More

Bike: బైక్‌పై ఇద్దరు పురుషులు ప్రయాణించరాదు.. ఎ‍క్కడో తెలుసా..?

19 Apr, 2022 12:44 IST

తిరువనంతపురం: ద్విచక్రవాహనంపై వెనుక సీటులో పురుషులు ప్రయాణించడంపై నిషేధం విధించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు కేరళలోని పాలక్కడ్‌లో ఈ రూల్‌ అమలులోకి వచ్చింది. కాగా, ఇటీవలే ఆర్​ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసు నేపథ్యంలో ఈ నిబంధన విధించినట్టు తెలిపారు. తాజా నిషేధం నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును ఇచ్చారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20వరకు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ నెల 15వ తేదీన ఆర్​ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్​ షాపులో ఉండగా.. ఇద్దరు వ్యక్తులు వచ్చి దారుణంగా హత్య చేశారు. అయితే, పోలీసుల విచారణలో ఈ హత్య అదే రోజున ఎస్​డీపీఐ కార్యకర్త సుబెయిర్ హత్యకు ప్రతీకారంగానే జరిగినట్టు తెలిసింది. దీంతో ఒకే రోజులో ఇలా రెండు హత్యలు జరగడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ రెండు హత్యలే కాక మరిన్ని మర్డర్లకు ప్లాన్స్‌ చేసినట్టు పోలీసులకు సమాచారాం అందింది. దీంతో అడిషన్​ డిస్ట్రిక్ట్​ మెజిస్ట్రేట్​.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రూల్‌ నుంచి పిల్లలు, మహిళలను మాత్రం మినహాయించారు. 
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌: 51 టెంకాయలు ఆర్డర్‌.. ‘ఎక్స్‌’ పోస్ట్‌ వైరల్‌!

గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు.. ఎయిర్‌పోర్టు మూసివేత

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌: బీజేపీ ట్వీట్‌కు కాంగ్రెస్ రీట్వీట్..!

వాళ్లు ఒకరినొకరు రనౌట్‌ చేసుకునే బ్యాట్స్‌మెన్‌: ప్రధాని మోదీ