శ్రీకాకుళం ప్రజలకు విద్యుత్‌ శాఖ ఊరట

18 Oct, 2018 16:12 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : టిట్లీ తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విద్యుత్‌ శాఖ ఊరటనిచ్చింది. ఈ నెల కరెంట్‌ ఛార్టీలను వచ్చే నవంబరులో కట్టుకునే వెసులుబాటును కల్పించింది. దీనికి ఎలాంటి అపరాద రుసుం వసూలు చేయరని తెలిపింది. టిట్లీ తుఫాను కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు భారం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈసీడీసీఎల్‌ కంపెనీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

మరిన్ని వార్తలు