తుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి

16 Jun, 2019 08:59 IST|Sakshi

సాక్షి, తిరుపతి : తుడా చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి హాజరై అభినందనలు తెలిపారు. కాగా చెవిరెడ్డి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ ఆయన తుడా చైర్మన్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ...తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.

మరిన్ని వార్తలు