పసికందు కిడ్నాప్

14 Feb, 2016 09:10 IST|Sakshi

గుంటూరు జిల్లా మాచర్ల మండలం అడిగొప్పుల అమ్మవారి ఆలయం వద్ద ఆరు నెలల బాలుణ్ణి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు పట్టణానికి చెందిన ఎర్రదేశి రామాంజి, మన్నెమ్మ అనే దంపతులు బంధువులతో కలిసి తమ కుమారుడికి అన్నప్రాశన చేసేందుకు గుంటూరు జిల్లా మాచర్ల మండలం అడిగొప్పుల అమ్మవారి ఆలయానికి శనివారం రాత్రి 8 గంటలకు వచ్చారు.


రాత్రి పొద్దుపోయాక ఆలయం బయట అడుకుంటున్న అరవింద్(6 నెలలు) అనే పిల్లవాణ్ణి గుర్తుతెయని వ్యక్తులు ఎత్తుకుని పిల్లవాడు ముద్దుగా ఉన్నాడని ముద్దాడుతూ పిల్లవాడితో సహా ఉడాయించారు. ఈ హటాత్ సంఘటనతో ఖంగుతున్న పిల్లవాని తల్లిదండ్రులు మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పిల్లవాని ఆచూకి కోసం గాలిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు