సాక్షి, విజయవాడ: ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకంపై నిన్న (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి.. నేడు వాటిని వెనక్కి తీసుకున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం 317 సర్క్యులర్లో ప్రకటించింది.. నేడు ఆ సర్క్యులర్ను వెనక్కి తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ప్రకటించారు.
(చదవండి: ఎస్ఈసీ అంశంపై సుప్రీంకు వెళ్తున్నాం: ఏపీ ఏజీ)
(ఏపీ ఎన్నికల కమిషన్ నిన్న విడుదల చేసిన సర్క్యులర్ )
(నిన్నటి సర్క్యులర్ను వెనక్కి తీసుకుంటున్నట్టు తాజా ప్రకటన)