More

కొడవటిగంటి వరూధిని కన్నుమూత 

10 Feb, 2022 03:46 IST

సాక్షి, హైదరాబాద్‌: కొడవటిగంటి కుటుంబరావు భార్య, దివంగత రచయిత్రి శాంతసుందరి తల్లి శ్రీమతి వరూధిని (97) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ప్రముఖ నటి, రచయిత్రి కొమ్మూరి పద్మావతి, పాత్రికేయులు కొమ్మూరి వెంకట్రామయ్యలకు 29 మార్చి 1925లో గుంటూరులో వరూధిని జన్మించారు.

ఆకాశవాణి లలిత సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నారు. కుటుంబరావును  1945లో వివాహమాడారు. అప్పటి నుంచీ, కొకు రాసిన ప్రతీ రచనను భద్ర పరి చారు. కొడుకు రోహిణి ప్రసాద్‌(49) అణుశాస్త్రవేత్త, సైన్స్‌ రచయిత 2012లో అనారోగ్యంతో మరణించారు. వరూధిని కూతురు, సాహిత్య అకాడమీ అవార్డ్‌ గ్రహీత శాంత సుందరి (72) కేన్సర్‌తో ఇటీవలే మరణించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

దమ్ముంటే అక్కడ గెలవండి! చిదంబరానికి మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు: భట్టి

తెలంగాణలోనే గ్యాస్‌ ధరలు ఎక్కువ: చిదంబరం

రౌడీషీటర్లపై ఉక్కుపాదం