ఏసీబీకి వలలో పెదపెంకి వీఆర్వో

26 Feb, 2015 14:18 IST|Sakshi

విజయనగరం: ఒక రైతు నుంచి రూ. 3500 లంచం తీసుకుంటూ బలిజపేట వీఆర్వో ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలు...పట్టాదారు పాసు పుస్తకం కోసం బలిజపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన ఒక రైతు దరఖాస్తు చేసుకోగా, మంజూరు కోసం ఆ గ్రామ రెవెన్యూ అధికారి రూ. 3500 లంచం డిమాండ్ చేశారు. అయితే అంత సొమ్ము ఇచ్చుకోలేని సదరు రైతు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు రైతునుంచి వీఆర్వో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు