More

SA Vs ENG: రబడా పాంచ్‌ పటాకా.. భారీ ఆధిక్యం దిశగా సౌతాఫ్రికా

19 Aug, 2022 07:52 IST

లండన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. దాంతో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సారెల్‌ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్‌ (47), కేశవ్‌ మహరాజ్‌ (41), మార్కో జాన్సెన్‌ (41 బ్యాటింగ్‌) రాణించారు. బెన్‌ స్టోక్స్‌కు 3 వికెట్లు దక్కాయి.

అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 116/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్‌ (73) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  పేస్‌ బౌలర్‌ రబడాకు 5 వికెట్లు దక్కగా, నోర్జే 3 వికెట్లు తీశాడు.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ICC ODI World Cup 2023, India vs Netherlands: భారత్‌ 9/9

క్రికెట్‌ చరిత్రలో పెను సంచలనం.. 6 బంతుల్లో 6 వికెట్లు

ప్రపంచ క్రికెట్‌లో రోహిత్ లాంటి ఆటగాడు మరొకరు లేరు: పాక్‌ లెజెండ్‌

భారత్‌- న్యూజిలాండ్‌ సెమీస్‌కు అంపైర్‌లు వీరే.. 2019 వరల్డ్‌కప్‌లో కూడా

న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌.. ముంబైకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్‌