ఎంతెంత దూరం..

30 Jan, 2014 02:25 IST|Sakshi

 ‘అయ్యా.. మాయమ్మకు కాలిరిగింది.. ఆటోలో తీసుకొచ్చాను.. లోపలికి తీసుకెళ్లండి’ అంటూ అనంతపురం శివారులోని బీజేపీ కొట్టాలకు చెందిన ఓబిలేసు బుధవారం ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని ప్రాధేయపడ్డాడు.

‘కాసేపుండవయ్యా.. స్ట్రెచర్లు ఖాళీ లేవు’ అంటూ సిబ్బంది దబాయించారు. బాధతో తల్లి గంగమ్మ విలవిలలాడిపోతుండటం చూసి ఉండబట్టలేక ఆమెను భుజానేసుకుని లోపలికి తీసుకెళ్తున్న దృశ్యమిది.
 - సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం.
 

మరిన్ని వార్తలు