బోలెరో బోల్తా: ఆరుగురికి గాయాలు

24 Apr, 2015 19:27 IST|Sakshi

విశాఖపట్నం : శుక్రవారం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి శిలానగర్ వైపు వెళ్తున్న బోలెరో వాహనం ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. టైరు పంక్చర్ కావడమే వాహనం బోల్తా పడటానికి కారణమని తెలుస్తోంది. బోలెరోలో వరుణ్ జేసీబీ కంపెనీకి చెందిన ఐదుగురు మహిళలు, మరో వ్యక్తి ఉన్నారు. ఈ ప్రమాదంలో వీరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు.

మరిన్ని వార్తలు