సాక్షి, అమరావతి: ఆంగ్లభాషలో బోధన..మత మార్పిడిలను ప్రోత్సహించేదిగా ఉందన్న బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత మార్పిడిలను ప్రోత్సహించేదైతే మీ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివించారని ప్రశ్నించారు. తెలుగుతో సమాంతరంగా ఆంగ్లభాషలో బోధనను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ కోరారు.