More

యాచన.. డిజిటల్‌ యోచన

24 Apr, 2022 04:35 IST

అర్వపల్లి: అంతా డిజిటల్‌మయం కావడంతో యాచకులు కూడా స్కానర్లు, ఫోన్‌పే, గూగుల్‌పేలను వినియోగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో శనివారం ఓ టీస్టాల్‌లో యాచకుడు యాచించగా యజమాని గోవర్ధన్‌ నగదు లేదన్నాడు. వెంటనే యాచకుడు తన వద్ద ఉన్న డిజిటల్‌ పేమెంట్‌ స్కానర్‌ను చూపించాడు. దీంతో గోవర్దన్‌ తన సెల్‌తో స్కాన్‌ చేసి డిజిటల్‌ పేమెంట్‌ విధానంలో చెల్లించాడు.

ఈ సందర్భంగా యాచకుడు చిన్నమారన్న మాట్లాడుతూ.. అంతా డిజిటల్‌ కాలం కావడంతో యాచకులం కూడా మారాల్సి వచ్చిందని చెప్పాడు. తనది ఏపీలోని నంద్యాల జిల్లా గుండాల (ఎస్‌) గ్రామమని తెలిపాడు. హనుమాన్‌ వేషధారణలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు తిరుగుతూ యాచిస్తున్నట్లు చెప్పాడు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

దమ్ముంటే అక్కడ గెలవండి! చిదంబరానికి మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు: భట్టి

తెలంగాణలోనే గ్యాస్‌ ధరలు ఎక్కువ: చిదంబరం

రౌడీషీటర్లపై ఉక్కుపాదం