రోహిత్‌ నేడు జట్టుతో...

Published on Wed, 12/30/2020 - 04:11

మెల్‌బోర్న్‌: ఎట్టకేలకు రోహిత్‌ శర్మ ఆస్ట్రేలియాలో ఆడేందుకు కావాల్సిన లాంఛనాలన్నీ పూర్తి చేసుకున్నాడు. క్వారంటైన్‌ అనంతరం నేడు అతను మెల్‌బోర్న్‌లో భారత జట్టుతో కలవనున్నాడు. ఐపీఎల్‌లో గాయమైన నాటినుంచి పలు మలుపులు, వివాదాలు, డ్రామా, ఫిట్‌నెస్‌ పరీక్షల అనంతరం రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చిన అతను కఠిన క్వారంటైన్‌ నిబంధనలను పాటించాల్సి వచ్చింది. బుధవారం సహచరులతో కలిసిన తర్వాత అతను సాధన ప్రారంభించే అవకాశం ఉంది. తాము ఐదు బౌలర్ల వ్యూహానికి కట్టుబడి ఉన్నామని... క్వారంటైన్‌ తర్వాత రోహిత్‌ శర్మ మానసిక స్థితి, మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ ఎలా ఉన్నాయో చూసిన తర్వాతే ఆడేంచే విషయం నిర్ణయం తీసుకుంటామని రవిశాస్త్రి వెల్లడించాడు. అయితే మూడో టెస్టుకు తగినంత సమయం ఉండటంతో పాటు, మయాంక్‌ అగర్వాల్‌ వరుస వైఫల్యాలతో అతని స్థానంలో రోహిత్‌ మ్యాచ్‌ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ