-
ఒరిగింది జీరో
అనంతపురం : పైలీన్ సైక్లోన్ను ఆపలేకపోయా కానీ.. రాష్ట్ర విభజన సైక్లోన్ను మాత్రం ఆపే శక్తి తనకుందని ప్రగల్భాలు పలికిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆయన హయాంలో ‘అనంత’కు ఒరగబెట్టిందేమీ లేదు. మంగళవారం లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో మూడు సంవత్సరాల రెండున్నర నెలల పాలనకు తెరపడింది. ఆయన 12 పర్యాయాలు జిల్లాలో పర్యటించి 60 హామీలు ఇచ్చారు. ఇందులో రెండు మూడు హామీలు మాత్రమే అదీ పాక్షికంగా నిలబెట్టుకున్నారు. 1994, 1999 ఎన్నికల్లో ఘెర పరాజయం పాలై జీవశ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్రతో తన రెక్కల కష్టంతో 2004 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలోకితెచ్చారు. 2009 ఎన్నికల్లో సైతం ఆయన ఒంటి చేత్తో అధికారాన్ని కట్టబెట్టారు. రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే 2009 సెప్టెంబరు 2న వైఎస్ అమరుడయ్యారు. ఆ తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన కె.రోశయ్యను కాంగ్రెస్ అధిష్టానం 2010 నవంబర్ 24న బలవంతంగా దించేసింది. ఆ స్థానంలో కిరణ్కుమార్రెడ్డిని కూర్చోబెట్టింది. కిరణ్ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో జిల్లా నుంచి ఎన్.రఘువీరారెడ్డికి రెవెన్యూ శాఖ.. ఎస్.శైలజానాథ్కు ప్రాథమిక విద్య శాఖ దక్కింది. ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ చివరిసారిగా డిసెంబర్ 23న అనంతపురంలో నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. హామీల్లో ఘనం సీఎంగా కిరణ్ జిల్లాలో పర్యటించిన ప్రతిసారీ హంద్రీ-నీవా సుజల స్రవంతి తొలి దశ ఆయకట్టుకు ఖరీఫ్లో నీళ్లందిస్తామని.. రెండో దశ ఆయకట్టుకు 2014లోగా నీళ్లందిస్తామని పదేపదే హామీ గుప్పించారు. జీడిపల్లి రిజర్వాయర్కు హంద్రీ-నీవా కాలువ ద్వారా 1.65 టీఎంసీలను మాత్రమే తరలించగలిగారు. ఆయన తొలి సారి రచ్చబండలో భాగంగా 2011 జనవరి 30న గార్లదిన్నెలో పర్యటించారు. ఆ సందర్భంలో పెనకచెర్ల-కత్రిమల మధ్య మధ్యపెన్నార్ డ్యాంపై రూ.16 కోట్ల వ్యయంతో బ్రిడ్జిని నిర్మిస్తామని హామీ ఇచ్చి దానిని విస్మరించారు. కిరణ్ ఇచ్చిన 60 హామీలదీ అదే పరిస్థితి. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్లో మన జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగితే కనీసం ప్రశ్నించిన పాపాన పోలేదు. కర్ణాటక భారీగా లబ్ధి పొందినా చూస్తుండిపోయారు. పెన్న అహోబిలం రిజర్వాయర్కు కనీసం పది టీఎంసీలను సాధించుకోవడంలో కూడా కిరణ్ సర్కారు విఫలమైంది. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయడంతో మంత్రి మండలి రద్దయింది. దీంతో రఘువీరారెడ్డి, శైలజానాథ్ మాజీ మంత్రులయ్యారు. కాగా, కిరణ్ హయాంలో రఘువీరా, శైలజానాథ్లు జిల్లాకు చేకూర్చిన ప్రగతి కంటే వ్యక్తిగతంగానే ఎక్కువగా లబ్ధిపొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. -
విభజన డ్రామాలో కిరణ్ ఒక ఎపిసోడ్
నంద్యాల, : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రాజీనామా రాష్ట్ర విభజన కోసం సోనియాగాంధీ ఆడించిన డ్రామాలో ఒక ఎపిసోడ్ అని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి ‘న్యూస్లైన్’తో ఫోన్లో మాట్లాడారు. విభజన సజావుగా సాగేందుకు ముఖ్యమంత్రిగా కిరణ్ను కొనసాగించడం ద్వారా అధిష్టానం లక్ష్యం నెరవేర్చుకుందన్నారు. సమైక్య రాష్ట్రం విషయంలో నాటకాన్ని ఆయన రక్తి కట్టించారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మిత్రపక్షాలుగా పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ నేత మోడీ సీమాంధ్రకు మద్దతు ప్రకటిస్తుండగా.. సుష్మాస్వరాజ్, అరున్జైట్లీ, రాజ్నాథ్సింగ్లు తెలంగాణకు మద్దతిస్తూ ద్వంద్వ నీతిని అవలంబించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాతే విభజన చేస్తామని లోక్సభలో బిల్లును బీజేపీ వ్యతిరేకించి ఉంటే ఆ పార్టీ విలువ రెట్టింపయ్యేదన్నారు. చంద్రబాబు సమైక్య లేఖ ఇవ్వకుండా సీమాంధ్రను మోసగించారన్నారు. బీజేపీతో బాబు చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం కూడా విభజనకు మార్గం సుగమమం చేసిందన్నారు. ఇన్నివిధాల ద్రోహం చేసిన బాబుకు సీమాంధ్రలో పోటీ చేసేందుకు అర్హత లేదన్నారు. కాంగ్రెస్ డెరైక్షన్లో కిరణ్ సమైక్యవాదిగా ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తూనే విభజనకు సహకరించారన్నారు. మీడియాలో ప్రకటనలు తప్పిస్తే సమైక్య రాష్ట్ర పరిరక్షణకు ఆయన చేసిన కృషి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే రాష్ట్ర సమైక్యతకు అలుపెరగని పోరు సాగించారని.. విభజన వాదుల దిమ్మతిరిగే సమాధానం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఆయన కోరారు. -
సీఎం హామీ గాలికే..
సీఎం హామీ గాలికే.. న్వాడ మండలం మందిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు * 50 లక్షలు మంజూరు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చేసిన వాగ్ధానం హామీలకే సరిపోయింది. ముఖ్యమంత్రి గ్రామాన్ని సందర్శించి 11 నెలలైనా అభివృద్ధి కార్యక్రమాల కోసం నయా పైసా మంజూరు కాలేదు. దీంతో తమ గ్రామానికి నిధులు ఎప్పుడోస్తాయోనని గ్రామస్తులు నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. -, ధన్వాడ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి 2013 మార్చి 12న వ్యవసాయ శాఖమంత్రి రఘువీరారెడ్డి, సమాచార శాఖమంత్రి డీకే అరుణ ధన్వాడ మండల పరిధిలోని మందిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామం నుంచి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా గ్రామ వీఆర్వో కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి తమ గ్రామానికి వస్తే గ్రామం అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని గ్రామంలోని ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఏకమై ఆయన సమావేశాన్ని విజయవంతం చేసేందుకు సహకరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు ప్రశాంతంగా జరగడానికి ఈ గ్రామ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా సహకరించారని గ్రామాభివృద్ధి కోసం * 50 లక్షలు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. గ్రామంలో వీఆర్వో కార్యాలయ నిర్మాణం కోసం నిధులు, ఎస్సీ, ఎస్టీలను ఆదుకునేందుకు ఇందిర జలప్రభ కింద సామూహిక బోర్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ముఖ్యమంత్రి గ్రాంట్ కింద మంజూరైన నిధులతో మందిపల్లి, మందిపల్లి పాతతండా, కొత్త తండాల్లో నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు చేపట్టాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించారు. అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు కాకపోవడంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. సీసీ రోడ్లు నిర్మించిన రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీలు లేకపోవడంతో వర్షపు, ఇళ్ల మధ్య నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. గ్రామంతో పాటు పాతతండా, కొత్తతండాల్లో అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. చెరువు మరమ్మతు పనులు నిలిచిపోయాయి. హెల్త్ సబ్సెంటర్కు సొంత భవనం లేదు. ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తే ఈ సమస్యలకు పరిష్కారం లభించేది. ధన్వాడ, మరికల్ గ్రామాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ధన్వాడలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, మరికల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేందుకు *40 లక్షలు మంజూరు చేస్తామని, రెండో విడతలో మరికల్ బహిరంగ సభలో ప్రకటించారు. ధన్వాడలో ప్రధాన రహదారిని * 20 లక్షలతో సీసీ రోడ్డుగా మార్చారు. మరికల్కు * 40 లక్షలు మంజూరు కాగా వాటితో డ్రైనేజీల నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కాని రాజకీయ విబేధాలకు నిలయంగా ఉండే మందిపల్లి గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి రెవెన్యూ సదస్సును విజయవంతం చేసిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించే విషయంలో ఈ గ్రామంపై సీఎం సవతి తల్లి ప్రేమ చూపించారని స్థానికులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ స్పందించి మందిపల్లి గ్రామాభివృద్ధి కోసం మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన * 50 లక్షలను వెంటనే విడుదల చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రేపు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన
చిత్తూరు (కలెక్టరేట్), న్యూస్లైన్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించనున్నట్లు కలెక్టర్ రాంగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఆది వారం మధ్యాహ్నం 1 గంటకు అనంతపురం జిల్లా నుంచి బయలుదేరి 2.30 గంటలకు వి.కోటకు చేరుకుంటారు. వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండలో పాల్గొంటారు. సాయంత్రం 4.40 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.50 గంటలకు హెలిప్యాడ్ చేరుకుంటారు. 5 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 5.30 గంటలకు కలికిరి చేరుకుంటారు. తర్వాత 5.40 గంటలకు పీలేరు ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 6.10 గంటలకు స్వగ్రామం నగిరిపల్లెకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలికిరి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా రాయచోటికి చేరుకుంటారు. అక్కడ రచ్చబండ సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని భోజన విరామానంతరం 2.30 గంటలకు రాష్ర్ట రాజధాని హైదరాబాద్కు బయలుదేరుతారు. -
పక్షం రోజులైనా.. సాయం సున్నా
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఎడతెరిపిలేని వర్షాలు వచ్చి జనం కడగండ్ల పాలై పక్షం రోజులు చూస్తూండగానే గడచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, చివరకు సీఎం కిరణ్కుమార్రెడ్డే స్వయంగా జిల్లాకు వచ్చి వెళ్లినా కూడా బాధితులకు ఒరిగిందేమీ లేదు. వచ్చిన నాయకులంతా ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లారే తప్ప ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు. ఇళ్లు దెబ్బ తిన్నవారిని పట్టించుకోనేలేదు అధికార యంత్రాంగం లెక్కల ప్రకారం జిల్లాలో 3 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. అత్యధికంగా అమలాపురం రెవెన్యూ డివిజన్లో 806 ఇళ్లు దెబ్బతిన్నాయి. వాస్తవానికి జిల్లాలో దెబ్బతిన్న ఇళ్లు ఐదారు వేలుంటాయని అంచనా. ఇళ్లు కూలిపోయి కొందరు, మంచాలు, వంటపాత్రలు.. ఇలా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలినవారు మరికొందరు ఉన్నారు. ఇళ్లు కూలి రోడ్డున పడిన కుటుంబాలకు ఇంతవరకూ చిల్లిగవ్వ కూడా సాయం చేయలేదు. దెబ్బ తిన్న ఇళ్ల వద్దకు వచ్చి అధికారులు పేర్లు నమోదు చేసుకుని పది రోజులు కావస్తోంది. మండల స్థాయిలో దెబ్బతిన్న ఇళ్ల లెక్క తేల్చినా పరిహారం ఊసే లేదు. కనీసం అధికారులు గుర్తించిన బాధితుల పునరావాసానికి కూడా ఏమీ ఇవ్వలేదు. జిల్లా కేంద్రం కాకినాడలోని పర్లోపేట, సంజయ్నగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం నాటికి కూడా పరిహారం ఇవ్వలేదని ముంపు బాధితులు కొండబాబు, వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం మాటలు.. నీటిమూటలు ఇళ్లు దెబ్బ తిన్నవారికి దుస్తులు, వంటపాత్రల కోసం తక్షణ సాయాన్ని రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచినట్టు సీఎం కిరణ్కుమార్రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు చెప్పారు. మగ్గాల్లో నీరు చేరినవారికి రూ.5 వేలు, నూలు, ఇతర రసాయనాల విలువనుబట్టి మరో రూ.5 వేలు తక్షణం ఇస్తామని గొప్పగా ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. గుప్పెడు బియ్యానికీ గతిలేదు ప్రజాపంపిణీ ద్వారా కేజీ బియ్యం కూడా ఇంతవరకూ ఇవ్వలేదు. పొయ్యి మీదకి అవసరమైన సరకుల సంగతి అలా ఉంచితే.. కనీసం పొయ్యి కిందకి కావలసిన కిరోసిన్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. వర్ష బాధితుల కోసం జిల్లాలో లక్షా 56 లీటర్ల కిరోసిన్ విడుదల చేసినట్టు జిల్లా యంత్రాంగం చెబుతోంది. కానీ, ఇంతవరకూ ఏ ఒక్క బాధిత కుటుంబానికి ఒక్క లీటరు కిరోసిన్ కూడా ఇవ్వలేదు. అన్నదాతకు భరోసా ఏదీ? జిల్లాలో వరి, పత్తి, అరటి, ఉల్లి, బొప్పాయి, కూరగాయలు, పూల తోటలు అన్నీ కలిపి 3.50 లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. చేతికొచ్చిన పంట ముంపు బారిన పడి చేలల్లోనే కుళ్లిపోతుంటే.. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు బరువెక్కిన గుండెలతో బలవన్మరణాల బాట పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు రైతులు మృతి చెందారు. తక్షణం ఆదుకొని.. వారిలో ధైర్యాన్ని నింపవలసని ప్రభుత్వం నుంచి అటువంటి స్పందనే లేదు. తాజాగా పంట నాశనమైందన్న మానసిక వేదనతో.. కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి శివారు పెదకలవల దొడ్డిలో కౌలు రైతు నురుకుర్తి సత్యనారాయణ (55) శనివారం రాత్రి హఠాత్తుగా మృతి చెందాడు. కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన రైతు బుద్ధ శివ ఆదివారం ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. భారీ వర్షాలకు ఇతడికి చెందిన నాలుగు ఎకరాల చేను నాశనమైంది. అప్పులు తీర్చేలేని పరిస్థితుల్లో ఆత్మహత్యా యత్నం చేసుకుని, ఆస్పత్రిపాలయ్యాడు. జిల్లాలో రైతు దయనీయ పరిస్థితిని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. వరిలో అత్యధికంగా ఎకరాకు రూ.25 వేలు పైబడి పెట్టిన పెట్టుబడులు తిరిగి దక్కని పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం కోసం రైతులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది నవంబర్లో వచ్చిన నీలం తుపాను బాధిత రైతులకే ఇంతవరకూ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఈసారి వర్షాలవల్ల వాటిల్లిన నష్టానికి పరిహారం అందాలంటే మరో ఏడాది ఆగాల్సి వస్తుందని అన్నదాతలు దిగులు చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది రైతులు సాయం కోసం సర్కార్ వైపు చూస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు తక్షణ సాయం అందించి, భరోసా ఇచ్చేవారని బాధితులు అంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement