర్తింపుతో సినిమా ఛాన్సులూ అందుకుంది. సహాయ నటిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ మలయాళ బిగ్బాస్ షోలోనూ పాల్గొని ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. ఈమె తెలుగులో ఓ సినిమాలో నటించింది. నాగశౌర్య 'కళ్యాణ వైభోగమే' చిత్రంలో వైదేహి అనే పాత్రలో యాక్ట్ చేసింది. బిగ్బాస్ షోలో లవ్ ఇకపోతే ఈమె బిగ్బాస్ షోలో బుల్లితెర నటుడు శ్రీనిష్ అరవింద్తో లవ్లో పడింది. షో అయిపోగానే పెళ్లి కూడా చేసుకున్నారు. 2019లో పెళ్లి పీటలెక్కగా 2021లో నీల అనే కూతురు జన్మించింది. ఈ ఏడాది జనవరి 13న మరోసారి కూతురు పుట్టింది. తాజాగా ఈ పాపకు నామకరణం చేశారు. రెండో కూతురికి 'నితారా శ్రీనిష్' అన్న పేరు ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. పాప పుట్టి 28 రోజులు.. 'నితారా శ్రీనిష్ జన్మించి 28 రోజులవుతోంది. ఇది తన బారసాల. మా మనసులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి. మీ ఆశీర్వాదాలు కావాలి..' అంటూ ఫ్యామిలీ ఫోటోలను పర్ల్ మానే, శ్రీనిష్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు నటి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీ కుటుంబం చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pearle Maaney (@pearlemaany) View this post on Instagram A post shared by Pearle Maaney (@pearlemaany) చదవండి: 'దేవర'లో ఎన్జీఆర్కు జోడీగా శ్రుతి మరాఠే.. ఇన్స్టాలో వెరీ పాపులర్ -
పెళ్లి చేసుకోవడమే ఆలస్యం.. ఇంతలోనే షాకిచ్చిన బిగ్బాస్ బ్యూటీ!
బుల్లితెర జంట పవిత్ర పూనియా- ఇజాజ్ ఖాన్ విడిపోయారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలాకాలంగా ఈ రూమర్స్పై నోరు విప్పని పవిత్ర తొలిసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా అభిమానులతో నేనెప్పుడూ టచ్లోనే ఉంటాను. అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నా.. దయచేసి దీని(బ్రేకప్ రూమర్స్) గురించి ఎవరూ మాట్లాడొద్దు. మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు. నన్ను, అలాగే ఇజాజ్ను కూడా సపోర్ట్ చేయండి. మా మధ్య ఏదైతే జరిగిందో బహుశా ఏదో ఒక కారణం వల్లే అది జరిగుండొచ్చు. పెళ్లికి నో.. ఆ వార్తలు నిజమే! ఇప్పుడు నేను నా కెరీర్ పైనే ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యే నా తండ్రిని కోల్పోయాను. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. కానీ అతడు నన్ను తల్లిగా చూస్తాడు. నేను తనను చిన్నపిల్లాడిగా చూసుకుంటాను. ఇప్పుడు నా కుటుంబానికి నా అవసరం ఎంతో ఉంది. నా కోసం, నా కుటుంబం కోసం కొన్ని పనులు చేయాల్సి వస్తోంది. అది మీరు ప్రేమతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంతకంటే ఏం చెప్పలేను. నా ఫ్యామిలీ బాధ్యతలు నేను భుజాన ఎత్తుకున్నాను. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. మా రిలేషన్ గురించి ఏదైతే ప్రచారం జరుగుతుందో అది నిజమే!' అంటూ బ్రేకప్ వార్తలు వాస్తవమేనని ధ్రువీకరించింది నటి. బిగ్బాస్ హౌస్లో మొదలైన లవ్ కాగా పవిత్ర పూనియా.. లవ్ యూ జిందగీ, యే హై మొహబ్బతే, నాగిన్ వంటి సీరియల్స్లో నటించింది. అలాగే హిందీ బిగ్బాస్ 14వ సీజన్లోనూ పాల్గొంది. ఇజాజ్ ఖాన్ విషయానికి వస్తే.. ఈ నటుడు గతంలో అనిత హస్సనందానీతో డేటింగ్ చేశాడు. కొంతకాలానికే ఆమెకు బ్రేకప్ చెప్పి కెనడియన్ సింగర్ నటలై డి లుసియోతో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునే సమయానికి వీరి బంధం ముక్కలైంది. బిగ్బాస్ 14వ సీజన్లో పాల్గొన్నప్పుడు నటి పవిత్ర పూనియాతో పరిచయం ఏర్పడగా అది కాస్తా ప్రేమగా మారింది. వీరు గతేడాది అక్టోబర్లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటారనుకులోపే బ్రేకప్ చెప్పుకుని అభిమానులకు షాకిచ్చారు. చదవండి: ప్రియుడిని పెళ్లాడిన నటి.. జీవితాంతం ఈ చేయి విడవనంటూ.. -
ప్రముఖ నటుడి ఇంట్లో చోరీ.. నగదు, బంగారం మాయం!
ప్రముఖ టీవీ నటుడి ఇంట్లో చోరీ జరిగింది. తమిళనాడుకు చెందిన శబరినాథన్.. పలు సీరియల్స్లో నటిస్తున్నాడు. సేలం కోరిమేడు సమీపంలోని బృందావనం గార్డెన్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. గత నెల 23న చిన్నాన్న అంత్యక్రియలకు హాజరయ్యేందుకు శబరినాథన్ కుటుంబ సభ్యులు. ఇంటికి తాళం వేసి పనమరుత్తుపట్టికి వెళ్లారు. తిరిగి 24వ తేదీన అందరూ ఇంటికి వచ్చారు. అయితే శబరినాథన్ ఫ్యామిలీ తిరిగొచ్చే సమయానికి ఇంటి తాళం పగలగొట్టి, తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా.. రూ.లక్ష నగదు, 5 గోల్డ్ కాయిన్స్, కొన్ని వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే అలగాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుతో దర్యాప్తు చేపట్టగా దొంగ దొరికాడు. ధర్మపురికి చెందిన మణికంఠన్.. ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడిని అరెస్ట్ చేసి, సెంట్రల్ జైలుకి తరలించారు. -
ఎంగేజ్మెంట్ అయిన ఏడాదికి పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి (ఫోటోలు)
-
ఆ కారణం వల్లే ఇండస్ట్రీని వదిలేసి రైతుగా మారాను: నటుడు
బుల్లితెర నటుడు రాజేశ్ శర్మ రైతుగా మారాడు. మంచి అవకాశాలు రాకపోవడం వల్లే నటనకు గుడ్బై చెప్పి కర్షకుడిగా మారానంటున్నాడు. మొదట ఇతడి నిర్ణయం విని ఊరికే అంటున్నాడేమో అనుకున్నారు, కానీ నిజంగానే రైతుగా మారి పొలం పండిస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. '2017లో నేను యాక్టింగ్ మానేద్దామనుకున్నాను. అప్పుడే మా నాన్నకు చెప్పాను. వారసత్వంగా వస్తున్న పొలం ఉంది కదా.. నేను పంట పండిస్తా అన్నాను. తను నా మాట పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేను అనుకున్నది చేసి చూపించాను. ప్రకృతి నాతో చెలగాటం ఆడింది రైతుగా మారడానికి ప్రధాన కారణం.. నటుడిగా నాకు మంచి అవకాశాలు రాలేదు, కెరీర్లో ఎదుగుదల లేకుండా పోయింది. అదే రైతుగా మారితే.. నాకు నచ్చినవి పండించొచ్చు, నచ్చిన ప్రయోగాలు చేయవచ్చు. అందుకే పొలంలో దిగాను. దాదాపు ఐదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రకృతి నాతో ఎన్నోసార్లు ఆడుకుంది. 20 ఎకరాల పొలంలో 15 వేల మొక్కలు నాటితే వరదల్లో కొట్టుకుపోయాయి. నాలుగేళ్ల తర్వాత కూడా మళ్లీ అలాంటి నష్టమే జరిగింది. ఆర్థికంగా చాలా నష్టపోయాను. దివాలా తీశా లాక్డౌన్లో నేను దాచుకున్న సేవింగ్స్ అంతా ఖర్చయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే దివాలా తీశాను. అప్పులు ఎక్కువవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. ఆ సమయంలో నేను ఎంతో నేర్చుకున్నాను. నా పిల్లలు నన్ను రైతుగా మారిన నటుడు అని చెప్తుంటే గర్వంగా అనిపిస్తుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా రాజేశ్ శర్మ.. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ అనే సీరియల్లో నటించాడు. ఇది 2004-2006 మధ్య కొనసాగిన ఈ సీరియల్ సూపర్ హిట్గా నిలిచింది. 2017లో దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఆ సమయంలో గత సీరియల్ నటీనటులంతా కలిసి పార్టీ కూడా చేసుకున్నారు. చదవండి: హీరోయిన్గా బోర్ కొట్టిందంటున్న బ్యూటీ.. ఇకపై మరో టాలెంట్ చూపిస్తుందట! -
నా గర్ల్ఫ్రెండ్ వల్ల భార్య చాలా బాధపడింది: సీరియల్ నటుడు ప్రభాకర్
సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్ల నుంచి పలు ఛానెల్స్లో సీరియల్స్తో అలరిస్తున్నాడు. తాజాగా ఓ షోకి భార్యతో సహా వచ్చిన ప్రభాకర్.. తన ప్రేమ-పెళ్లి విషయాల గురించి మాట్లాడాడు. తన గర్ల్ఫ్రెండ్ వల్ల భార్య బాధపడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగింది? ఏం జరిగింది? ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన ఈ షోలో ప్రభాకర్-మలయాజ పెళ్లి ఫొటోల్ని స్క్రీన్పై ప్లే చేయగానే.. తమది దొంగపెళ్లి అని, ఆర్య సమాజ్లో ఏడడుగులు వేశామని అన్నాడు. అయితే ఖమ్మం నుంచి వచ్చిన తన ఫ్రెండ్.. పెళ్లిలో కన్యాదానం చేశాడని అప్పటి సంగతుల్ని ప్రభాకర్ గుర్తుచేసుకున్నాడు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!) గర్ల్ఫ్రెండ్ వల్ల భార్య.. 'నాకు ఓ గర్ల్ఫ్రెండ్ ఉండేది. ఆ విషయంలో నా భార్య చాలా బాధపడింది. ఆ సందర్భాన్ని ఎలాగోలా సరిచేసుకుని మనస్ఫూర్తిగా నా భార్యకు సారీ చెప్పాను. అయితే నేను సారీ చెప్పడం గొప్పకాదు. తను నన్ను క్షమించడం గొప్ప విషయం' అని భార్య మలయజ గురించి చెప్పాడు. ఆ తర్వాత ఆమె బుగ్గపై అందరూ చూస్తుండగానే ముద్దుపెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ షో ప్రోమో వైరల్గా మారింది. ఇకపోతే ప్రభాకర్ పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండగా, అతడి భార్య మలయజ స్వతహాగా యాక్టర్ కానప్పటికీ షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ ఉంటుంది. సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అలానే ప్రభాకర్ కొడుకు సుహాస్ ఆటిట్యూడ్ స్టార్ గా ఇప్పటికే చాలామందికి పరిచయం. కూతురు దివిజ కూడా పలు సినిమాల్లో నటించింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. హార్ట్ ఎటాక్తో బుల్లితెర నటుడు మృతి!
ఇటీవల గుండెపోటు మరణాలు తరచుగా సంభివిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఎటాక్ చేస్తోంది. హార్ట్ ఎటాక్తో సంభవిస్తున్న మరణాలు ప్రతి ఒక్కరినీ కలవరపెడుతున్నాయి. తాజాగా హిందీ, తమిళ బుల్లితెర నటుడు పవన్ హార్ట్ ఎటాక్తో మరణించారు. అతని వయస్సు ప్రస్తుతం 25 ఏళ్లే. చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. (ఇది చదవండి: యోగి ఆదిత్యనాథ్ను కలవనున్న రజనీకాంత్.. ఎందుకంటే?) పవన్ సొంత ఊరు కర్ణాటక మాండ్యా జిల్లాలోని హరిహరపుర గ్రామానికి చెందినవారు కాగా.. సరస్వతి, నాగరాజు ఆయన తల్లిదండ్రులు. యాక్టింగ్ నిమిత్తం కొంతకాలంగా పవన్ ముంబయిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావటంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. పవన్ హిందీ, తమిళ భాషల్లో రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా హిందీ, తమిళ టీవీ సీరియళ్లలో నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతని మృతి పట్ల మాండ్యా ఎమ్మెల్యే హెచ్టీ మంజు, మాజీ ఎమ్మెల్యే కేబీ చంద్రశేఖర్ విచారం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: 1990లో చిరంజీవికి ఇదే పరిస్థితి వస్తే ఆయన్ను నిలబెట్టిన సినిమా ఇదే) నటుడి భార్య కన్నుమూత ఇటీవలే కన్నడ ప్రముఖ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన.. థాయ్ల్యాండ్ వెకేషన్లో ఉండగా గుండెపోటు రావడంతో హఠాత్తుగా కన్నుమూసింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021లో గుండె పోటుతోనే మృతి చెందారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని, అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. చిన్న వయసులోనే గుండెపోటు రావడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. -
ముచ్చటగా మూడోసారి విడాకులకు సిద్ధమైన బిగ్బాస్ కంటెస్టెంట్
బిగ్బాస్ కంటెస్టెంట్, నటుడు రాహుల్ మహాజన్ 48 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోనున్నాడు. ఖజకిస్తాన్ మోడల్, భార్య నటల్య ఇలినాతో విడిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఈ జంట గతేడాది విడాకుల కోసం దరఖాస్తు చేసిన విషయం ఇప్పుడు బయటపడింది. నాలుగేళ్లుగా వివాహబంధంలో ఉన్న జంటకు ఆది నుంచి మనస్పర్థలు తలెత్తగా.. వీలైనంత వరకు కలిసి ఉండేందుకే వారు ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే కలిసుండి కొట్లాడటం కన్నా విడిపోవడమే మంచిదని వారు విడాకులకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. మరి విడాకులు మంజూరయ్యాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మూడోసారి విడాకులు కాగా రాహుల్ 2006లో శ్వేతా సింగ్ను పెళ్లాడాడు. వీరిద్దరూ కేవలం రెండేళ్లపాటే కలిసుండగా తర్వాత విడిపోయారు. అనంతరం ఇతడు.. రాహుల్ దుల్హానియా లేజాయేగా అనే రియాలిటీ షోలో డింపీ గంగూలీని కలిశాడు. ఈ షోలోనే ఆమెతో ప్రేమలో పడ్డ అతడు 2010లో పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి సంసార జీవితం కూడా సవ్యంగా సాగలేదు. 2015లో వీరు చెరోదారి చూసుకున్నారు. ఆ తర్వాత 2019లో నటాషాను పెళ్లాడాడు. వీరిద్దరూ స్మార్ట్ జోడీ అనే షోలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ బంధం కూడా వర్కవుట్ కాకపోవడంతో విడాకులకు రెడీ అయ్యాడు. ఎవరికీ చెప్పాలనుకోవడం లేదు అయితే ఈసారి రాహుల్ ఈ బాధను తట్టుకోలేకపోయాడని తెలుస్తోంది. తనకు పెళ్లిబంధమే అచ్చిరావట్లేదని సన్నిహితులతో వాపోయాడట! ఇప్పుడిప్పుడే ఈ బాధ నుంచి తేరుకుని తిరిగి తన వర్క్పై దృష్టి పెడుతున్నాడట! ఈ విడాకుల వార్త గురించి రాహుల్ను ప్రశ్నించగా అతడు స్పందిస్తూ.. 'నా వ్యక్తిగత విషయాన్ని అందరికీ చెప్పడం నాకిష్టం లేదు. నా జీవితంలో ఏం జరుగుతుందనేది ఎవరికీ చెప్పాలనుకోవడం లేదు. నేనిప్పుడేదీ మాట్లాడలేను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: సెంచరీ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. హీరోగా కొత్త సినిమా -
బుల్లితెర నటి ఇంట్లో చోరీ
చెన్నై: స్థానిక మధురవాయిల్లో ఒకేసారి రెండు ఇళ్లల్లో దుండగులు చోరీకి పాల్పడడం ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బుల్లితెర నటి లతారావ్ భర్త రాజ్కమల్ కూడా నటుడే. వీరికి చెన్నైలోని స్థానిక మధురవాయిల్, కృష్ణానగర్ 15వ వీధిలో పెద్ద బంగ్లా ఉంది. దీనిని షూటింగ్లకు అద్దెకు ఇస్తుంటారు. కాగా ఈ బంగ్లాకు వేసి వున్న తాళం తెరిచి ఉందంటూ నటి లతారావ్కు సమాచారం అందింది. ఆమె లోపలికి వెళ్లి చూడగా రూ.లక్ష విలువైన ఎల్ఈడీ టీవీని ఎవరో దొంగిలించినట్లు తెలిసింది. దీంతో ఆమె వెంటనే మధురవాయిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన తిరువళ్లూర్ జిల్లా బీజేపీ నేత పొన్ ప్రభాకరన్ ఇంటి ముందు వున్న కారు కూడా చోరీకి గురైంది. దీంతో ఈ రెండు ఘటనలపై మదురవాయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రముఖ సింగర్తో అనిరుధ్ ప్రేమాయణం -
బిగ్బాస్లో లవ్.. బుల్లితెర జంట పెళ్లి.. పిల్లల కోసం ట్రై చేస్తున్నా..
బిగ్బాస్ షోలో లవ్ స్టోరీలో కామన్.. కానీ ఈ ప్రేమకథలన్నీ షోకు శుభం కార్డు పడే సమయానికే ముగిసిపోతాయి. అంటే చాలామటుకు డ్రామానే ఉంటుంది. కొందరు మాత్రం నిజంగా ప్రేమించుకుని, బయటకు వచ్చాక కూడా దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలా బిగ్బాస్ షోతో మొదలైన ప్రేమను పెళ్లితో పదిలపర్చుకున్న జంట ప్రిన్స్ నరూలా- యువికా చౌదరి. వీరిద్దరూ తొలిసారి హిందీ బిగ్బాస్ 9వ సీజన్లో కలుసుకున్నారు. అప్పటినుంచి వీరి మధ్య సమ్సమ్థింగ్ స్టార్ట్ అయింది. బిగ్బాస్ హౌస్లో హార్ట్ షేప్ పరాటా చేసి మరీ తనను మెప్పించాడు ప్రిన్స్. ఏడాది తిరిగేసరికి వీరు పెళ్లి కూడా చేసుకున్నారు. 2016 నుంచి భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్న వీరు ఎంతోకాలంగా పిల్లల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై నటి యువికా చౌదరి మాట్లాడుతూ.. యుక్త వయసు రాగానే పెళ్లెప్పుడు? అని అడుగుతారు. పెళ్లి చేసుకున్నాక పిల్లల్నెప్పుడు కంటున్నావు? అని ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్న వినీవినీ విసుగెత్తిపోయింది. నిజానికి మేము పెళ్లయిన వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాం. కానీ ఆ భగవంతుడి ఆలోచన మరోలా ఉన్నట్లుంది. అతడు రాసిన రాతను మనం మార్చలేం కదా! అని చెప్పుకొచ్చింది యువికా చౌదరి. కాగా ప్రిన్స్ నరూలా.. ఎమ్టీవీ రోడీస్ 19లో గ్యాంగ్స్ లీడర్స్లో ఒకరిగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. యువికా గతేడాది వచ్చిన సైబర్ వార్ సినిమా, రూహనియత్ అనే వెబ్ సిరీస్లో చివరిసారిగా కనిపించింది. చదవండి: లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదట.. లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ అంటున్న డర్టీ పిక్చర్ హీరోయిన్ -
హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్
సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని బిగ్బాస్ షోతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది నటి కీర్తి భట్. రోడ్డుప్రమాదంలో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన ఆమె జీవితంలో ఎన్నో కష్టనష్టాలను, బాధలను అనుభవించి ఈ స్థాయికి ఎదిగింది. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ కీర్తి.. ఎప్పటికీ పిల్లల్ని కనలేదని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె పెళ్లికి ముందే పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. ఆ చిన్నారిలోనే సంతోషాన్ని వెతుక్కుంది. కానీ ఆ ఆనందం కూడా ఎంతోకాలం నిలవలేదు. బిగ్బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప కన్నుమూసింది. తాజాగా కీర్తి భట్ గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ షోలో దర్శకుడు, హీరో విజయ కార్తీక్ తోటతో నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో కార్తీక్, కీర్తి పూలదండలు మార్చుకున్నారు. 'నీకు నేను తోడుగా ఉంటా, సపోర్ట్గా ఉంటా.. నీ తల్లిదండ్రులను నా పేరెంట్స్ అనుకుంటా! నన్ను వదలకుండా ఇలాగే చూసుకో' అంటూ కంటతడి పెట్టుకుంది కీర్తి. తర్వాత వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. తనకు కాబోయే అత్తామామల గురించి కీర్తి మాట్లాడుతూ.. 'నేను వారి వంశాన్ని నెక్స్ట్ లెవల్కు తీసుకుని వెళ్లలేనని నాకు తెలుసు. ఆ విషయాన్ని వాళ్లకు చెప్తే ఒకటే మాట అన్నారు. నీకు పాప ఎందుకమ్మా? నువ్వే మాకు పాప.. మనం పాపను దత్తత తీసుకుందాం' అన్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది కీర్తి. కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన విజయ కార్తీక్ మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశాడు. తర్వాత సినిమా మీదున్న ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు. View this post on Instagram A post shared by @keerthi_mahesh_universe View this post on Instagram A post shared by keerthi_bhat💙 (@always_keerthibhat_fanz) చదవండి: ఈ వారం ఓటీటీలోకి 24 సినిమాలు హీరోయిన్ సీక్రెట్ పెళ్లిపై నటి సంచలన వ్యాఖ్యలు.. ఊహించని ట్విస్ట్ -
బెడ్రూమ్లో కెమెరా.. నన్ను టార్చర్ పెట్టాడు: మాజీ భర్తపై నటి ఆరోపణలు
కోలీవుడ్ బుల్లితెర జంట సంయుక్త- విష్ణుకాంత్ల పెళ్లి మూన్నాళ్ల ముచ్చటే అయింది. ప్రేమించి, పెద్దలను ఒప్పించి వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసిన వీరిద్దరూ రెండు నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. అప్పటినుంచి వీరు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మొదట విష్ణుకాంత్.. సంయుక్త తన మాజీ ప్రియుడిని ఇంకా మర్చిపోలేదని, తనకు గతంలో ఒక లవ్ స్టోరీ ఉందన్న విషయాన్ని కూడా చెప్పలేదంటూ ఆమెకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ లీక్ చేశాడు. అది నెట్టింట వైరల్ అవడంతో పలువురూ సంయుక్తను తిట్టిపోశారు. ఈ క్రమంలో తానే తప్పూ చేయలేదని, విష్ణుకాంతే తనకు నరకం చూపించేవాడని ఆరోపించింది నటి. శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. అడల్ట్ వీడియోలు చూడమని బలవంతం చేసేవాడని, తనతో హింసాత్మకంగా ప్రవర్తించేవాడంది. బెడ్రూమ్లో కెమెరా పెట్టి అన్నింటినీ రికార్డు చేయడానికి ప్రయత్నిస్తే తాను వ్యతిరేకించానని చెప్పుకొచ్చింది. తనను భార్యగా కాకుండా వ్యభిచారిలా చూశాడని కన్నీళ్లు పెట్టుకుంది. తనకు అలర్జీ వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్తానంటే అంగీకరించలేదని, అప్పుడు ఎంతో బాధేసిందని ఆవేదన వ్యక్తం చేసింది సంయుక్త. అయితే సంయుక్త ఆరోపణలను విష్ణుకాంత్ తిప్పికొట్టాడు. 'ఆమె ఇప్పటికీ తన తప్పు ఒప్పుకోవడం లేదు. తనను తాను రక్షించుకోవడానికి నా మీద నిందలు మోపుతోంది. తను చెప్పేది నిజమైతే అందుకు తగ్గ సాక్ష్యాలు చూపించాలిగా. నేను శారీరకంగా, లైంగికంగా టార్చర్ పెట్టానంటోంది. మరి చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తుందిగా! సంయుక్త చెపుతోందంతా అబద్ధం. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నా ప్రతిష్టను దిగజార్చేందుకే ఆమె ఇదంతా చేస్తోంది. సాక్ష్యాధారాలు లేకుండా ఆమె చెప్పే మాటలను ఎవరూ నమ్మకండి' అని కోరాడు. చదవండి: ఒక్క సినిమాతో ఫేమస్.. తల్లి కాబోతున్న నటి -
బిగ్బాస్తో పాపులారిటీ.. హీరోగా వరుస అవకాశాలు
నటుడు కవిన్ సక్సెస్ఫుల్ హీరోగా ఎదుగుతున్నారు. టీవీ సీరియల్ ద్వారా పరిచయమైన ఈయన ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోతో మరింత పాపులర్ అయ్యారు. దీంతో కవీన్కు సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అలా ఆయన నటించిన లిఫ్ట్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయినా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇటీవల కవిన్ కథానాయకుడిగా నటించిన డాడా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు ఇందులో ఆయనకు జంటగా అయోత్తి చిత్రం ఫేమ్ ప్రీతి ఇస్రాణి నాయకగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రోమియో పిక్చర్స్ సంస్థ అధినేత రాహుల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నృత్య దర్శకుడు, నటుడు సతీష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. దీనికి యువ క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం శుక్రవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. చైన్నె పరిసర ప్రాంతాల్లో షూటింగును నిర్వహించి పూర్తిచేయనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇది ఈతరం యువతను ఆకట్టుకునే విధంగా కమర్షియల్ అంశాలతో కూడిన ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
హోటల్లో విగతజీవిగా కనిపించిన నటుడు
చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు నితేశ్ పాండే(51) కన్నుమూశారు. మహారాష్ట్రలోని నాసిక్లో గత రాత్రి షూటింగ్ ముగించుకుని హోటల్లో విశ్రాంతి తీసుకున్న నితీశ్ విగతజీవిగా కనిపించారు. గుండెపోటుతో ఆయన మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. కాగా ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు. నితేశ్ మరణవార్తపై ఆయన బంధువు, నిర్మాత సిద్దార్థ్ నగర్ స్పందిస్తూ.. 'అవును, ఆయన మనల్ని వదిలి వెళ్లిపోయారు. నా సోదరి అర్పిత పాండే(నితేశ్ భార్య) షాక్లో ఉంది. ఆమెతో పాటు నితేశ్ తండ్రి కూడా మధ్యాహ్నంకల్లా ఇక్కడ ఉంటారు. మాకంతా షాకింగ్గా ఉంది. మాటలు రావడం కూడా కష్టమవుతోంది. తను నా కంటే చిన్నవాడు. తనకెలాంటి అనారోగ్య సమస్యలు లేవు' అని తెలిపారు. కాగా నితేశ్ ప్రముఖ టీవీ సీరియల్ అనుపమతో పాటు కుచ్ తో లాగ్ కహేంగే, ప్యార్ కా దర్ద్ మీఠా మీఠా ప్యారా ప్యారా, ఏక్ రిష్తా సాజేదారి కా వంటి పలు సీరియల్స్లో నటించారు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా సత్తా చాటారు. ఓం శాంతి ఓమ్ సినిమాలో షారుక్ ఖాన్ అసిస్టెంట్గా నటించారు. బదాయి దో, దబాంగ్ 2, మదారి వంటి పలు చిత్రాల్లో నటించారు. అభయ్, వాట్ ద ఫోక్స్ వంటి పలు వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేశారు. చదవండి: హీరోయిన్ రంభ కూతురిని చూశారా? అచ్చం తల్లిలాగే ఉందిగా విషాదం.. కారు ప్రమాదంలో నటి మృతి -
తనకంటే చిన్నవాడితో లవ్.. రెండేళ్లకే బ్రేకప్ చెప్పిన నటి
బుల్లితెర జంట జీషన్ ఖాన్, రేహ్న పండిత్(రేహ్న మల్హోత్రా) విడిపోయారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా అదే నిజమైంది. తమ మధ్య ప్రేమబంధం ముగిసిందని నటి రేహ్న వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. 'జీషన్తో నా ప్రయాణం ముగిసింది. మేమిద్దరం కలిసి ఉండట్లేదు. మళ్లీ కలవాలన్న ఆలోచన కూడా లేదు. గతకొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించాలనుకున్నాను. అందుకే ఈ విషయం చెప్తున్నా. ఇక మీదట జీషన్ గురించి నన్ను ఎటువంటి ప్రశ్న అడగకండి. ఎందుకంటే అంతా అయిపోయింది. ఇక్కడితో దీన్ని వదిలేయండి' అని చెప్పుకొచ్చింది. అటు జీషన్ కూడా 'అవును, బ్రేకప్ చెప్పుకున్నాం. ఇక మీదట దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నా వైపు నుంచి చివరిసారిగా రేహ్నకు వీడ్కోలు చెబుతున్నా' అని తెలిపాడు. కాగా జీషన్, రేహ్న కుంకుమ్ భాగ్య సీరియల్ సెట్లో కలిశారు. అప్పటినుంచే ప్రేమలో ఉన్నారు. 2021 అక్టోబర్లో తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారు. జీషన్ కన్నా రేహ్న వయసులో పెద్దదైనప్పటికీ ఎప్పుడూ తమ మధ్య పొరపచ్చాలు రాలేదని వీరు గతంలో చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో కానీ సడన్గా గత నెలలో రేహ్నాతో బ్రేకప్ అయిందని పోస్ట్ పెట్టాడు జీషన్. మళ్లీ ఆ వెంటనే.. అలాంటిదేమీ లేదని కలిసిపోయామని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే కొన్ని గొడవలు జరిగాయని, ఇద్దరం వాటి నుంచి బయటపడి ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిపోవడానికి సమయం పట్టిందన్నారు. ఒక్కసారి ప్రేమించాక జీవితాంతం తన చేయి వదలనని చెప్పాడు జీషన్. గొడవలకు ముగింపు పలికి మళ్లీ కలిసిపోయారనుకుంటున్న సమయంలో శాశ్వతంగా విడిపోతున్నట్లు వెల్లడించి ఫ్యాన్స్కు షాకిచ్చింది జంట. చదవండి: రష్మికను నేనేమీ అనలేదు: ఐశ్వర్య రాజేశ్ -
పెళ్లైన రెండు నెలలకే భర్తతో విడాకులు? నటి ఇన్స్టా పోస్ట్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్లు ఎంత కామనో, పెళ్లిళ్లు, విడాకులు కూడా అంతే కామన్గా మారింది. ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు కొద్దికాలానికే విడిపోతున్నారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు విడాకులు తీసుకొని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. తాజాగా మరో సినీ జంట కూడా విడాకులు తీసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న రెండు నెలలకే వాళ్లు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. తమిళంలోని ప్రముఖ సీరియల్ ‘సిప్పినీల్ ముత్తు’ లో సంయుక్త-విష్ణుకాంత్ కలిసి నటించారు. వారి పరిచయం ప్రేమకు దారితీసింది. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం పెద్దలను ఒప్పించి మార్చి 3న వైభవంగా పెళ్లి చేసుకున్నారు. చూడముచ్చటగా కనిపించే ఈ జంట మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత కలిసుండలేమంటూ ప్రకటించారు. సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేసి షాకిచ్చారు. చదవండి: హీరో అజిత్ రీల్ కూతురు చనిపోయినట్లు పోస్టర్ కలకలం అంతేకాకుండా ఇద్దరూ ఇన్స్టాలో స్పెషల్ నోట్తో విడిపోతున్నాం అంటూ ఇన్డైరెక్ట్ కోట్స్ చేస్తున్నారు. విష్ణుకాంత్ తన ఇన్స్టా స్టోరీలో.. 'ఎఫైర్స్ నిజమైన ప్రేమను ఫేక్ లవ్గా మార్చేస్తాయి. నో మోర్ సైలెన్స్' అంటూ ఓ పోస్ట్ చేశాడు. సంయుక్తా కూడా.. 'ఒక మహిళను శక్తివంతంగా ఎదుర్కోలేనప్పుడు ఇలాంటి నిందలు వేస్తారు.. ఫేక్లవ్' అంటూ ఇన్స్టా స్టోరీ లో పంచుకుంది. ఇది కొత్త జీవితానికి ఆరంభం అని, ఇప్పట్నుంచి మరింత ధృడంగా ముందుకు వెళ్తానంటూ పేర్కొంది. ప్రస్తుతం కోలీవుడ్లో వీరి విడాకుల వ్యవహారం హాట్టాపిక్గా మారింది. పెళ్లైన రెండు నెలలకే విడిపోవడం ఏంటని పెదవి విరుస్తున్నారు. చదవండి: బాయ్ఫ్రెండ్తో రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన హీరోయిన్ -
నవ్యస్వామితో డేటింగ్పై క్లారిటీ ఇచ్చిన 'విరూపాక్ష' నటుడు
బుల్లితెర నటుడు రవికృష్ణ-నవ్య స్వామి జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సీరియల్లో జంటగా నటించిన వీరిద్దరు అప్పట్నుంచి ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తున్నారు. పలు ఎంటర్టైన్మెంట్ షోలకి జంటగా వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అందుకే కలిసి ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అలాంటిదేమీ లేదు, మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎప్పట్నుంచో సమాధానం ధాటేస్తున్న రవికృష్ణకు తాజాగా మరోసారి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీకు, నవ్యస్వామికి ఉన్న రిలేషన్ ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. సీరియల్లోనే తాము మొదటిసారి కలుసుకున్నామని, అప్పట్నుంచి తమ మధ్య మంచి స్నేహం ఉందని తెలిపాడు. అయితే ఒకవేళ నవ్యస్వామి వచ్చి ప్రపోజ్ చేస్తే మాత్రం ఆలోచిస్తాను అంటూ ఆమెతో రిలేషన్షిప్పై ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం రవికృష్ణ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇక రీసెంట్గా విరూపాక్ష సినిమాలో రవికృష్ణ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
15 ఏళ్ల బంధానికి ముగింపు.. బాలీవుడ్ జంట విడాకులు!
బాలీవుడ్ జంట బర్క బిష్త్, ఇంద్రనీల్ సేన్గుప్తా కొంతకాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే! వీరిద్దరూ ఎప్పటికైనా కలిసిపోతారని అనుకుంటున్న సమయంలో శాశ్వతంగా విడిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిపి ఫ్యాన్స్కు షాకిచ్చారు ఈ దంపతులు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాము విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది బర్క. 'అవును, మేము విడాకులు తీసుకుంటున్నాం. త్వరలోనే అందుకు సంబంధించిన పత్రాలు వచ్చేస్తాయి. నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమిదే! నేను ఇప్పుడు సింగిల్ మదర్ను. నా కూతురు మీరాయే నా సర్వస్వం. ప్రస్తుతం ఓటీటీలో కొన్ని మంచి ప్రాజెక్టులలో నటిస్తున్నాను. టీవీ, సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేసేందుకు సిద్ధం' అని చెప్పుకొచ్చింది బర్క. కాగా బర్క, ఇంద్రనీల్.. 'ప్యార్ కె దో నామ్- ఏక్ రాధ, ఏక్ శ్యామ్' అనే సీరియల్లో జంటగా నటించారు. 2007లో వచ్చిన ఈ సీరియల్ సెట్స్లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. డ్యాన్స్ షో నాచ్ బలియే మూడో సీజన్లోనూ వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు. 2008 మార్చిలో వివాహం చేసుకున్న వీరికి మీరా అనే కూతురు జన్మించింది. ఏమైందో ఏమో కానీ, గత రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగానే జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే విడాకులు తీసుకుంటున్నారు. బర్క.. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్తో పాటు రాజ్నీతి వంటి పలు చిత్రాల్లోనూ నటించింది. ఇంద్రనీల్.. హిందీ, బెంగాలీ భాషల్లో అనేక సినిమాల్లో నటించాడు. తెలుగులో ఐతే 2లోనూ ముఖ్య పాత్ర పోషించాడు. ఇకపోతే ఇంద్రనీల్ బెంగాలీ నటి ఇషా సాహాతో డేటింగ్ చేస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు బర్క కూడా నటుడు ఆశిశ్ శర్మతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ రిలేషన్షిప్పై ఇంతవరకు వీరెవరూ స్పందించనేలేదు. చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement