ఏపీ గవర్నర్‌తో అమెరికా కాన్సుల్‌ ప్రతినిధుల భేటీ

16 Oct, 2019 14:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను అమెరికా కాన్సుల్‌ ప్రతినిధులు బుధవారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ బృందంలో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ రీఫ్‌మెన్, ఇతర సభ్యులు ఉన్నారు. ఇరు దేశాల్లోని గవర్నర్‌ వ్యవస్థలపై కాన్సుల్‌ సభ్యులు, గవర్నర్‌ ఆసక్తికర చర్చ కొనసాగింది. అమెరికాలోని గవర్నర్‌ వ్యవస్థకు ఇక్కడికి పోలిక లేదని తెలిపిన గవర్నర్‌ బిశ్వభూషన్‌.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తగిన రీతిలో సహకరించాలని కాన్సుల్‌ సభ్యులకు సూచించారు. తమ పరిధిలో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, ఒడిషా కూడా ఉన్నాయని కాన్సుల్‌​ జనరల్‌ గవర్నర్‌కు వివరించారు. 

మరిన్ని వార్తలు