More

PM Modi Hyderabad Tour: 2 రోజులు హైదరాబాద్‌లోనే మోదీ

26 Jun, 2022 07:45 IST

జూలై 2న బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని రాక 

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా హైదరాబాద్‌లో రెండురోజుల పాటు బస చేయనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు జూలై 2న సాయంత్రం మోదీ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగాక రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌–హైటెక్స్‌లో జరిగే జాతీయకార్యవర్గ సమావేశ ప్రాంతానికి చేరుకుంటారు.

ఆరోజు రాత్రి రాజ్‌భవన్‌లో ఉంటారు. 3న ఉదయం రాజ్‌భవన్‌ నుంచి నోవాటెల్‌ హోటల్‌కు వెళతారు. కార్యవర్గ సమావేశాలు ముగిశాక సాయంత్రం పరేడ్‌గ్రౌండ్స్‌లో బహిరంగసభలో పాల్గొంటారు. సభ ముగిశాక తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. 4వ తేదీన ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి ఆంధ్రప్రదేశ్‌ వెళ్లి భీమవరానికి చేరుకుంటారు. అక్కడ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని, ట్రైబల్‌ మ్యూజియంను ప్రారంభిస్తారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

స్నేహితుల మధ్య యుద్ధం.. గెలుపు నీదా నాదా సై..!

‘అందుకే 15 రోజుల్లో కుట్ర అంటూ కేటీఆర్‌ సంకేతాలిచ్చారు’

నన్ను చంపాలని చూశారు: ఎమ్మెల్యే గువ్వల

మెదక్‌లో పండగపూట విషాదం.. టపాసులు కొనడానికి వెళ్తుండగా..

సీతక్కకు ప్రచారం ఎక్కువ..పని తక్కువ: హరీశ్‌రావు