More

Maharashtra: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌కు రెండోసారి కరోనా

6 Jun, 2022 12:31 IST

సాక్షి, ముంబై: అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు మరోసారి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్‌ చేశారు. శుక్రవారం నుంచి ఆయన లాతూర్‌ పర్యటనలో ఉన్నారు. శనివారం లాతూర్‌లో ఉండగా అస్వస్ధతకు గురికావడంతో పర్యటన ముగించుకు ని సాయంత్రం ముంబైకి చేరుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆదివారం షోలాపూర్‌ పర్యటనను కూ డా రద్దు చేసుకున్నారు.

ప్రస్తుతం ఫడ్నవీస్‌ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యం అందిస్తున్నామని, ఆందోళ న చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు.  ఇదిలాఉండగా ఈనెల 10న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహంపై ఆదివారం సాయంత్రం సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఫడ్నవీస్‌కు కరోనా కారణంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. 
చదవండి: బెడిసికొట్టిన ఏకగ్రీవం.. రాష్ట్రంలో 24 ఏళ్ల తరువాత రాజ్యసభ ఎన్నికలు

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కాలుష్యంతో ఏఏ క్యాన్సర్లు వస్తాయి? 18 ఏళ్లలో ఏం జరిగింది?

నెత్తురోడిన రహదారులు.. రెండు వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి

అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది? ఎదురవుతున్న ఆటంకాలేమిటి?

Madhya Pradesh Elections: సింధియాకు అగ్నిపరీక్ష 

Nov 11th : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌