టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారం.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలి.. ప్రభుత్వానికి గవర్నర్‌ ఆదేశం 

Published on Fri, 03/24/2023 - 10:22

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి తీవ్రంగా స్పందించారు. మొదటిసారి పేపర్‌ లీక్‌ అయినప్పుడు కమిషన్‌ కార్యదర్శిని 48 గంటల్లో లీకేజీకి సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తూ కమిషన్‌కు లేఖ రాసిన సంగతి విదితమే.

తాజాగా గురువారం మరో లేఖను ప్రభుత్వానికి, కమిషన్‌కు రాశారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పోటీపరీక్షలకు హాజరైన కమిషన్‌ రెగ్యులర్‌ ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఎవరు? కమిషన్‌ నుంచి అనుమతితో, అనుమతి లేకుండా హాజరైన వారెవరెవరు? పరీక్షల్లో సాధించిన మార్కులు ఎన్ని? పరీక్షల తర్ఫీదుకు సెలవులు తీసుకున్నారా? వంటి వివరాలతో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు తాజా పురోగతిపై 48 గంటల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఆదేశించారు.

గవర్నర్‌ ఆదేశాలతో ఈ మేరకు రాజ్‌భవన్‌ గురువారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీ, టీఎస్‌పీఎస్‌సీకి లేఖలు రాసింది. సిట్‌ దర్యాప్తులో పురోగతిని సైతం నివేదికలో తెలపాలని కోరింది. 
చదవండి: సిట్‌కు బండి సంజయ్‌ లేఖ.. ‘విచారణకు హాజరుకాలేను’

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ