కంచికచర్ల: కృష్ణాజిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్మరణం చెందారు. కంచికచర్లలో ఎంఐసీ (మిక్) ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వి.రామకృష్ణ బైక్పై కాలేజీకి వస్తుండగా హైదరాబాద్ నుంచి కంచికచర్ల వైపు వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ సంఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.
చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ కానిస్టేబుల్స్ ఎంపిక పరీక్షల్లో ఇన్విజిలేటర్గా విధులు నిర్వర్తించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు కారుడ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.