అహ్మదాబాద్: దేశమంతా ప్రస్తుతం వైల్డ్లైఫ్ వారోత్సవాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలోనే గుజరాత్ గిర్ ఫారెస్ట్లో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. 32 సెకన్ల నిడివి గల ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. గిర్ ఫారెస్ట్లో పనిచేసే ఒక వ్యక్తి తన పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. అయితే అతను వెళ్లే మార్గ మధ్యలో కొన్ని సింహాలు కూర్చొని ఉన్నాయి.
అయితే అతను ఆ సింహాలతో గుజరాతీలో మాట్లాడాడు. తాను తన పనిని ముగించుకున్నానని, ఇక ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని వాటితో చెప్పాడు.
తాను పని చేసి అలిసిపోయానని, తనకు వెళ్లడానికి దారినివ్వాలని వాటిని కోరాడు. అయితే ఆ తరువాత ఆ సింహాలు ఏం చేశారో చూస్తే మీరు అవాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే మనుషులను చూడగానే పైకి వచ్చి చంపేసే సింహాలు అతనికి దారి నిచ్చి ఆ మార్గం నుంచి తప్పుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ‘సామరస్యపూర్వక సహజీవనానికి అందమైన ఉదాహరణ’ ఆయన ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.