తలకోనలో కూంబింగ్

2 Aug, 2015 08:30 IST|Sakshi

చిత్తూరు (ఎర్రావారిపాలెం) : చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలంలోని తలకోన అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు.

అటవీ ప్రాంతంలో ఓ చోట డంపింగ్ చేసిన సుమారు రూ.25 లక్షల విలువ చేసే 240 కేజీల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కూలీలంతా వేలూరు జిల్లా అద్దెకుప్పానికి చెందిన వారిగా గుర్తించారు.
 

మరిన్ని వార్తలు