4న ఢిల్లీ వెళ్లనున్న సీఎం కిరణ్

2 Sep, 2013 21:17 IST|Sakshi

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 4వ తేదీ బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అపాయింట్‌మెంట్‌ కోరారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్న నేపధ్యంలో  20 రోజుల్లో తెలంగాణ తీర్మానాన్ని కేంద్ర మంత్రి మండలి ముందుకు తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించిన పరిస్థితులలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో పరిస్థితులను, సీమాంధ్ర ఉద్యమాల గురించి సీఎం ప్రధానికి వివరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు