ఇద్దరు తెలుగు ఉద్యోగుల అపహరణ

29 Jul, 2014 11:54 IST|Sakshi

అసోం : అసోంలో ఇద్దరు తెలుగువారిని బోడో తీవ్రవాదులు  కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  కిడ్నాప్ అయిన రఘు, ప్రదీప్లు పృధ్వీ కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. వారిని విడుదల చేసేందుకు  తీవ్రవాదులు రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

 

కాగా తమ కుమారుల కిడ్నాప్ సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ అయినవారిలో ఒకరు విజయవాడకు చెందినవారు. కాగా గతంలోనూ బోడో తీవ్రవాదులు....అక్కడ పనిచేసే తెలుగు వారిని అపహరించుకు వెళ్లిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు