-
రూ. 2 కోట్లకు ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షా పత్రాలు!
రాజస్థాన్లో మరో అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షను గత గెహ్లాట్ ప్రభుత్వం నిర్వహించింది. 2021 సెప్టెంబరులో ఈ పరీక్షను మూడు దశల్లో నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో చీటింగ్ జరిగినట్లు తాజాగా వెల్లడైంది. గత ఏడాది మే నెలలో ఈ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. విజయం సాధించినవారు ప్రస్తుతం రాజస్థాన్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇన్నాళ్లకు ఈ పరీక్షలో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పరీక్షలో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది అభ్యర్థులు మోసపూరితంగా ఉత్తీర్ణులయ్యారని ఆధార పూర్వకంగా తేలిందని కేబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా తెలిపారు. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు 42 మంది భాగస్వాములు పేర్లు వెల్లడయ్యాయి. వీరిలో 20 మందిని అరెస్టు చేశారు. రాజధాని జైపూర్లోని హస్నుపర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి ఈ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ పేపర్ను వాట్సాప్లో పంపారు. ఇందుకోసం సదరు స్కూల్ డైరెక్టర్ పది లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ పేపర్ రూ. 2 కోట్లకు పైగా మొత్తానికి అమ్ముడుపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
పేపర్ లీక్ చేస్తే కోటి ఫైన్.. లోక్సభలో కేంద్రం బిల్లు
న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి కేంద్రం ఇక చెక్ పెట్టనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీల వంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లును కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి జితేందర్సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో పాలు పంచుకునే అధికారులు, లీకేజీకి పాల్పడే ముఠాల ఆగడాలకు ఈ బిల్లుతో కళ్లెం వేయనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత దీని కింద నేరం రుజువైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష,రూ. కోటి వరకు జరిమానా విధించనున్నారు. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ఇటీవల చేసిన ప్రసంగంలోనూ ప్రస్తావించారు. ఇదీచదవండి.. పేటీఎంపై సీబీఐ,ఈడీల మౌనం దేనికి: కాంగ్రెస్ -
భారత్ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
జోధ్పూర్: భారతదేశం గళాన్ని నేడు ప్రపంచ దేశాలు వింటున్నాయని, ఇది చూసి ప్రతిపక్ష కాంగ్రెస్ తట్టుకోలేకపోతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆ పార్టీ బీజేపీని వ్యతిరేకించే క్రమంలో భారత్ను వ్యతిరేకించడం ప్రారంభించిందని విమర్శించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్లో మోదీ గురువారం పర్యటించారు. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జోధ్పూర్లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గహ్లోత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేపర్ లీక్ మాఫియా వల్ల లక్షలాది మంది యువత భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అవినీతిని బయటపెడతామన్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కాంగ్రెస్ పారీ్టకి రైతుల పట్ల గానీ, సైనికుల పట్ల గానీ ఏమాత్రం శ్రద్ధ లేదని మోదీ ఆరోపించారు. ఆ పారీ్టకి అధికారమే పరమావధిగా మారిందని ఆక్షేపించారు. సొంత ఓటు బ్యాంకును ప్రేమించడం తప్ప ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని కాంగ్రెస్పై మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయని, ప్రపంచ దేశాల్లో మన ప్రభావం విస్తరిస్తోందని, విదేశాల్లో మన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదంతా నచ్చడం లేదని అన్నారు. భారత్ త్వరలో ప్రపచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏమిటో తెలిసిందేనని పేర్కొన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచి్చన తర్వాత దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ‘ద వ్యాక్సిన్ వార్’పై మోదీ ప్రశంసలు బాలీవుడ్ చలనచిత్రం ‘ద వ్యాక్సిన్ వార్’పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందని అన్నారు. వివేక్ అగి్నహోత్రి దర్శకత్వం వహించిన ద వ్యాక్సిన్ వార్ సినిమా సెపె్టంబర్ 28న విడుదలైంది. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి మన సైంటిస్టులు అహోరాత్రులు శ్రమించారని, వారి శ్రమను ఈ చిత్రంలో చక్కగా చూపించారని మోదీ కొనియాడారు. మన సైంటిస్టుల అంకితభావాన్ని తెరకెక్కించిన చిత్ర దర్శకుడు, నిర్మాతలను ప్రశంసించారు. -
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు.. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పేపర్ల లీకేజీతో ప్రమేయమున్న వారిని డీబార్ చేయాలని నిర్ణయించింది. సిట్ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని టీఎస్పీఎస్సీ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు టీఎస్పీఎస్సీ నోటీసులు జారీ చేసింది. చదవండి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు.. -
TSPSC కేసులో కొత్త కోణం
-
ఎవరు ఉద్యమం చేసినా కేసీఆర్ భయపడుతున్నారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్పై మరోసారి విరుచుకుపడ్డారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. మంత్రి కేటీఆర్ 30 లక్షల మంది భవిష్యత్తును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ రోజుకో మంత్రి అవతారం ఎత్తుతారంటూ ఎద్దేవా చేశారు. కాగా, బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులు ఏం పాపం చేశారు?. పంచాయతీ కార్యదర్శులు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. రెగ్యులర్ చేయాలని పోరాడుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు ఉద్యమం ఆపొద్దు, మీకు బీజేపీ అండగా ఉంటుంది. ఎవరు ఉద్యమం చేసినా కేసీఆర్ భయపడుతున్నారు. కేటీఆర్ 30 లక్షల మంది భవిష్యత్తును నాశనం చేశారు. కేటీఆర్ను వెంటనే బర్తరఫ్ చేయాలి. మళ్లీ టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటే బీఆర్ఎస్ ఎందుకు పెట్టారు?. తెలంగాణలో అన్నీ స్కాములే. ఈ ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసు. తెలంగాణలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు. ప్రధాని మోదీని తిట్టే అర్హత మీకు లేదు. మోదీ ప్రభుత్వం 10లక్షల ఉద్యోగాలకు పరీక్ష పెట్టినా ఎక్కడా స్కాం జరగలేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రానుంది. పేదలకు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత బీజేపీది. నిధులు ఇచ్చి, తెలంగాణను అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: స్టేజీపైనే కొట్టుకున్నంత పనిచేసిన ఎమ్మెల్యేలు.. -
టెన్త్ రిజల్ట్ కాలమ్లో ‘మాల్ప్రాక్టీస్’.. ఫలితం ప్రకటించాలని విద్యార్థి వేడుకోలు
సాక్షి, హనుమకొండ: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటికి వచి్చన ఘటనలో కోర్టు అనుమతితో పరీక్షలు రాసిన విద్యార్థి దండబోయిన హరీశ్ ఫలితంలో ‘మాల్ప్రాక్టీస్’అని వచి్చంది. ఏప్రిల్ 4న కమలాపూర్లో హిందీ ప్రశ్నపత్రం ఔటైన ఘటనకు బాధ్యుడిని చేస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల విద్యా ర్థి హరీశ్ను విద్యాశాఖ అధికారులు ఐదేళ్ల పాటు డీబార్ చేశారు. దీంతో అతను ఇంగ్లిష్, గణితం పరీక్షలు రాయలేకపోయాడు. అతడి తరఫున ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలుచేయగా మిగిలిన పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతిచి్చంది. దీంతో హరీశ్ సామాన్య, సాంఘికశాస్త్రం పరీక్షలు రాశాడు. అయితే, బుధవారం వెలువరించిన ఫలితాల్లో హరీశ్ రిజల్ట్స్ కాలమ్లో ‘మాల్ప్రాక్టీస్’అని ఉంది. తన ప్రమేయం లేకున్నా బలి చేశారని, తన ఫలితం ప్రకటించి న్యాయం చేయాలని హరీశ్ అధికారులను వేడుకుంటున్నాడు. చదవండి: పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు -
TSPSC పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
-
‘అంగట్లో సరుకుల్లా క్వశ్చన్ పేపర్ల అమ్మకం.. కేసీఆర్ సర్కార్కు సిగ్గురాదు’
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ జరిగి నెలన్నర దాటుతున్నా.. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదని లేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. అంగట్లో సరుకులు అమ్ముతున్నట్లు టీఎస్పీఎస్సీ బోర్డు క్వశ్చన్ పేపర్లు అమ్మకానికి పెట్టినా కేసీఆర్ సర్కార్కు సిగ్గురాదని మండిపడ్డారు. వెంటనే టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. గతంలో నిరుద్యోగుల ఆత్మహత్యల నుంచి నేటి పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల కష్టార్జీతం నీటిపాలైనా దొరకు(సీఎం కేసీఆర్) దున్నపోతు మీద వానపడినట్లే వ్యవహరిస్తున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ‘నిరుద్యోగుల పక్షాన గళమెత్తితే పిరికిపందలా, అధికార మదంతో పోలీసులను పంపించి హౌజ్ అరెస్ట్ చేయించడం మాత్రమే కేసీఆర్కు చేతనవుతుంది. టీఎస్పీఎస్సీ స్కాంపై ఎలాంటి చర్యలు లేకుండానే పరీక్షలు నిర్వహించి, మళ్లీ క్వశ్వన్ పేపర్లు అమ్మి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా ఉన్నట్లుంది. నిరుద్యోగుల మీద సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించి, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు. చదవండి: బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటన.. డ్రైవర్కు 20 ఏళ్ల జైలు శిక్ష -
నిరుద్యోగ మార్చ్ కి మద్దతు తెలిపిన కేయూ, ఓయూ, జేఏసీలు
-
టీఎస్పీఎస్సీ ఉద్యోగులు పరీక్ష ఎలా రాస్తారు?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్పీ) ఉద్యోగులు అది నిర్వహించే పరీక్షలు ఎలా రాస్తారు. వారిని పరీక్షపత్రాల తయారీకి ఎలా అనుమతిస్తారు?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల ప్రశ్నపత్రం లీకేజీపై హైకోర్టుకు మంగళవారం సిట్ దర్యాప్తు స్థాయీ నివేదిక సీల్డ్ కవర్లో సమర్పించింది. అయితే నిందితుల వివరాలను ఇవ్వాలని సర్కార్కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పేపర్ లీకేజీ కేసును సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేయలేదని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తోపాటు మరో ఇద్దరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ నివేదిక అందజేసి వాదనలు వినిపించారు. దర్యాప్తు నివేదికను పిటిషనర్లకు ఇవ్వాలని, వారి తరఫు సీనియర్ న్యాయవాది వివేక్ ఠంకా న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. సీల్డ్ కవర్ నివేదికలను బహిర్గతం చేయవచ్చని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొందని ఠంకా చెప్పారు. దర్యాప్తులో తీవ్ర లోపాలున్నాయని, సాక్ష్యాలు మాయమవుతున్నాయని అన్నారు. సిట్ చైర్మన్పై ఆరోపణలు ఉన్నాయని, సరీ్వస్ కమిషన్ ఏర్పాటులోనూ లోపాలున్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రవాస భారతీయుల పాత్ర ఉందన్నారు. ఇది 30 లక్షల మంది భవిష్యత్తో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. సెక్షన్ అధికారి వద్ద మాత్రమే కాకుండా చైర్మన్, కార్యదర్శి వద్ద కూడా పాస్వర్డ్ ఉంటుందన్నారు. పారదర్శకంగా సాగని దర్యాప్తు సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగడంలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్ ఠంకా అన్నారు. ఈ క్రమంలో ప్రశ్నపత్రాలను ఎవరు తయారీ చేశారు.. ఏ ఏజెన్సీకి అప్పగించారు.. అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పరీక్షలు రాసేవారిని విధులకు ఎందుకు అనుమతించారని అడుగగా, పరీక్షలు రాసేవారిని నిర్వహణ ప్రక్రియకు దూరంగా పెట్టినట్లు ఏజీ చెప్పారు. దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలతో నివేదికను సమరి్పస్తామని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులతోపాటు మరికొన్ని వివరాలు అందాల్సి ఉందన్నారు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులుండగా, 17 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఒకరు మాత్రం న్యూజిలాండ్లో ఉన్నారని అన్నారు. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని నివేదించారు. ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
TSPSC పేపర్ లీక్ కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం
-
కవిత,కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సీఎం కేసీఆర్ కుటుంబంలోనే పరీక్ష పేపర్ల లీకు వీరులు, ప్రజలకు తాగించే లిక్కర్ వీరులు ఉన్నారని.. సీఎం కుమార్తె కవిత లిక్కర్ స్కాంలో, డ్రగ్స్ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే తనపై కక్షగట్టి, పథకం ప్రకారం పదో తరగతి పేపర్ లీకేజీలో అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తనపై పీడీ యాక్ట్ పెట్టాలంటున్న మంత్రులు హరీశ్రావు, కేటీఆర్లు ఎంతో మంది మరణాలకు కారణమని.. వాస్తవానికి వారిపైనే పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతిపేపర్ లీక్ కేసులో రిమాండ్ అయిన బండి సంజయ్.. శుక్రవారం ఉదయం 9 గంటలకు కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేటీఆర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో 30లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైతుంటే సీఎం కేసీఆర్ స్పందించడం లేదేమని నిలదీశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై త్వరలోనే వరంగల్లో భారీఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. వారిపైనే కేసులు పెట్టాలి.. తనపై పీడీ యాక్ట్ పెట్టాలంటున్న మంత్రి హరీశ్రావుపై హత్యానేరం కేసు పెట్టాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలో ఆత్మాహుతి చేసుకునేందుకు అగ్గిపెట్టె దొరకని మంత్రి హరీశ్రావు అని ఎద్దేవాచేశారు. ఆయన ధోరణితోనే 1,400 మంది బలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే కేటీఆర్ను సీఎం చేస్తే ముందు పార్టీ మారే జంప్ జిలానీ హరీశ్రావేనని ఎగతాళి చేశారు. రాష్ట్రంలో 27 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కారణమైన కేటీఆర్పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లడం ఖాయమని.. త్వరలో కేటీఆర్ కూడా డ్రగ్స్ కేసులో అరెస్టు అవుతారని వ్యాఖ్యానించారు. పోలీసుల తీరు సరికాదు.. కొందరు పోలీసులు పోస్టింగులు, ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ‘‘అసలు పదో తరగతి పేపర్ను ఎవరో షేర్ చేస్తే నాకేం సంబంధం? ప్రభుత్వం, పోలీసుల చేతగానితనాన్ని మాపై నెడతారా? వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ రంగనాథ్ తన టోపీపై ఉన్న మూడు సింహాలపై ప్రమాణం చేసి నిజాయతీ నిరూపించుకోవాలి. కరీంనగర్, వరంగల్ పోలీసులపై పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా..’’ అని పేర్కొన్నారు. తన సెల్ఫోన్ ఎక్కడుందో తనకే తెలియదని, టెక్నాలజీలో ఘనులమని చెప్పుకునే పోలీసులు అందులో ఏముందో తెలుసుకోలేరా? అని ప్రశ్నించారు. ఇక కమలాపూర్ పేపర్ లీకేజీలో బాలుడిని ఐదేళ్లపాటు డీబార్ చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. పేపర్ లీకేజీకి బాధ్యులను గుర్తించకుండా అమాయక విద్యార్థి భవిష్యత్ను దెబ్బతీయడం సరికాదని పేర్కొన్నారు. సంజయ్కు అమిత్షా ఫోన్ జైలు నుంచి విడుదలైన సంజయ్కు కేంద్రమంత్రులు అమిత్షా, స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు సీనియర్ నేతలు ఫోన్ చేసి పరామర్శించారు. పోరాటం ఆపవద్దని.. కేంద్రం, జాతీయ నాయకత్వమంతా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎంకు సభకు వస్తే గజమాల వేస్తాం రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే పరేడ్ గ్రౌండ్స్లో జరిగే ప్రధాని సభకు సీఎం కేసీఆర్ రావాలని బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ వస్తే గజమాల వేసి, శాలువా కప్పి సన్మానం చేస్తామన్నారు. రాకుంటే మాత్రం కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని, గతంలో ఇంటర్ విద్యార్థులతో, తాజాగా పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కొన్ని పార్టీలు కుట్రలకు తెరలేపాయని పరోక్షంగా బీఆర్ఎస్ను విమర్శించారు. తనపై మోపిన పేపర్ లీకేజీ కేసు ఆ కుట్రలో భాగమే అని విమర్శించారు.ఇది అత్యంత క్లిష్ట సమయమని, పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుట్రలకు భయపడితే 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల జీవితాలు ప్రమాదంలో పడ్డట్లేనన్నారు. టెన్త్ పేపర్ల లీకేజీకి కుట్ర కేసులో ప్రస్తుతం కరీంనగర్ జైల్లో రిమాండ్లో ఉన్న సంజయ్.. గురువారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కారాగారం నుంచే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. తొలుత పార్టీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బండి.. పార్టీ నిర్మాణం కోసం శ్రమించిన వాజ్పేయి, డీఎన్ రెడ్డి మొదలు చలపతిరావు, రామారావు, టైగర్ నరేంద్ర, జితేందర్రెడ్డిల సేవలను స్మరించుకున్నారు. నిరుద్యోగుల పక్షాన గళమెత్తినందుకే.. కేసులు, జైళ్లు కొత్తకాదని.. ప్రజల కోసం ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లేందుకు, ప్రాణమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సంజయ్ పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీలో వైఫల్యాలను, ప్రభుత్వ తప్పిదాలను, ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ కొడుకు పాత్రను ఎత్తిచూపుతూ 30 లక్షల మంది నిరుద్యోగ కుటుంబాల పక్షాన గళమెత్తినందుకే తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. నాడు తన స్వార్థం కోసం 27 మంది ఇంటర్మీ డియట్ విద్యార్థులను ప్రభుత్వం బలి తీసుకుందని మండిపడ్డారు. ప్రధాని మోదీ నాకు స్ఫూర్తి ప్రధాని మోదీ తనకు స్ఫూర్తి అని, ఆయన ఈనెల 8న హైదరాబాద్కు వస్తున్నా తాను ఆ సభకు హాజరయ్యే అవకాశం కన్పించకపోవడంతో బాధగా ఉందని సంజయ్ పేర్కొన్నారు. మోదీ సభను కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. శ్యామ్ప్రసాద్.. దీన్ దయాళ్ సిద్ధాంతాలు, వాజ్పేయి త్యాగం, మోదీ ఆశలను నెరవేర్చేందుకు కృషి చేయాలని, కేసీఆర్ సర్కార్ను బొందపెట్టడమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బిడ్డ, కొడుకుల స్కాంలు బయటపడుతున్నాయి.. బిడ్డ, కొడుకు చేసిన స్కాంలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో నిస్పృహలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తనను అరెస్టు చేసి జైలుకు పంపడం ద్వారా ఉద్యమాలను అడ్డుకోవాలని చూస్తోందని సంజయ్ ఆరోపించారు. జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి టీఎస్పీఎస్సీ లీకేజీకి బాధ్యుడైన కేసీఆర్ కొడుకును కేబినెట్ నుండి బర్తరఫ్ చేసేవరకు, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవరకు, లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ చీఫ్ పిలుపునిచ్చారు. నియంత పాలనకు చరమ గీతం పాడేదాకా పోరాడదామని అన్నారు. ‘గడీల్లో బందీ అయి విలపిస్తున్న తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడమే మనందరి లక్ష్యం. అందుకోసం తెగించి కొట్లాడదాం.. రాబందుల రాజకీయ క్రీడ నుండి తెలంగాణ తల్లిని రక్షించుకుందాం. అందుకోసం మీరంతా కదిలిరండి..’అని విజ్ఞప్తి చేశారు. -
బండి సంజయ్కు 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..
సాక్షి, వరంగల్: మంగళవారం అర్ధరాత్రి అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ అనిత రావుల ముందు హాజరుపరిచారు పోలీసులు. బండి సంజయ్తో పాటు ప్రశాంత్, శివ గణేష్, మహయ్లను కూడా మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. టెన్త్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం, బండి సంజయ్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. వాడీవేడీగా వాదనలు.. టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1గా ఉన్న బండి సంజయ్ను విచారించేందుకు 14 రోజుల రిమాండ్ విధించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు మెజిస్ట్రేట్ను కోరారు. మరోవైపు బండి సంజయ్ అరెస్టు అక్రమమని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనల అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. భారీ భద్రత.. అంతకుముందు ముందుజాగ్రత్త చర్యగా హన్మకొండ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బండిని కోర్టు నుంచి మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బండి అరెస్టును నిరసిస్తూ వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో ఇరవర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. ఖమ్మం జైలుకు.. తీర్పు అనంతరం బండి సంజయ్ను కరీంనగర్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చొక్కా విప్పిన బండి.. కాగా.. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని బండి సంజయ్ తన న్యాయవాదులకు చెప్పారు. చొక్కా తీసి తన ఒంటిపై గాయాలను కూడా చూపించారు. పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు బండి వివరించారు. చదవండి: బండి సంజయ్పై నమోదైన కేసు ఇదే.. అరెస్టుపై అమిత్షా ఆరా.. ఏం జరిగిందో చెప్పిన కిషన్ రెడ్డి.. -
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తలపించేలా.. కోర్టు ముందుకు బండి సంజయ్..
సాక్షి, వరంగల్/హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ను పోలీసులు కోర్టులో హజరుపర్చారు. కమలాపూర్, కరీంనగర్ టూటౌన్లో సంజయ్పై పేపర్ లీకేజీ కేసు నమోదైంది. ఆయనను హన్మకొండలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏ1గా బండి సంజయ్.. టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్ పేరును చేర్చారు. ఏ2 ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా శివగణేష్ను పోలీసులు చేర్చారు. 120(బి) సెక్షన్ కింద సంజయ్పై కేసు నమోదు చేశారు. హన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత.. హన్మకొండ కోర్టు వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సంజయ్ను తీసుకెళ్తున్న వాహనంపై చెప్పులు విసిరారు. బండి సంజయ్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. లోక్సభ స్పీకర్ను కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. బండి సంజయ్ అరెస్ట్పై ఫిర్యాదు చేశారు. కాగా, బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుపై హైడ్రామా కొనసాగింది. థ్రిల్లర్ సినిమా తలపించేలా పలు ప్రాంతాలు తిప్పారు. అసలు బండి సంజయ్ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపి లీగల్ సెల్ ఆందోళన వ్యక్తం చేసింది. పేపర్ బయటకు వచ్చిన కేసులో అనౌన్ పర్సన్ అని ఎఫ్ఐఆర్లో చూపి కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా బండి సంజయ్ ని అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసులను, అరెస్టులను న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నారు. బెయిలేబుల్ కేసులే అయినప్పటికీ దొంగలా రహస్యంగా కోర్టుకు తరలించడమేంటని ప్రశ్నిస్తున్నారు. టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీలో కుట్ర ఉంది: మంత్రి సబితా ఇదిలా ఉండగా, టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీలో కుట్ర ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే బండి సంజయ్ కుట్ర చేశారంటూ ఆమె ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. నిందితులకు బీజేపీ నాయకులతో సంబంధాలున్నాయన్నారు. కేసీఆర్ సర్కార్ను అప్రతిష్టపాలు చేయాలనే కుట్రతోనే పేపర్ లీక్కు పాల్పడ్డారని మంత్రి సబితా మండిపడ్డారు. చదవండి: అర్థరాత్రి అరెస్ట్.. అసలేం జరిగిందో చెప్పిన బండి సంజయ్ సతీమణి -
టెన్త్ పేపర్ లీకేజీ.. కీలక విషయాలు వెల్లడించిన సిపి రంగనాథ్
సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్ లో కలకలం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ పై పోలీసులు కొరఢా ఝళిపించారు. పేపర్ ను ఫోటో తీసి బయటికి పంపిన మైనర్ బాలుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయిందంటూ ప్రచారం చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. మైనర్ బాలుడు కమలాపూర్ బాలుర ప్రభుత్వ పాఠశాల పరీక్ష కేంద్రంలోని చెట్టుపైకి ఎక్కి తన స్నేహితుడి కోసం హిందీ ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మిత్రుడు శివగణేష్ కు పంపాడని సిపి రంగనాథ్ తెలిపారు. శివ గణేష్ ఓ జర్నలిస్టు మహేష్ కు పంపగా వారిద్దరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు. దాన్ని మరో జర్నలిస్ట్ ప్రశాంత్ బిజెపి నాయకులతో పాటు జర్నలిస్ట్ గ్రూపులో బ్రేకింగ్ న్యూస్ అంటూ హిందీ పరీక్ష పేపర్ లీక్ అయిందని టెక్స్ట్ మెసేజ్ పోస్ట్ చేశాడని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు పేపర్ బయటికి పంపిన మైనర్ బాలుడు పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: టెన్త్ పేపర్ లీక్పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్ ప్రస్తుతం మైనర్ బాలుడితోపాటు శివ గణేష్, ప్రశాంత్ను అరెస్టు చేశామని మహేష్ పరారీలో ఉన్నాడని మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నారు. వాస్తవంగా సెంటర్లో ఉన్నవారికి ఈ విషయం తెలియదని వారి నిర్లక్ష్యం ఉన్నట్లు భావించి డిపార్ట్మెంట్ పరంగా ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. - ఏవి.రంగనాథ్ - సిపి వరంగల్ -
టెన్త్ పేపర్ లీక్పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సబిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేన, పోలీస్ రేంజ్ ఐ.జిలు షానవాజ్ కాసీం , చంద్రశేఖర్ రెడ్డి లు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని, ఈ పరీక్షల విషయంలో తమ స్వార్థ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సబితా స్పష్టంచేశారు. పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఏవిధమైన అపోహలకు, అనుమానాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్లను మూసివేయించాలని అన్నారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందించారు. చదవండి: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్ సీపీ -
వాట్సాప్ గ్రూప్ లో టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్
-
పేపర్ లీక్ కేసు చైర్మన్ కూడా విచారణకు రావలసిందే!
-
TSPSC పేపర్ లీక్ పై రంగంలోకి ఈడీ
-
నిందితులను రక్షించడానికే సిట్: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
బిజినేపల్లి: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిందితులను పట్టుకోవడానికి కాకుండా..అసలు నిందితులను రక్షించడానికే పనిచేస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ బోర్డుకు, ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధాలున్నాయనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయన్నా రు. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు లింగారెడ్డి పీఏకు గ్రూప్–1లో 127 మార్కులు ఎలా వచ్చాయని, ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేసే రాజశేఖర్రెడ్డికి లింగారెడ్డి స్వయంగా మేనబావని తెలిపారు. రాజ్యాధికార యాత్ర లో భాగంగా శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ప్రవీణ్ కుమార్ పర్య టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్ ఈ కేసులో అసలు దోషులను వదిలేసి, కిందిస్థాయిలో 12 మందిని అరెస్టు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 2009 బ్యాచ్కు చెందిన 200 మంది ఎస్సైల పదోన్నతుల ఫైల్ను పెండింగ్లో పెట్టారని, అలాంటి ఫైల్స్ చూడని హోంమంత్రిపై త్వర లోనే మిస్సింగ్ కంప్లైంట్ చేస్తామన్నారు. ప్రభుత్వానికి పనిచేయాల్సిన అడ్వొకేట్ జనరల్ కవిత లిక్కర్ స్కాం కేసు కోసం ఈడీ ముందు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్.. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు నిందితుల రిమాండ్ రిపోర్టు సాక్షి టీవీ చేతికి అందింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తొమ్మిది మంది నిందితులతోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రిమాండ్ రిపోర్టు ప్రకారం.. అరెస్టయిన వారిలో నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు.. A1 ప్రవీణ్ TSPSC సెక్రెటరీ పీఏ, A2 నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్, A10 ASO షమీమ్, A12 డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజశేఖర్ ఉన్నారు. నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 19 మంది సాక్షులను విచారించాం. టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకరలక్ష్మి ప్రధాన సాక్షి. ఫిర్యాదుదారుడు అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ ఉద్యోగులు, కర్మన్ ఘాట్లోని ఒక హోటల్లోని యాజమని, ఉద్యోగిని సాక్షి. ఈ నెల 4వ తేదీన ఆర్ స్క్వేర్ హోటల్లో నీలేష్, గోపాల్తో పాటు డాక్యా బస చేశారు. హోటల్లో రెండు గదులు (107,108) అద్దెకు తీసుకుని.. అక్కడే ప్రశ్నాపత్రం చూసి ప్రిపేర్ అయ్యారు. తర్వాత నీలేష్, గోపాల్ నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లారు. హోటల్లోని సీసీటీవి ఫుటేజీలో పేపర్ ఎక్స్చేంజ్ వ్యవహారం నిక్షిప్తమైంది. ప్రవీణ్, రాజశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్లను అరెస్ట్ చేశాం. ముగ్గురు నిందితుల నుంచి ఒక ల్యాప్టాప్, మూడు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను కస్టడి కోరిన సిట్ మరోవైపు పేపర్లీక్ కేసులో ఇటీవల అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను సిట్ ఏడు రోజులపాటు కస్టడీకి కోరింది. షమీం, రమేష్, సురేష్లను సిట్ గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
టీఎస్పీఎస్సీ వ్యవహారం.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలి.. ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి తీవ్రంగా స్పందించారు. మొదటిసారి పేపర్ లీక్ అయినప్పుడు కమిషన్ కార్యదర్శిని 48 గంటల్లో లీకేజీకి సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తూ కమిషన్కు లేఖ రాసిన సంగతి విదితమే. తాజాగా గురువారం మరో లేఖను ప్రభుత్వానికి, కమిషన్కు రాశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పోటీపరీక్షలకు హాజరైన కమిషన్ రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరు? కమిషన్ నుంచి అనుమతితో, అనుమతి లేకుండా హాజరైన వారెవరెవరు? పరీక్షల్లో సాధించిన మార్కులు ఎన్ని? పరీక్షల తర్ఫీదుకు సెలవులు తీసుకున్నారా? వంటి వివరాలతో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు తాజా పురోగతిపై 48 గంటల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ ఆదేశాలతో ఈ మేరకు రాజ్భవన్ గురువారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీ, టీఎస్పీఎస్సీకి లేఖలు రాసింది. సిట్ దర్యాప్తులో పురోగతిని సైతం నివేదికలో తెలపాలని కోరింది. చదవండి: సిట్కు బండి సంజయ్ లేఖ.. ‘విచారణకు హాజరుకాలేను’ -
టీఎస్పీఎస్సీ వద్ద ప్లెక్సీల కలకలం.. ఇచ్చట అన్ని పేపర్లు లభించును..!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ వద్ద బుధవారం ఉదయం ప్లెక్సీలు ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఇది జీరాక్స్ సెంటర్.. ఇచట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పత్రాలు లభించును.. అంటూ నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయం సమీపంలో గోడ పత్రికలు వెలిశాయి. అయితే టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాలు లీక్ కావడంపై ఆవేదనతో ఒక విద్యార్థిగా ఈ విధంగా నిరసన తెలిపినట్లు ఓయూ జేఏసీ ఛైర్మన్ అర్జున్ బాబు తెలిపాడు. గతవారం రోజులుగా విద్యార్థి లోకాన్ని అయోమయానికి గురి చేసిన టీఎస్పీఎస్పీ కార్యాలయం వద్ద తానే ఫ్లేక్సీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు. గోడ పత్రికలో ఆయన ఫొటో కూడా ముద్రించుకున్నాడు. పేపర్లు లీక్ చేసిన టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా పరీక్షను రద్దు చేయడమేంటని ప్రశ్నించాడు. శిక్ష ఎవరికి వేశారు? బోర్డుకా లేకా విద్యార్థులకా? అని ధ్వజమెత్తాడు. కస్టడీలో నిందితులు.. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా మొత్తం 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. గ్రూప్–1 పరీక్ష పేపర్లు చేజిక్కించుకున్న అనుభవంతో ప్రవీణ్, రాజశేఖర్లు మిగిలిన పరీక్షల సమయంలోనూ తమ ప్రయత్నాలు కొసాగించారు. గత నెల ఆఖరి వారంలో మరో నాలుగు పరీక్షలకు సంబంధించిన పది క్వశ్చన్ పేపర్లు వీరికి చిక్కాయి. అయితే వాటిని ఎలా విక్రయించాలో అర్థం కాని ప్రవీణ్ తనతో సన్నిహితంగా ఉండే రేణుకను సంప్రదించాడు. తన సమీప బంధువైన కానిస్టేబుల్ శ్రీనివాస్ ద్వారా ఏఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్లను రేణుక సంప్రదించింది. ప్రవీణ్ నుంచి పేపర్ అందగానే భర్త డాక్యాతో కలిసి స్వగ్రామమైన మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ తండాకు వెళ్లి, రెండురోజుల పాటు తన ఇంట్లోనే నీలేశ్, గోపాల్తో చదివించింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు మంగళవారం రేణుక, డాక్యా నాయక్, నీలేశ్, గోపాల్లను ఆ తండాకు తీసుకువెళ్లి సీన్ రీ–కన్స్ట్రక్షన్ చేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement