-

గవర్నర్‌కు సీఎం జగన్‌ న్యూఇయర్‌ విషెస్‌

1 Jan, 2020 21:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం సాయంత్రం గవర్నర్‌కు ఫోన్‌ ద్వారా విషెస్‌ తెలిపిన సీఎం జగన్‌.. కొత్త ఏడాది అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. ఇక రేపు(గురువారం) సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు.  

గవర్నర్‌, సీఎంను కలిసిన డీజీపీ
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు, అధికారులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జీకే మహేశ్వరిలను డీజీపీ కలిసి న్యూఇయర్‌ విషెస్‌ తెలియజేశారు. 

మరిన్ని వార్తలు