-
మెరిసిన షఫాలీ: భారత్దే టి20 సిరీస్
సిల్హెట్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయంతో మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే టి20 సిరీస్ను 3–0తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టి20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. తొలుత బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఓపెనర్ దిలారా అక్తర్ (27 బంతుల్లో 39; 5 ఫోర్లు), కెప్టెన్ నిగర్ సుల్తానా (36 బంతుల్లో 28; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ (2/22), శ్రేయాంక (1/25), రేణుక (1/25), పూజ (1/26) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 18.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (38 బంతుల్లో 51; 8 ఫోర్లు), స్మృతి మంధాన (42 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 91 పరుగులు జోడించడంతో విజయం మరింత సులువైంది. ఈ నెల 6న నాలుగో టి20 కూడా ఇదే వేదికపై జరుగనుంది. -
క్వార్టర్ ఫైనల్స్లో ముగిసిన భారత్ పోరు
చెంగ్డూ: థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–3తో 10 సార్లు చాంపియన్ చైనా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో ప్రణయ్ 21–15, 11–21, 14–21తో షి యుకి చేతిలో... రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 15–21, 21–11, 12–21తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్లో లక్ష్య సేన్ 13–21, 21–8, 21–14తో లి షి ఫెంగ్పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్లో సాయిప్రతీక్–ధ్రువ్ కపిల 10–21, 10–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు చేతిలో ఓటమి పాలవ్వడంతో భారత పరాజయం ఖరారైంది. ఉబెర్ కప్ మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్లో ద్వితీయ శ్రేణి క్రీడాకారిణులతో బరిలోకి దిగిన భారత జట్టు 0–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో అషి్మత 10–21, 22–20, 15–21తో అయా ఒహోరి చేతిలో... ప్రియ–శ్రుతి మిశ్రా 8–21, 9–21తో నామి మత్సుయామ–చిహారు షిదా చేతిలో... ఇషారాణి 15–21, 12–21తో ఒకుహారా చేతిలో ఓడిపోయారు. -
India T20 WC Squad: ప్రపంచకప్ వేటకు సిద్ధం
టి20 ప్రపంచకప్ సమరాన్ని గెలిచేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరోసారి అనుభవాన్నే నమ్ముకుంది. ఐపీఎల్లో అద్భుత బ్యాటింగ్తో కొందరు కుర్రాళ్లు అదరగొడుతున్నా... సీనియర్లకు ప్రాధాన్యతనిచ్చింది. దీంతో పాటు ప్రస్తుతం ఫామ్ గొప్పగా లేకున్నా... అంతర్జాతీయ మ్యాచ్లలో ఇప్పటికే ఎంతో కొంత ప్రభావం చూపించిన వారిపైనే కమిటీ విశ్వాసం ఉంచింది. గత టి20 వరల్డ్ కప్లో ఆడిన 9 మందికి ఈసారి మళ్లీ అవకాశం కర్నీచింది. అందుకే వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్ దాదాపుగా అంచనాలకు తగినట్లుగానే సాగింది. ఒకరిద్దరు ఆటగాళ్ల ఎంపిక విషయంలో కాస్త ఆశ్చర్యకర నిర్ణయాలు కనిపించినా... మొత్తంగా అర్హత కలిగిన వారికే అమెరికా–వెస్టిండీస్ వీసా లభించింది. గత వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత పూర్తిగా కుర్రాళ్లతో టి20ల్లో బోర్డు కొత్త ప్రయోగాలు చేసినా... తర్వాతి మెగా టోర్నీకి వచ్చేసరికి మళ్లీ తమ పాత ప్రణాళికకే కట్టుబడటం చెప్పుకోదగ్గ అంశం. అహ్మదాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 9వ టి20 ప్రపంచకప్ కోసం భారత సెలక్టర్లు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బోర్డు సెలక్షన్ కమిటీ మంగళవారం సమావేశమై ఆటగాళ్లను ఎంపిక చేసింది. రోహిత్ శర్మ వరుసగా రెండో టి20 ప్రపంచకప్లో కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనుండగా... 2022లో ఆ్రస్టేలియా గడ్డపై టి20 వరల్డ్ కప్లో ఆడిన వారిలో 9 మంది ఈసారీ టీమిండియా చాన్స్ దక్కించుకున్నారు. గత టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. సెలక్టర్లు ప్రకటించిన జట్టులో నలుగురు బ్యాటర్లు, ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు, ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, నలుగురు ఆల్రౌండర్లు ఉన్నారు. మరో నలుగురు ఆటగాళ్లను ‘రిజర్వ్’లుగా కూడా ఎంపిక చేశారు. జూన్ 1 నుంచి 29 వరకు జరిగే వరల్డ్ కప్లో గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్ జూన్ 5న తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడుతుంది.ఆ తర్వాత జూన్ 9, 12, 15 తేదీల్లో వరుసగా పాకిస్తాన్, అమెరికా, కెనడా జట్లను టీమిండియా ఎదుర్కొంటుంది. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ చేరని జట్ల ఆటగాళ్లతో కూడిన మొదటి బృందం ఈ నెల 21న ముందుగా కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు అమెరికాకు బయల్దేరుతుంది. జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్ ), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ సామ్సన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్‡్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. రిజర్వ్ ఆటగాళ్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్. ఐపీఎల్ ప్రదర్శనతోనే... జట్టు ఎంపికలో తాజా ఐపీఎల్ ప్రదర్శనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారా అంటే అవునని, కాదని కూడా సమాధానం వస్తుంది. చెన్నై తరఫున మిడిలార్డర్లో సిక్సర్లతో చెలరేగిపోతున్న శివమ్ దూబేకు ఐపీఎల్ కారణంగానే పిలుపు దక్కింది. ఈ టోర్నీలో అతను ఏకంగా 172.41 స్ట్రయిక్రేట్తో 350 పరుగులు సాధించాడు. భారత్కు ఆడిన 21 టి20ల్లో కూడా అతను ఆకట్టుకున్నాడు. ఇక కారు ప్రమాదం నుంచి కోలుకొని ఐపీఎల్లో రాణిస్తున్న రిషభ్ పంత్ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. లీగ్లో అతను 158.58 స్ట్రయిక్రేట్తో 398 పరుగులు చేశాడు. అయితే పరుగులకంటే పూర్తి ఫిట్గా పంత్ కనిపించడం కూడా సానుకూలాంశంగా మారింది. మరోవైపు రెండో వికెట్ కీపర్గా కేరళకు చెందిన సంజూ సామ్సన్ కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా రాజస్తాన్ రాయల్స్ టీమ్ను సమర్థంగా నడిపించడంతో పాటు 161.08 స్ట్రయిక్రేట్తో సామ్సన్ 385 పరుగులు సాధించాడు. ఎవరు... ఎందుకు... ఎలా? 2022 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన ఆడిన జట్టుతో పోలిస్తే రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, పంత్, హార్దిక్, అక్షర్, అర్‡్షదీప్, చహల్, బుమ్రా (టోర్నీకి ముందు గాయంతో తప్పుకున్నాడు) తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. 2021, 2022లో వరల్డ్ కప్లలో ఆడిన జట్టులో దాదాపు అదే టాప్–6 ఇప్పుడు కూడా మళ్లీ ఎంపికయ్యారు. కేఎల్ రాహుల్ స్థానంలో యశస్వి రావడం మినహా ఎలాంటి మార్పూ లేదు. యశస్వి ఈ సీజన్ ఐపీఎల్లో వరుస వైఫల్యాల తర్వాత సెంచరీతో ఆకట్టుకోవడంతో అతనికి అవకాశం దక్కింది. బ్యాటింగ్లో ఇప్పుడు కావాల్సిన ‘ఫైర్’ లేదని ఎన్ని విమర్శలు వస్తున్నా అగ్రశ్రేణి బ్యాటర్లుగా రోహిత్, కోహ్లిల స్థానం ఎప్పుడూ ప్రశ్నార్ధకం కాదు. సూర్యకుమార్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. రవీంద్ర జడేజా కూడా గొప్ప ప్రదర్శన చేయకపోయినా ఆల్రౌండ్ నైపుణ్యం అతనికి కలిసొచ్చింది. జడేజా ఉన్న తర్వాత అక్షర్ పటేల్ ఎంపిక కూడా కాస్త ఆశ్చర్యకరమే. హార్దిక్ మళ్లీ... ఇటీవల ఆటలో వైఫల్యాలతో పాటు ముంబై కెప్టెన్సీ వ్యవహారాలతో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాకు సెలక్టర్లు మాత్రం అండగా నిలిచారు. వన్డే వరల్డ్ కప్లో గాయపడి కోలుకున్న తర్వాత భారత్కు ఆడకపోయినా అతనిపై నమ్మకముంచారు. ఐపీఎల్లోనూ విఫలమైనా... అతని తరహాలో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ స్థానం కోసం ప్రత్యామ్నాయం లేక ఎంపిక చేయక తప్పలేదు. దూబే అస్సలు బౌలింగ్ చేయకపోవడం, హార్దిక్ ఎన్నో కొన్ని ఓవర్లు వేస్తుండటం వల్ల కూడా అతని స్థానానికి ఢోకా లేకుండా పోయింది. నలుగురు స్పిన్నర్లతో... అమెరికాలో తొలిసారి వరల్డ్ కప్ జరుగుతుండంతో కొత్తగా అక్కడ తయారు చేస్తున్న పిచ్లు ఎలా ఉంటాయో సరిగ్గా ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. అయితే స్పిన్కు అవకాశం ఉంటే తమ అన్ని అస్త్రాలను వాడుకునేందుకు భారత్ సిద్ధమైంది. జడేజా, అక్షర్లతో పాటు కుల్దీప్, యుజువేంద్ర చహల్లు జట్టులో ఉన్నారు. కుల్దీప్ చాలా కాలంగా మంచి ఫామ్లో ఉండగా... గత రెండు సిరీస్లలో భారత జట్టులో చోటు దక్కించుకోని చహల్ పునరాగమనం చేసి తొలిసారి టి20 వరల్డ్కప్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు వీరిని వాడుకోవచ్చు. బుమ్రాకు తోడుగా అర్‡్షదీప్, సిరాజ్లను ఎంపిక చేశారు. ఈ ఫార్మాట్లో గొప్ప ప్రదర్శన లేకపోయినా, ఐపీఎల్లోనూ పెద్దగా రాణించలేకపోతున్నా... ప్రస్తుత స్థితిలో అనుభవం ఉన్న పేసర్ అతనే కావడంతో సిరాజ్కు తొలిసారి టి20 ప్రపంచకప్ ఆడే చాన్స్ లభించింది. లెఫ్టార్మ్ పేసర్ కావడమే అర్‡్షదీప్ బలం. కొంత కాలంగా లయ కోల్పోయి ఇబ్బంది పడుతున్నా అర్‡్షదీప్ను సెలక్టర్లు మళ్లీ నమ్మారు. గత వరల్డ్ కప్లో సెమీస్ ఓటమి తర్వాత మళ్లీ అంతర్జాతీయ టి20 ఆడని రాహుల్ను తప్పించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతని స్ట్రయిక్రేట్ కూడా అంతంత మాత్రమే. రాహుల్ తరహాలోనే శుబ్మన్ గిల్ కూడా ఈ ఫార్మాట్లో పెద్దగా ప్రభావం చూపించింది లేదు. పాపం రింకూ సింగ్... వరల్డ్ కప్ జట్టు ఎంపికలో అన్ని రకాలుగా చర్చకు దారి తీసిన విషయం రింకూ సింగ్ను ఎంపిక చేయకపోవడం. విధ్వంసకర బ్యాటింగ్తో గత ఏడాది ఐపీఎల్ నుంచి అతను తానేంటో నిరూపించుకున్నాడు. లోయర్ మిడిలార్డర్లో ఫినిషర్గా సత్తా చాటాడు.భారత్ తరఫున లభించిన పరిమిత అవకాశాల్లో (11 ఇన్నింగ్స్లు) ఏకంగా 176.23 స్ట్రయిక్ రేట్, 89 సగటుతో పరుగులు సాధించాడు. కానీ చివరకు వచ్చేసరికి అతనికి వరల్డ్ కప్ చాన్స్ లభించలేదు. ఈసారి ఐపీఎల్లో గొప్పగా ఆడకపోవడం వాస్తవమే అయినా కోల్కతా టాపార్డర్ రాణిస్తుండటంతో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. 9 మ్యాచ్లలో కేవలం 82 బంతులే ఆడే చాన్స్ దక్కింది. మిడిలార్డర్లో భారీ షాట్లు కొట్టే సామర్థ్యం ఉన్న బ్యాటర్ కోసం జరిగిన చర్చలో రింకూపై దూబేదే పైచేయి అయింది. ఒకవేళ తుది జట్టులో హార్దిక్ను తప్పించాల్సి వచ్చినా... దూబే బౌలింగ్ ఎంతో కొంత ఉపయోగపడగలదని సెలక్టర్లు భావించారు. రోహిత్ శర్మవయసు: 37 ఆడిన టి20లు: 151 చేసిన పరుగులు: 3974 అత్యధిక స్కోరు: 121 నాటౌట్ సెంచరీలు: 5 అర్ధ సెంచరీలు: 29 స్ట్రయిక్రేట్: 139.97 ఆడిన టి20 ప్రపంచకప్లు: 8 విరాట్ కోహ్లి వయసు: 35 ఆడిన టి20లు: 117 చేసిన పరుగులు: 4037 అత్యధిక స్కోరు: 122 నాటౌట్ సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 37 స్ట్రయిక్రేట్: 138.15 ఆడిన టి20 ప్రపంచకప్లు: 5సూర్యకుమార్వయసు: 33 ఆడిన టి20లు: 60 చేసిన పరుగులు: 2141 అత్యధిక స్కోరు: 117 సెంచరీలు: 4 అర్ధ సెంచరీలు: 17 స్ట్రయిక్రేట్: 171.55 ఆడిన టి20 ప్రపంచకప్లు: 2 హార్దిక్ పాండ్యా వయసు: 30 ఆడిన టి20లు: 92 చేసిన పరుగులు: 1348 అత్యధిక స్కోరు: 71 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 స్ట్రయిక్రేట్: 139.88 తీసిన వికెట్లు: 73 ఆడిన టి20 ప్రపంచకప్లు: 3 రిషభ్ పంత్ వయసు: 26 ఆడిన టి20లు: 66 చేసిన పరుగులు: 987 అత్యధిక స్కోరు: 65 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 స్ట్రయిక్రేట్: 126.37 ఆడిన టి20 ప్రపంచకప్లు: 2 శివమ్ దూబే వయసు: 30 ఆడిన టి20లు: 21 చేసిన పరుగులు: 276 అత్యధిక స్కోరు: 63 నాటౌట్ అర్ధ సెంచరీలు: 3 తీసిన వికెట్లు: 8 స్ట్రయిక్రేట్: 145.26 ఇదే తొలి టి20 వరల్డ్కప్ అర్‡్షదీప్ సింగ్వయసు: 25 ఆడిన టి20లు: 44 తీసిన వికెట్లు: 62 ఉత్తమ బౌలింగ్: 4/37 ఆడిన టి20 ప్రపంచకప్లు: 1 యుజువేంద్ర చహల్ వయసు: 33 ఆడిన టి20లు: 80 తీసిన వికెట్లు: 96 ఉత్తమ బౌలింగ్: 6/25 ఇదే తొలి టి20 వరల్డ్కప్ కుల్దీప్ యాదవ్ వయసు: 29 ఆడిన టి20లు: 35 తీసిన వికెట్లు: 59 ఉత్తమ బౌలింగ్: 5/17 ఇదే తొలి టి20 వరల్డ్కప్ రవీంద్ర జడేజావయసు: 35 ఆడిన టి20లు: 66 చేసిన పరుగులు: 480 అత్యధిక స్కోరు: 46 నాటౌట్ స్ట్రయిక్రేట్: 125.32 తీసిన వికెట్లు: 53 ఆడిన టి20 ప్రపంచకప్లు: 5 సంజూ సామ్సన్ యశస్వి జైస్వాల్ వయసు: 22 ఆడిన టి20లు: 17 చేసిన పరుగులు: 502 అత్యధిక స్కోరు: 100 సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 4 స్ట్రయిక్రేట్: 161.93 ఇదే తొలి టి20 వరల్డ్కప్ జస్ప్రీత్ బుమ్రావయసు: 30 ఆడిన టి20లు: 62 తీసిన వికెట్లు: 74 ఉత్తమ బౌలింగ్: 3/11 ఆడిన టి20 ప్రపంచకప్లు: 2 మొహమ్మద్ సిరాజ్ వయసు: 30 ఆడిన టి20లు: 10 తీసిన వికెట్లు: 12 ఉత్తమ బౌలింగ్: 4/17 ఇదే తొలి టి20 వరల్డ్కప్ అక్షర్ పటేల్ వయసు: 30; ఆడిన టి20లు: 52 చేసిన పరుగులు: 361 తీసిన వికెట్లు: 49ఉత్తమ బౌలింగ్: 3/9 ఇదే తొలి టి20 వరల్డ్కప్ -
అమిత్కు పిలుపు హుసాముద్దీన్పై వేటు
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ వరల్డ్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ చివరి టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. గత నెలలో జరిగిన తొలి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు తొమ్మిది కేటగిరీల్లో బరిలోకి దిగినా ఒక్కరు కూడా ఒలింపిక్స్ బెర్త్ను దక్కించుకోలేకపోయారు. తొలి టోర్నీలో పాల్గొన్న ఐదుగురు బాక్సర్లపై (దీపక్ భోరియా, హుసాముద్దీన్, శివ థాపా, లక్ష్య చహర్, జాస్మిన్) వేటు పడింది. దీపక్ స్థానంలో 2022 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అమిత్ పంఘాల్కు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కింది. తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ స్థానంలో సచిన్ సివాచ్ను ఎంపిక చేశారు. చివరి క్వాలిఫయింగ్ టోర్నీ మే 25 నుంచి జూన్ 2 వరకు బ్యాంకాక్లో జరుగుతుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి మహిళల విభాగంలో నలుగురు బాక్సర్లు (నిఖత్ జరీన్, ప్రీతి, పరీ్వన్, లవ్లీనా) పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. భారత బాక్సింగ్ జట్టు: పురుషుల విభాగం: అమిత్ పంఘాల్ (51 కేజీలు), సచిన్ సివాచ్ (57 కేజీలు), అభినాష్ జమ్వాల్ (63.5 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు), అభిమన్యు (80 కేజీలు), సంజీత్ (92 కేజీలు), నరేందర్ (ప్లస్ 92 కేజీలు). మహిళల విభాగం: అంకుశిత (60 కేజీలు), అరుంధతి (66 కేజీలు). -
మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని భారత్ గెలుపు
చాంగ్షా (చైనా): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు రెండో విజయం సాధించింది. చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్లో భారత్ 2–1తో నెగ్గింది. తొలి మ్యాచ్లో రుతుజా భోస్లే 6–3, 6–2తో హావో చింగ్ చాన్ను ఓడించింది. రెండో మ్యాచ్ లో అంకిత రైనా 6–2, 4–6, 4–6తో ఎన్ షువో లియాంగ్ చేతిలో ఓటమి పాలైంది. నిర్ణాయక మూడో మ్యాచ్లో అంకిత–ప్రార్థన జోడీ 4–6, 6–1, 15–13తో హావో చింగ్ చాన్–ఎన్ షువో లియాంగ్ జంటపై గెలిచి భారత్కు విజయాన్ని అందించింది. టైబ్రేక్లో అంకిత జోడీ మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. -
విజయమే లక్ష్యంగా...
అభా (సౌదీ అరేబియా): ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా నేడు అఫ్గానిస్తాన్తో భారత జట్టు తలపడనుంది. తటస్థ వేదిక సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 12:30 నుంచి జరుగుతుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు రెండు మ్యాచ్ లు ఆడింది. ఒక మ్యాచ్లో నెగ్గి, ఒక మ్యాచ్లో ఓడి మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. సునీల్ ఛెత్రి కెప్టెన్సీలో భారత జట్టుకు మరో విజయం లభిస్తే మూడో రౌండ్కు అర్హత పొందేందుకు తమ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. అఫ్గానిస్తాన్తో ముఖాముఖిగా 11 సార్లు తలపడ్డ భారత్ ఏడుసార్లు గెలిచింది. మూడు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్లో ఓడిపోయింది. -
Ind Vs Eng: బంతి గింగిరాలు.. మూడోరోజే ఇంగ్లండ్ కథ ముగిసేనా?
ధర్మశాల టెస్టు మ్యాచ్ రెండో రోజు ఊహించినట్లుగానే అంచనాలకు అనుగుణంగా సాగింది...పటిష్టమైన భారత బ్యాటింగ్ లైనప్ ఇంగ్లండ్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా శుక్రవారం ఆటలో 338 పరుగులు రాబట్టింది...రోహిత్, గిల్ సెంచరీలు పూర్తి చేసుకొని సగర్వంగా నిలవగా...యువ ఆటగాళ్లు పడిక్కల్, సర్ఫరాజ్ భారీ భాగస్వామ్యంతో తమ వంతు పాత్ర పోషించారు. ఒక దశలో ఒక పరుగు తేడాతో మూడు వికెట్లు కోల్పోయినా దాని ప్రభావం జట్టుపై పడలేదు... ఫలితంగా ఇప్పటికే 255 పరుగుల ఆధిక్యంలో నిలిచిన టీమిండియా విజయానికి కావాల్సిన సరంజామాను సిద్ధం చేసుకుంది. సుదీర్ఘ భారత పర్యటనలో తమ చివరి ఇన్నింగ్స్లో భారత స్పిన్నర్లను ఎదుర్కొని ఇంగ్లండ్ ఏమాత్రం పోరాటపటిమ కనబరుస్తుందనేది చూడాలి. ఒకవేళ భారత స్పిన్నర్లు రాణిస్తే మూడోరోజు భారత్ ఘన విజయం సాధించే అవకాశం కూడా ఉంది. ధర్మశాల: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను 4–1తో ముగించే దిశగా భారత జట్టు వేగంగా దూసుకుపోతోంది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 120 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (150 బంతుల్లో 110; 12 ఫోర్లు, 5 సిక్స్లు), రోహిత్ శర్మ (162 బంతుల్లో 103; 13 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్కు 171 పరుగులు జోడించారు. దేవ్దత్ పడిక్కల్ (103 బంతుల్లో 65; 10 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (60 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 97 పరుగులు జత చేయడం విశేషం. శతకాలు పూర్తి... రెండో రోజు ఆటను రోహిత్, గిల్ బౌండరీలతో దూకుడుగా మొదలు పెట్టారు. వీరిని నిలువరించేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. 68 పరుగుల వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్ను క్రాలీ వదిలేయడం భారత్కు కలిసి రాగా, 64 బంతుల్లో గిల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ముఖ్యంగా వుడ్, బషీర్ బౌలింగ్లో భారత బ్యాటర్లు ధారాళంగా పరుగులు రాబట్టారు. ఇదే జోరును కొనసాగిస్తూ మూడు బంతుల వ్యవధిలో ఇద్దరూ శతకాలు పూర్తి చేసుకున్నారు. 154 బంతుల్లో రోహిత్ 12వ టెస్టు సెంచరీ రాగా, 137 బంతుల్లో గిల్ నాలుగో సెంచరీని అందుకున్నాడు. తొలి సెషన్లో భారత్ 30 ఓవర్లలో 129 పరుగులు చేయగా, ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. అయితే లంచ్ తర్వాత వరుస ఓవర్లలో వీరిద్దరు వెనుదిరిగారు. గత జూన్ తర్వాత తొలి సారి బౌలింగ్కు దిగిన స్టోక్స్ తన మొదటి బంతికే రోహిత్ను బౌల్డ్ చేయగా, తర్వాతి ఓవర్లో గిల్ను మరో చక్కటి బంతితో అండర్సన్ బౌల్డ్ చేశాడు. కుర్రాళ్ల జోరు... మూడో వికెట్గా గిల్ అవుటైన సమయంలో భారత్ ఆధిక్యం 61 పరుగులు మాత్రమే! రెండు కీలక వికెట్లు తీసి ఒత్తిడి పెంచేందుకు ఇంగ్లండ్ సిద్ధం కాగా...భారత యువ బ్యాటర్లు పడిక్కల్, సర్ఫరాజ్ దానిని సమర్థంగా అడ్డుకున్నారు. మూడో టెస్టు ఆడుతున్న సర్ఫరాజ్, అరంగేట్ర బ్యాటర్ పడిక్కల్ భాగస్వామ్యం ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లింది. అండర్సన్ ఓవర్లో మూడు ఫోర్లతో ధాటిని చూపిన పడిక్కల్ తొలి 30 పరుగుల్లో 7 ఫోర్లు ఉండటం విశేషం. మరో వైపు ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన సర్ఫరాజ్ ఆ తర్వాత జోరు పెంచాడు. వుడ్ బౌలింగ్లో అతను కొట్టిన 3 ఫోర్లు, సిక్స్ హైలైట్గా నిలిచాయి. బషీర్ ఓవర్లో 2 ఫోర్లతో సర్ఫరాజ్ 55 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో సెషన్లో భారత్ 24 ఓవర్లలో 112 పరుగులు రాబట్టింది. అయితే టీ విరామం తర్వాత తొలి బంతికే సర్ఫరాజ్ వెనుదిరిగాడు. అనంతరం 83 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్న పడిక్కల్ కూడా కొద్దిసేపటికే పెవిలియన్ చేరాడు. జురేల్ (15) ప్రభావం చూపలేకపోగా...హార్ట్లీ ఒకే ఓవ ర్లో జడేజా (15), అశ్విన్ (0)లను వెనక్కి పంపాడు. ఈ దశలో కుల్దీప్ (27 బ్యాటింగ్) పట్టుదల కనబర్చగా, బుమ్రా (19 బ్యాటింగ్) అండగా నిలిచాడు. వీరిద్దరు 18 ఓవర్ల పాటు మరో వికెట్ పడకుండా ఆటను ముగించారు. మూడోరోజు ఆటలో బంతే కీలకం.. భారత జట్టు ఇప్పటికే పటిష్ట స్థితిలో ఉంది. ఇక, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా భారత స్పిన్నర్లు చెలరేగితే నేడే దాదాపు భారత్ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొదటిరోజే కుల్దీప్, అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ను తక్కువ స్కోర్కే ఆలౌట్ చేసింది భారత జట్టు. అదే విధంగా మూడో రోజు కూడా పిచ్ స్పిన్కు అనుకూలిస్తే మన బౌలర్లు తప్పకుండా సత్తా చాటుతారు. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 218; భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (స్టంప్డ్) ఫోక్స్ (బి) బషీర్ 57; రోహిత్ (బి) స్టోక్స్ 103; గిల్ (బి) అండర్సన్ 110; పడిక్కల్ (బి) బషీర్ 65; సర్ఫరాజ్ (సి) రూట్ (బి) బషీర్ 56; జడేజా (ఎల్బీ) (బి) హార్ట్లీ 15; జురేల్ (సి) డకెట్ (బి) బషీర్ 15; అశ్విన్ (బి) హార్ట్లీ 0; కుల్దీప్ (బ్యాటింగ్) 27; బుమ్రా (బ్యాటింగ్) 19; ఎక్స్ట్రాలు 6; మొత్తం (120 ఓవర్లలో 8 వికెట్లకు) 473. వికెట్ల పతనం: 1–104, 2–275, 3–279, 4–376, 5–403, 6–427, 7–427, 8–428. బౌలింగ్: అండర్సన్ 14–1–59–1, వుడ్ 15–1–89–0, హార్ట్లీ 39–3–126–2, బషీర్ 44–5–170–4, స్టోక్స్ 5–1–17–1, రూట్ 3–0–8–0. -
ప్రిక్వార్టర్స్లో భారత జట్ల ఓటమి
బుసాన్: పారిస్ ఒలింపిక్స్ బెర్త్లు ఖరారు కావడానికి అవసరమైన విజయాన్ని భారత మహిళల, పురుషుల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్లు సాధించలేకపోయాయి. పటిష్ట జట్లతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో భారత జట్లు ఓడిపోయి ప్రపంచ టీటీ టీమ్ చాంపియన్షిప్ నుంచి నిష్క్రమించాయి. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్లో భారత మహిళల జట్టు 1–3తో చైనీస్ తైపీ జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 0–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయాయి. అంతకుముందు జరిగిన నాకౌట్ దశ రెండో రౌండ్ మ్యాచ్ల్లో భారత మహిళల జట్టు 3–0తో ఇటలీపై... భారత పురుషుల జట్టు 3–2తో కజకిస్తాన్పై విజయం సాధించాయి. ఈ మెగా ఈవెంట్లో పురుషుల, మహిళల విభాగాల్లో క్వార్టర్ ఫైనల్ చేరిన 8 జట్లు పారిస్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాయి. మార్చి 5న విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–16లో చోటు సంపాదిస్తే భారత జట్లకు పారిస్ ఒలింపిక్ బెర్త్లు లభిస్తాయి. ప్రస్తుతం భారత మహిళల జట్టు 17వ ర్యాంక్లో, భారత పురుషుల జట్టు 15వ ర్యాంక్లో ఉన్నాయి. చైనీస్ తైపీతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్లో భారత నంబర్వన్ మనిక బత్రా 11–8, 8–11, 4–11, 11–9, 11–9తో ప్రపంచ 10వ ర్యాంకర్ చెన్ జు యుపై సంచలన విజయం సాధించి భారత్కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 6–11, 9–11, 5–11తో చెంగ్ ఐ చింగ్ చేతిలో... మూడో మ్యాచ్లో ఐహిక ముఖర్జీ 10–12, 13–15, 11–9, 2–11తో లి యు జున్ చేతిలో... నాలుగో మ్యాచ్లో మనిక బత్రా 10–12, 11–5, 9–11, 5–11తో చెంగ్ ఐ చింగ్ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. కొరియాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్లో హర్మీత్ దేశాయ్ 10–12, 11–13, 7–11తో జాంగ్ వూజిన్ చేతిలో... రెండో మ్యాచ్లో ఆచంట శరత్ కమల్ 9–11, 5–11, 11–8, 4–11తో లిమ్ జాంగ్హూన్ చేతిలో... మూడో మ్యాచ్లో సత్యన్ జ్ఞానశేఖరన్ 5–11, 8–11, 2–11తో లీ సాంగ్ హు చేతిలో ఓటమి పాలయ్యారు. -
పేస్ బౌలర్ల ప్రదర్శన వల్లే...
రాంచీ: ఇంగ్లండ్తో గత రెండు టెస్టుల్లో భారత జట్టు విజయం సాధించడంలో పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారని జట్టు బ్యాటర్ శుబ్మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. పిచ్లు అనుకూలంగా లేకపోయినా కీలక సమయాల్లో వారు చెలరేగడం వల్లే మ్యాచ్లు మనవైపు మొగ్గు చూపాయని అతను అన్నాడు. ఈ సిరీస్లో భారత స్పిన్నర్లు తీసిన 36 వికెట్లతో పోలిస్తే పేసర్లు 22 వికెట్లు తీశారు. ‘సాధారణంగా భారత్లో దాదాపు అన్ని పిచ్లు స్పిన్కు అనుకూలిస్తూనే ఉంటాయి. అశ్విన్, జడేజాలు ఎలాగూ ఇక్కడ వికెట్లు తీయగలరు. కానీ మన ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శనే సిరీస్లో ఇరు జట్ల మధ్య ప్రధాన తేడాగా మారింది. పరిస్థితులకు తగినట్లుగా స్పందించి పేసర్లు జట్టును ముందంజలో నిలిపారు. నాలుగో టెస్టుకు బుమ్రాలాంటి స్టార్ బౌలర్ దూరం కావడం నిరాశ కలిగించేదే. అయినా ఇతర పేసర్లకూ మంచి అనుభవం ఉంది. సిరాజ్ తీసిన నాలుగు వికెట్ల ప్రదర్శనను మరచిపోవద్దు’ అని గిల్ ప్రశంసించాడు. పలువురు కీలక ఆటగాళ్లు దూరం కావడం వల్ల వచ్చిన అవకాశాలను కొత్త ఆటగాళ్లు సమర్థంగా వాడుకున్నారన్న గిల్... సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్లను ఉదాహరణగా చూపించాడు. తనపై తాను పెట్టుకున్న అంచనాల కారణంగానే కొన్నిసార్లు నిరాశను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇప్పుడు వాటిని అధిగమించి భారీ స్కోర్లపై దృష్టి పెట్టినట్లు అతను చెప్పాడు. తొలి టెస్టులో శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయినా భారత జట్టు...ఆ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకొని తర్వాతి రెండు టెస్టుల్లో ప్రత్యరి్థపై ఒత్తిడి పెంచినట్లు గిల్ గుర్తు చేసుకున్నాడు. -
భారత్ను గెలిపించిన శ్రీజేశ్
పురుషుల ప్రొ హాకీ లీగ్లో భాగంగా ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ‘షూటౌట్’లో 4–2తో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్కు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో భారత్కిది రెండో విజయం. ‘షూటౌట్’లో గోల్కీపర్ శ్రీజేశ్ నెదర్లాండ్స్ జట్టు రెండు ప్రయత్నాలను నిలువరించి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. -
కోహ్లి ఆడటం లేదు!
న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి 13 ఏళ్ల టెస్టు కెరీర్లో క్రికెటేతర కారణాలతో తొలిసారి పూర్తిగా ఒక టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. వ్యక్తిగత సమస్యల కారణంగా ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆడని కోహ్లి ఇప్పుడు మిగిలిన మూడు టెస్టులనుంచి కూడా తప్పుకున్నాడు. అతను చివరి మూడు టెస్టులు ఆడటంపై మొదటినుంచీ సందేహంగానే ఉన్నా శనివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. కోహ్లి సమస్య ఏమిటనేది బయటకు తెలియకపోయినా బోర్డు ఉన్నతాధికారులకు అతని గైర్హాజరుపై స్పష్టత ఉంది. అయితే జట్టును ఎంపిక చేసే ముందు మరోసారి అతనితో మాట్లాడిన తర్వాతే సెలక్టర్లు టీమ్ను ప్రకటించారు. రోహిత్ శర్మ నాయకత్వంలో 17 మంది సభ్యుల బృందాన్ని మిగిలిన మూడు టెస్టుల కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. గాయాల కారణంగా వైజాగ్ టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలను జట్టులోకి ఎంపిక చేశారు. అయితే వీరు ఆడటం ఫిట్నెస్కు లోబడి ఉంటుందని సెలక్టర్లు స్పష్టం చేశారు. రాహుల్ ఇప్పటికే పూర్తిగా కోలుకున్నాడని సమాచారం ఉండగా జడేజా తన సొంత మైదానంలో మ్యాచ్ ఆరంభ సమయానికి కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. వరుస వైఫల్యాలతో... టీమ్ ఎంపికలో కీలక మార్పు శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టడమే. అతను వెన్ను నొప్పితో బాధపడుతూ మూడో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉందని రెండు రోజుల క్రితం వినిపించింది. అయితే అంతర్గత సమాచారం ప్రకారం శ్రేయర్ పూర్తి ఫిట్గా సెలక్షన్కు అందుబాటులో ఉన్నాడని...అతని పేలవ ఫామ్ కారణంగానే వేటు పడినట్లు తెలిసింది. ఈ సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్లలో అతను వరుసగా 35, 13, 27, 29 పరుగులు మాత్రమే చేశాడు. స్పిన్ను చాలా బాగా ఆడగలడని పేరున్న అయ్యర్ సొంత గడ్డపై ఇలా విఫలం కావడంతో సెలక్టర్లు పక్కన పెట్టక తప్పలేదు. గత 13 ఇన్నింగ్స్లలో అతను ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేదు. సిరాజ్ వచ్చేశాడు... పనిభారం కారణంగా గత టెస్టులో విశ్రాంతినిచ్చిన హైదరాబాదీ పేసర్ సిరాజ్ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. మరో పేసర్ ముకేశ్ కుమార్ కూడా తన స్థానం నిలబెట్టుకున్నాడు. ముగ్గురు పేసర్లు అందుబాటులో ఉన్నా... సెలక్టర్లు మరో పేసర్ ఆకాశ్దీప్ను ఎంపిక చేశారు. బెంగాల్కు చెందిన ఆకాశ్ 29 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 103 వికెట్లు తీశాడు. ఇటీవల దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు ఎంపికైనా...మ్యాచ్ అవకాశం రాలేదు. శనివారం ప్రకటించిన జట్టునుంచి అవేశ్, సౌరభ్ కుమార్లను తప్పించగా...జురేల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. రాహుల్ మైదానంలోకి దిగినా...అయ్యర్ స్థానంలో వీరిద్దరిలో ఒకరు ఆడటం ఖాయం. భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 15నుంచి రాజ్కోట్లో, 23నుంచి రాంచీలో, మార్చి 7నుంచి ధర్మశాలలో మూడు, నాలుగు, ఐదు టెస్టులు జరుగుతాయి. జట్టు వివరాలు: రోహిత్ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి, గిల్, రాహుల్, పటిదార్, సర్ఫరాజ్, జురేల్, భరత్, అశ్విన్, జడేజా, అక్షర్, సుందర్, కుల్దీప్, సిరాజ్, ముకేశ్, ఆకాశ్దీప్. -
విశాఖ టెస్ట్..భారత్ సిరీస్ సమం చేస్తుందా ?
-
Visakha Test Match: రోహిత్ పైనే భారం
విశాఖ స్పోర్ట్స్: ఒకవైపు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తదితర కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం... మరోవైపు అనుభవంలేని యువ ఆటగాళ్లు... తొలి టెస్టులో ఊహించని పరాజయం... ఈ నేపథ్యంలో వైజాగ్లోని వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శుక్రవారం నుంచి ఇంగ్లండ్తో జరిగే రెండో టెస్టులో భారత ప్రదర్శన ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొని ఉంది. ఈ వేదికపై భారత జట్టు ఇప్పటి వరకు రెండు టెస్టులు ఆడింది. ఆ రెండింటిలోనూ భారత జట్టే గెలిచింది. కోహ్లి కెప్టెన్సీలో 2016 నవంబర్ 17 నుంచి 21 వరకు ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో టీమిండియా 246 పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం 2019 అక్టోబర్ 2 నుంచి 6 వరకు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో కోహ్లి సారథ్యంలోనే భారత జట్టు 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. క్రితంసారి ఇక్కడ ఆడిన భారత టెస్టు జట్టు నుంచి కేవలం రోహిత్ , అశ్విన్ మాత్రమే ఈసారి ఆడుతున్నారు. నాటి టెస్టులో రోహిత్ రెండు సెంచరీలతో (తొలి ఇన్నింగ్స్లో 176; రెండో ఇన్నింగ్స్లో 127) అదరగొట్టాడు. ఫలితంగా బ్యాటింగ్ విషయంలో ఈసారీ రోహిత్ శర్మపైనే అధిక భారం పడనుంది. మరోసారి రోహిత్ మెరిసి... యశస్వి, అయ్యర్ ఇతర ఆటగాళ్లు కూడా రాణిస్తే విశాఖపట్నంలో భారత జట్టు ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంటుంది. సంయమనం అవసరం: కోచ్ రాథోడ్ యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నారు. ఒకట్రెండు మ్యాచ్లతో వారి సత్తాపై అంచనాకు రావొద్దని ఆయన కోరారు. బుధవారం ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు. ప్రాక్టీస్ సెషన్ అనంతరం విక్రమ్ రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ప్రస్తుత భారత జట్టులోని శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఎక్కువ టెస్టు మ్యాచ్లు ఆడలేదు. వారి విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. వారిపట్ల సంయమనంతో వ్యవహరించాలి. అయ్యర్ త్వరలోనే ఫామ్లోకి వస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నా. పిచ్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడటం అలవాటు చేసుకోవాలి. పరుగులు చేసేందుకు అవకాశాలు ఉంటే వాటిని సది్వనియోగం చేసుకోవాలి. షాట్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి’ అని రాథోడ్ వ్యాఖ్యానించారు. -
ఇస్లామాబాద్లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
ఇస్లామాబాద్: డేవిస్కప్ గ్రూప్–1 ప్లేఆఫ్ పోరులో భాగంగా పాకిస్తాన్ జట్టుతో తలపడేందుకు 1964 తర్వాత భారత జట్టు మళ్లీ పాకిస్తాన్లో అడుగు పెట్టింది. రామ్కుమార్, శశికుమార్ ముకుంద్, యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ, దిగ్వి జయ్లతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని భారత బృందంలో ఉన్నారు. చివరిసారిగా భారత్, పాక్లు 1964లో పాక్ గడ్డపై పోటీపడ్డాయి. 2019లోనూ పాకిస్తాన్లో భారత జట్టు పర్యటించాల్సి ఉండగా... ఈ మ్యాచ్ను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) తటస్థ వేదిక కజకిస్తాన్కు మార్చింది. ఈ పోరులో భారత్ 4–1తో పాకిస్తాన్ను ఓడించింది. ఈసారి మాత్రం పాకిస్తాన్లో భారత జట్టు ఆడాల్సిందేనని, వేదిక మార్చడం వీలుకాదని ఐటీఎఫ్ స్పష్టం చేసింది. భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెపె్టన్రోహిత్ రాజ్పాల్ వ్యక్తిగత కారణాలతో పాకిస్తాన్కు వెళ్లలేకపోవడంతో జీషాన్ అలీ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. కోచ్గా వచ్చిన జీషాన్ నాన్ ప్లేయింగ్ కెపె్టన్గానూ వ్యవహరిస్తాడు. -
విజయమే లక్ష్యంగా సిరియాతో బరిలోకి...
ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన భారత జట్టు నేడు జరిగే గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో సిరియా జట్టుతో ఆడుతుంది. సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను జియో సినియా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్లో సిరియాపై తప్పనిసరిగా నెగ్గాలి. ఇతర గ్రూప్ల ఫలితాలు కూడా తమకు అనుకూలించాలని ఆశించాలి. -
స్పిన్ పిచ్లే సిద్ధం చేస్తే...
ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు అన్నీ స్పిన్ పిచ్లే తయారు చేస్తుందని భావించడం లేదని ఆ జట్టు సీనియర్ ఆటగాడు జానీ బెయిర్స్టో అభిప్రాయ పడ్డాడు. ప్రస్తుతం భారత పేస్ బౌలింగ్ దళం చాలా పటిష్టంగా ఉందని, అన్నీ స్పిన్ పిచ్లే ఉంటే వారి ప్రభావం తగ్గిపోతుందని అతను అన్నాడు. భారత్లో జరిగిన గత సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్లలో బెయిర్స్టో మూడు సార్లు డకౌటయ్యాడు. ‘సిరీస్లో మాకు వేర్వేరు తరహాలో పిచ్లు ఎదురవడం ఖాయం. అయితే అన్నీ టర్న్ కాకపోవచ్చు. వారి పేస్ బౌలింగ్ ఇటీవల ఎలా ఉందో మేం చూస్తున్నాం. ఇప్పుడు పేస్ కూడా వారి బలం కాబట్టి తొలి రోజునుంచే టర్న్ అయ్యే పిచ్లు తయారు చేయకపోవచ్చు. అయితే ఎలా ఉన్నా పరిస్థితులకు తగినట్లుగా మా బ్యాటింగ్ను మార్చుకునేందుకు మేం సిద్ధంగా ఉండాలి. అశ్విన్, జడేజా, అక్షర్... ఇలా బౌలర్ ఎవరైనా కావచ్చు. మేం అతిగా ఆలోచించడం లేదు. గత సిరీస్లో చెన్నైలో మేం కూడా టెస్టు మ్యాచ్ గెలిచామనే సంగతి మరచిపోవద్దు’ అని బెయిర్స్టో చెప్పాడు. 2021లో జరిగిన సిరీస్ను భారత్ 3–1తో సొంతం చేసుకుంది. -
భారత మహిళల విజయగర్జన
ముంబై: ఆ్రస్టేలియా మహిళలతో వన్డే సిరీస్ను 0–3తో చేజార్చుకున్న భారత జట్టు టి20 సిరీస్లో మెరుపు విజయంతో శుభారంభం చేసింది. ముందుగా చక్కటి బౌలింగ్తో ఆసీస్ను కట్టడి చేసిన మన జట్టు... ఆపై అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబర్చింది. శుక్రవారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన తొలి టి20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 19.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. 2020 టి20 ప్రపంచకప్లో భారత్తో జరిగిన మ్యాచ్ తర్వాత ఆసీస్ జట్టు మళ్లీ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. ఫోబీ లిచ్ఫీల్డ్ (32 బంతుల్లో 49 4 ఫోర్లు, 3 సిక్స్లు), ఎలైస్ పెరీ (30 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. పవర్ప్లే ముగిసేసరికి 33/4 స్కోరుతో ఆసీస్ ఇబ్బందుల్లో పడిన స్థితిలో లిచ్ఫీల్డ్, పెరీ ఐదో వికెట్కు 52 బంతుల్లోనే 79 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. యువ పేస్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిటాస్ సాధు (4/17) పదునైన బంతులతో ప్రత్యర్థిని కుప్పకూల్చగా... శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (44 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు), స్మృతి మంధాన (52 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్కు 93 బంతుల్లోనే 137 పరుగులు జోడించడం విశేషం. తొలి ఓవర్లో ఎక్స్ట్రాల రూపంలోనే 14 పరుగులు రావడంతో మొదలైన ఛేదనలో చివరి వరకు భారత్కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ముఖ్యంగా గత రెండు వన్డేల్లో తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన షఫాలీ ఇప్పుడు మళ్లీ అవకాశం రాగానే చెలరేగిపోయింది. విజయానికి ఐదు పరుగుల దూరంలో స్మృతి వెనుదిరిగినా... షఫాలీతో కలిసి జెమీమా (6 నాటౌట్) మ్యాచ్ ముగించింది. సిరీస్లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా, రెండో మ్యాచ్ ఆదివారం ఇదే మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్తో స్మృతి అంతర్జాతీయ టి20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకొని హర్మన్ప్రీత్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచింది. -
IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని...
ముంబై: కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో... నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్ను కోల్పోయింది. ఫలితంగా ఆ్రస్టేలియాపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక చివరి మ్యాచ్లోనైనా గెలిచి ఊరట చెందాలని భారత బృందం భావిస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో విశేషంగా రాణించి అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు వన్డే ఫార్మాట్కు వచ్చేసరికి తడబడింది. సమష్టి ప్రదర్శన కొరవడటంతో ఈ ప్రభావం మ్యాచ్ తుది ఫలితంపై పడింది. భారత్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండటం ప్రతికూలంగా మారింది. తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యం దెబ్బతీసింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైన భారత్ చివర్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆఖరికి మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా రెండో మ్యాచ్లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్లు జారవిడిచారు. కెపె్టన్గా హర్మన్ప్రీత్ కౌర్ రెండు మ్యాచ్ల్లోనూ విఫలమైంది. తొలి మ్యాచ్లో 9 పరుగులు చేసిన హర్మన్ రెండో మ్యాచ్లో 5 పరుగులతో సరిపెట్టుకుంది. చివరిసారి 2007లో స్వదేశంలో ఆ్రస్టేలియాపై వన్డే మ్యాచ్లో గెలిచిన భారత్ ఆ తర్వాత వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఆసీస్ చేతిలో పరాజయపరంపరకు తెర దించాలంటే చివరి వన్డేలో భారత జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్త భాటియాలతోపాటు కెపె్టన్ హర్మ న్ప్రీత్ కూడా బ్యాటింగ్లో మెరిపిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. బౌలింగ్లో రేణుక సింగ్తోపాటు స్పిన్నర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడంతో టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ్రస్టేలియా క్రికెటర్ల సొంతం. అందుకే రెండు వన్డేల్లోనూ ఆ జట్టు ఒత్తిడికిలోనైన సందర్భాల్లో తడబడకుండా సంయమనంతో ఆడి కోలుకున్నారు. ఫోబి లిచ్ఫీల్డ్, తాలియా మెక్గ్రాత్, యాష్లే గార్డ్నర్, ఎలీస్ పెరీ, కెపె్టన్ అలీసా హీలీ, అనాబెల్ సదర్లాండ్ మరోసారి రాణిస్తే ఆ్రస్టేలియా వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం సాధ్యమే. -
ఆసీస్ను ఓడించాం
ముంబై: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఎట్టకేలకు పదకొండో ప్రయత్నంలో ఆ్రస్టేలియా మహిళల జట్టుపై భారత జట్టు తొలిసారి టెస్టు విజయాన్ని అందుకుంది. ఇక్కడి వాంఖెడె మైదానంలో ఆ్రస్టేలియాతో జరిగిన నాలుగు రోజుల ఏకైక టెస్టులో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా సమష్టిగా ఆడితే ఎంతటి మేటి జట్టునైనా ఓడించవచ్చని హర్మన్ప్రీత్ కౌర్ బృందం నిరూపించింది. ఆ్రస్టేలియా నిర్దేశించిన 75 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 18.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. మ్యాచ్ మొత్తంలో ఏడు వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పటిష్టమైన ఇంగ్లండ్తో గత ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన భారత జట్టు... వారం తిరిగేలోపు మరో మేటి జట్టు ఆ్రస్టేలియాను బోల్తా కొట్టించి ఈ ఏడాదిని దిగ్విజయంగా ముగించింది. రాణించిన స్నేహ్, రాజేశ్వరి ఆట చివరిరోజు ఓవర్నైట్ స్కోరు 233/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా కేవలం 28 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 261 పరుగుల వద్ద ఆలౌటైంది. యాష్లే గార్డ్నర్ (7)ను ఆట రెండో ఓవర్లోనే పూజ వస్త్రకర్ వికెట్లముందు దొరకబుచ్చుకోవడంతో ఆసీస్ పతనం మొదలైంది. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన అనాబెల్ సదర్లాండ్ (102 బంతుల్లో 27; 3 ఫోర్లు)ను...అలానా కింగ్ (0)ను వరుస బంతుల్లో స్నేహ్ రాణా అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ఎక్కువసేపు కొనసాగలేదు. చివరి రెండు వికెట్లను రాజేశ్వరి గైక్వాడ్ తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 261 పరుగులవద్ద ముగిసింది. 75 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు తొలి ఓవర్లోనే దెబ్బ పడింది. షఫాలీ వర్మ (4) నాలుగో బంతికి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత రిచా ఘోష్ (32 బంతుల్లో 13; 3 ఫోర్లు)తో కలిసి స్మృతి మంధాన (61 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) రెండో వికెట్కు 51 పరుగులు జోడించింది. రిచా అవుటయ్యాక జెమీమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి స్మృతి భారత్ను విజయతీరానికి చేర్చింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 219; భారత్ తొలి ఇన్నింగ్స్: 406; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: బెత్ మూనీ (రనౌట్) 33; లిచ్ఫెల్డ్ (బి) స్నేహ్ రాణా 18; ఎలీస్ పెరీ (సి) యస్తిక (బి) స్నేహ్ రాణా 45; తాలియా మెక్గ్రాత్ (బి) హర్మన్ప్రీత్ 73; అలీసా హీలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్మన్ప్రీత్ 32; అనాబెల్ సదర్లాండ్ (సి) యస్తిక (బి) స్నేహ్ రాణా 27; యాష్లే గార్డ్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పూజ 7; జెస్ జొనాసెన్ (బి) రాజేశ్వరి 9; అలానా కింగ్ (బి) స్నేహ్ రాణా 0; కిమ్ గార్త్ (బి) రాజేశ్వరి 4; లారెన్ చీట్లె (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్) 261. వికెట్ల పతనం: 1–49, 2–56, 3–140, 4–206, 5–221, 6–233, 7–251, 8–251, 9–260, 10–261. బౌలింగ్: రేణుక 11–4–32–0, పూజ వస్త్రకర్ 11–1–40–1, స్నేహ్ రాణా 22–5–66–4, దీప్తి శర్మ 22–7– 35–0, రాజేశ్వరి గైక్వాడ్ 28.4–11 –42–2, జెమీమా 2–0–13–0, హర్మన్ప్రీత్ 9–0–23–2. భారత్ రెండో ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) అలీసా (బి) గార్త్ 4; స్మృతి మంధాన (నాటౌట్) 38; రిచా ఘోష్ (సి) తాలియా (బి) గార్డ్నర్ 13; జెమీమా (నాటౌట్)12; ఎక్స్ట్రాలు 8; మొత్తం (18.4 ఓవర్లలో రెండు వికెట్లకు) 75. వికెట్ల పతనం: 1–4, 2–55. బౌలింగ్: కిమ్ గార్త్ 5–1–19–1, యాష్లే గార్డ్నర్ 9–2–18–1, తాలియా 2–0–14–0, జెస్ జొనాసెన్ 2.4–0–16–0. 7: ఓవరాల్గా టెస్టు ఫార్మాట్లో భారత మహిళల జట్టు గెలిచిన టెస్టుల సంఖ్య. 1976 నుంచి 2023 వరకు భారత జట్టు 40 టెస్టులు ఆడింది. ఇందులో ఏడింటిలో గెలిచి, ఆరింటిలో ఓడిపోయింది. మిగతా 27 మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. 11: ఆస్ట్రేలియా జట్టుతో 1977 నుంచి 2023 మధ్యకాలంలో భారత్ 11 టెస్టులు ఆడింది. ఈ మ్యాచ్కు ముందు ఆ్రస్టేలియా చేతిలో భారత్ నాలుగు మ్యాచ్ల్లో ఓడి, ఆరింటిని ‘డ్రా’ చేసుకుంది. 2: స్వదేశంలో భారత జట్టు ఒకే ఏడాది రెండు టెస్టుల్లో గెలవడం ఇదే తొలిసారి. భారత్ నెగ్గిన ఏడు టెస్టుల్లో నాలుగు స్వదేశంలో, మూడు విదేశీ గడ్డపై వచ్చాయి. హర్మన్ప్రీత్ కెపె్టన్సీలో భారత జట్టు ఆడిన రెండు టెస్టుల్లోనూ నెగ్గడం విశేషం. 9: గత 17 ఏళ్లలో భారత జట్టు తొమ్మిది టెస్టులు ఆడింది. ఇందులో ఒక టెస్టులో ఓడి, ఐదు టెస్టుల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. -
రన్నరప్ అశ్విని–తనీషా జోడీ
లక్నో: సయ్యద్ మోడి వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఈసారి భారత జట్టు క్రీడాకారులకు ఒక్క టైటిల్ కూడా లభించలేదు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ రన్నరప్తో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అశ్విని–తనీషా ద్వయం 14–21, 21–17, 15–21తో రిన్ ఇవనాగ–కీ నకనిషి (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. రన్నరప్గా నిలిచిన అశ్విని–తనీషాలకు 7,980 డాలర్ల (రూ. 6 లక్షల 64 వేలు) ప్రైజ్మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యు జెన్ చి (చైనీస్ తైపీ) 20–22, 21–12, 21–17తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై సంచలన విజయం సాధించి టైటిల్ దక్కించుకున్నాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) 21–19, 21–16తో లినె హొమార్క్ (డెన్మార్క్)ను ఓడించి విజేతగా నిలిచింది. -
మళ్లీ ఓడిన భారత మహిళలు
మహిళల జూనియర్ హాకీ వరల్డ్ కప్లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పూల్ ‘సి’ మ్యాచ్లో బెల్జియం 3–2 గోల్స్ తేడాతో భారత్ను ఓడించింది. భారత్ తరఫున అన్ను 47వ, 51వ నిమిషాల్లో గోల్స్ సాధించింది. బెల్జియం తరఫున నోవా ష్రూయెర్స్ (5వ నిమిషం), ఫ్రాన్స్ డి మాట్ (42వ ని.), అస్ట్రిడ్ బొనామి (52వ ని.) గోల్స్ నమోదు చేశారు. తొలి, మూడో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించి ముందుగా బెల్జియం 2–0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో అన్ను రెండు గోల్స్ సాధించి స్కోరును సమం చేసింది. అయితే చివర్లో లభించిన పెనాల్టీ స్ట్రోక్ను సమర్థంగా ఉపయోగించుకున్న బెల్జియం మ్యాచ్ను సొంతం చేసుకుంది. మరో వైపు మంగళవారం మలేసియాలోని కౌలాలంపూర్లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అదే రోజు జరిగే తొలి మ్యాచ్లో కొరియాతో భారత్ తలపడుతుంది. -
రాహుల్కు వన్డే పగ్గాలు
న్యూఢిల్లీ: వచ్చే నెల దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడే మూడు ఫార్మాట్లకు భారత జట్లను ఎంపిక చేశారు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్లో జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్ను సఫారీలోనూ కెప్టెన్గా కొనసాగిస్తున్నారు. ఈ పొట్టి ఫార్మాట్లో జడేజాకు వైస్ కెప్టెన్సీ అప్పజెప్పారు. వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ను కెప్టెన్గా నియమించారు. ఈ రెండు జట్లకూ భారత టాప్స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కోహ్లిలు విశ్రాంతి తీసుకున్నారు. దీంతో వన్డేల్లో ఇద్దరు కొత్త ముఖాలు బి. సాయి సుదర్శన్, రింకూ సింగ్లకు టీమిండియాకు ఆడే అవకాశమిచ్చారు. మిడిలార్డర్లో డాషింగ్ బ్యాటర్ సంజూ సామ్సన్, స్పిన్నర్ చహల్లకు వన్డే జట్టులో తిరిగి చోటు లభించగా, రుతురాజ్ గైక్వాడ్ లక్కీఛాన్స్ కొట్టేశాడు. పూర్తిస్థాయిలో మూడు ఫార్మాట్లకూ ఎంపికయ్యాడు. సీమర్ ముకేశ్కూ ఇలాంటి అవకాశమే లభించింది. హైదరాబాద్ స్పీడ్స్టర్ సిరాజ్ను టి20, టెస్టులకు ఎంపిక చేసినప్పటికీ వన్డేల నుంచి తప్పించారు. సఫారీలో ముందుగా భారత్ డిసెంబర్ 10, 12, 14తేదీల్లో మూడు టి20లు... 17, 19, 21 తేదీల్లో మూడు వన్డేల సిరీస్లో పాల్గొంటుంది. చివరగా 26 నుంచి 30 వరకు తొలిటెస్టు, జనవరి 3 నుంచి 7వరకు జరిగే రెండో టెస్టుతో పర్యటన ముగుస్తుంది. -
ద్రవిడ్ బృందానికే జై
ముంబై: వన్డే వరల్డ్ కప్లో భారత జట్టుకు వరుస విజయాలతో ఫైనల్ వరకు చేర్చిన శిక్షణా బృందంపై బీసీసీఐ నమ్మకముంచింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా ఇతర ముగ్గురు కోచ్ల కాంట్రాక్ట్ను పొడిగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్లకు కూడా మళ్లీ అవకాశం దక్కింది. వీరందరి కాంట్రాక్ట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్తో ముగిసింది. పొడిగింపుపై అప్పటి వరకు బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే బృందాన్ని మరికొంత కాలం కొనసాగించడమే సరైందిగా బోర్డు భావించింది. ముందుగా దీనికి సంబంధించి ద్రవిడ్కు సమాచారం అందించింది. ద్రవిడ్ అంగీకరించకపోతే మరో ప్రత్యామ్నాయం వైపు బోర్డు చూసే ఆలోచనలో ఉండగా...ద్రవిడ్ కోచ్గా కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. వీరి కాంట్రాక్ట్ ఎప్పటి వరకు అనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోయినా... వచ్చే ఏడాది జూన్–జూలైలో జరిగే టి20 ప్రపంచ కప్ వరకు ఉండే అవకాశం ఉంది. మరో వైపు వన్డే, టి20లకు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పేరుపై కూడా చర్చ జరిగినా...నెహ్రా విముఖత చూపడంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు సమాచారం. అందుకే కొనసాగింపు... గత రెండేళ్లుగా ద్రవిడ్, అతని సహచర కోచింగ్ బృందం భారత జట్టులో తీసుకొచ్చిన మార్పులు, ఏర్పరచిన మంచి వాతావరణం మున్ముందూ కొనసాగించాలని బీసీసీఐ అనుకుంది. కొత్తగా వచ్చే కోచ్తో ఇవన్నీ ఒక్కసారి మారిపోతే కష్టమని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. కోచ్ మారితే అతనితో పాటు ఇతర సహాయక సిబ్బంది కూడా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ద్రవిడ్ బృందం భవిష్యత్తులో ఎప్పటి వరకు కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేకపోయినా... ఇదే జట్టు సహకారంతో కనీసం మరో ఐసీసీ టోర్నీలో జట్టు పాల్గొనడమే సరైందని వారు భావించారు. ‘రాహుల్ ద్రవిడ్కు బోర్డు అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. మూడు ఫార్మాట్లలో భారత జట్టు అద్భుతంగా ఆడుతూ అగ్రస్థానంలో ఉంది. ద్రవిడ్ దూరదృష్టి, ఆలోచన, ప్రణాళిక అందుకు కారణం. వరల్డ్ కప్లో ఫైనల్కు ముందు వరుసగా పది మ్యాచ్లు గెలవడం అసాధారణ ప్రదర్శన. అందుకు హెడ్కోచ్ను తప్పకుండా అభినందించాలి. మున్ముందు మరిన్ని విజయాలు సాధించేందుకు వారికి అన్ని విధాలా సహకారం అందిస్తాం’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. తనకు కొనసాగింపు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘భారత జట్టుతో నా ప్రయాణంలో ఎన్నో మధుర క్షణాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో విజయాలు, పరాజయాలతో ఎత్తుపల్లాలు చవిచూశాం. ఆటగాళ్లు, మా శిక్షణా బృందం మధ్య మంచి అనుబంధం ఉంది. డ్రెస్సింగ్ రూమ్లో మేం నెలకొల్పిన మంచి సంస్కృతి పట్ల గర్వంగా ఉన్నాం. అద్భుతమైన ప్రతిభ ఉన్న మా జట్టుకు సరైన మార్గనిర్దేశనం చేసి మంచి ఫలితాలు సాధించేలా చేయడంలో సఫలమయ్యాం. నాపై నమ్మకం ఉంచి మళ్లీ అవకాశం కల్పించిన బోర్డుకు కృతజ్ఞతలు. ప్రపంచకప్ తర్వాత రాబోయే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ద్రవిడ్ తన స్పందనను తెలియజేశాడు. -
‘ధోని నుంచి నేర్చుకున్నాను’
విశాఖపట్నం: ఆ్రస్టేలియాతో జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత జట్టు విజయంలో రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. చివర్లో దూకుడుగా ఆడాల్సిన స్థితిలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా నిలబడి అతను ఫినిషర్గా మ్యాచ్ పూర్తి చేశాడు. ఈ లక్షణాన్ని తాను మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి నేర్చుకున్నట్లు రింకూ సింగ్ చెప్పాడు. ‘నేను ఇంత ప్రశాంతంగా ఉండగలిగానంటే అందుకు ప్రత్యేక కారణం ఉంది. ఇలాంటి స్థితిలో ఎలా ఆడాలని నేను మహి భాయ్ (ధోని)తో మాట్లాడాను. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఒత్తిడికి లోను కాకపోవడానికి ఆయన ఇచ్చిన సూచనలే కారణం. సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండటంతో పాటు నేరుగా బౌలర్పైనే పూర్తి దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు’ అని రింకూ సింగ్ వెల్లడించాడు. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా రింకూ ఆత్మవిశ్వాసంతో దానిని చక్కటి సిక్సర్గా మలిచాడు. అయితే అబాట్ వేసిన ఆ బంతి నోబాల్ కావడంతో సిక్స్ లెక్కలోకి రాలేదు. ‘డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాక అక్షర్ చెప్పే వరకు ఈ విషయం నాకు తెలీదు. అయితే సిక్స్ కాలేకపోవడం పెద్ద అంశం కాదు. మ్యాచ్ గెలవడమే మనకు ముఖ్యం. అది జరిగింది చాలు’ అని రింకూ సింగ్ వ్యాఖ్యానించాడు. -
టీమిండియా శుభారంభం.. తొలి టీ20లో ఆసీస్పై విజయం
సాక్షి, విశాఖపట్నం: పరుగుల వరద పారిన మ్యాచ్లో చివరికి భారత జట్టుదే పైచేయిగా నిలిచింది. ఆ్రస్టేలియాతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం ఇక్కడి డాక్టర్ వైఎస్ఆర్–ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టి20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు రెండు వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా జట్టును ఓడించింది. తొలిసారి జాతీయ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన మ్యాచ్లో సూర్యకుమార్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు సాధించింది. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్స్లు) అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... ఓపెనర్గా వచ్చిన స్టీవ్ స్మిత్ (41 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు మూడో వికెట్కు 130 పరుగులు జోడించారు. ఇన్గ్లిస్ 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఆ్రస్టేలియా తరఫున టి20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్గా ఆరోన్ ఫించ్ (47 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. అనంతరం భారత జట్టు 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్స్లు)– అర్ధ సెంచరీలతో అదరగొట్టగా... రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. భారత్ విజయానికి ఆఖరి బంతికి ఒక పరుగు అవసరంకాగా... సీన్ అబాట్ వేసిన బంతిని రింకూ సింగ్ సిక్సర్గా మలిచి భారత విజయాన్ని ఖరారు చేశాడు. అయితే టీవీ రీప్లేలో అబాట్ వేసిన బంతి నోబాల్ అని తేలడంతో అక్కడే భారత విజయం ఖాయమైంది. దాంతో రింకూ సింగ్ సిక్స్ను లెక్కలోకి తీసుకోలేదు. టి20ల్లో భారత జట్టుకిదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. సిరీస్లోని రెండో టి20 మ్యాచ్ ఈనెల 26న తిరువనంతపురంలో జరుగుతుంది. సూర్య, ఇషాన్ ధనాధన్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్లు)తో సమన్వయలోపం కారణంగా మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) ఒక్క బంతి ఆడకుండానే తొలి ఓవర్లోనే రనౌటయ్యాడు. అనంతరం మూడో ఓవర్లో యశస్వి భారీ షాట్కు యత్నించి నిష్క్రమించాడు. ఈ దశలో ఇషాన్, సూర్యకుమార్ జత కలిశారు. వీరిద్దరు ఎక్కడా తగ్గకుండా ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో భారత్ స్కోరు 4.5 ఓవర్లలో 50 దాటింది. పవర్ప్లే ముగిసేసరికి భారత్ 2 వికెట్లకు 63 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా ఇషాన్, సూర్య జోరు కొనసాగించడంతో భారత్ 9.1 ఓవర్లలో 100 పరుగులు చేసింది. ఇషాన్ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో భారీ షాట్కు యత్నించి డీప్ ఎక్స్ట్రా కవర్లో షార్ట్ చేతికి చిక్కడంతో ఇషాన్ ఇన్నింగ్స్ ముగిసింది. తిలక్ వర్మ (10 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఈ దశలో సూర్య, రింకూ జతకలిసి ఐదో వికెట్కు 40 పరుగులు జోడించడంతో భారత్ 194/4తో విజయానికి చేరువైంది. అయితే ఇదే స్కోరు వద్ద సూర్య అవుటయ్యాడు. అప్పటికి భారత్ విజయానికి చేరువైంది. చివరి ఓవర్ డ్రామా... 12 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన దశలో 19వ ఓవర్లో భారత్ 7 పరుగులు చేసింది. దాంతో చివరి ఓవర్లో భారత్ గెలుపునకు 6 బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికే రింకూ ఫోర్ కొట్టాడు. రెండో బంతికి ‘బై’ రూపంలో పరుగు వచ్చింది. 4 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన దశలో భారత్ వరుసగా మూడు బంతుల్లో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ వికెట్లను కోల్పోయింది. రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో అర్ష్దీప్ అవుటయ్యాడు. దాంతో చివరి బంతికి భారత్ విజయానికి ఒక పరుగు అవసరమైంది. ‘సూపర్ ఓవర్’ అవసరం పడుతుందా అనే అనుమానం కలిగిన దశలో అబాట్ వేసిన ఆఖరి బంతిని రింకూ సిక్స్గా మలచడంతో భారత్ విజయం ఖరారైంది. అయితే అబాట్ బంతి నోబాల్ అని తేలడంతో రింకూ సిక్స్ షాట్ను పరిగణనలోకి తీసుకోలేదు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: స్టీవ్ స్మిత్ (రనౌట్) 52; మాథ్యూ షార్ట్ (బి) రవి బిష్ణోయ్ 13; జోష్ ఇన్గ్లిస్ (సి) యశస్వి జైస్వాల్ (బి) ప్రసిధ్ కృష్ణ 110; స్టొయినిస్ (నాటౌట్) 7; టిమ్ డేవిడ్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–31, 2–161, 3–180. బౌలింగ్: అర్ష్దీప్ సింగ్ 4–0–41–0, ప్రసిధ్ కృష్ణ 4–0–50–1, అక్షర్ పటేల్ 4–0–32–0, రవి బిష్ణోయ్ 4–0–54–1, ముకేశ్ కుమార్ 4–0–29–0. భారత్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) స్మిత్ (బి) షార్ట్ 21; రుతురాజ్ గైక్వాడ్ (రనౌట్) 0; ఇషాన్ కిషన్ (సి) షార్ట్ (బి) తన్వీర్ 58; సూర్యకుమార్ యాదవ్ (సి) ఆరన్ హార్డి (బి) బెహ్రన్డార్ఫ్ 80; తిలక్ వర్మ (సి) స్టొయినిస్ (బి) తన్వీర్ సంఘా 12; రింకూ సింగ్ (నాటౌట్) 22; అక్షర్ పటేల్ (సి అండ్ బి) సీన్ అబాట్ 2; రవి బిష్ణోయ్ (రనౌట్) 0; అర్ష్దీప్ సింగ్ (రనౌట్) 0; ముకేశ్ కుమార్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (19.5 ఓవర్లలో 8 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–11, 2–22, 3–134, 4–154, 5–194, 6–207, 7–207, 8–208. బౌలింగ్: స్టొయినిస్ 3–0–36–0, బెహ్రన్డార్ఫ్ 4–1–25–1, షార్ట్ 1–0–13–1, సీన్ అబాట్ 3.5–0–43–1, నాథన్ ఎలిస్ 4–0–44–0, తన్వీర్ సంఘా 4–0–47–2.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement