సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

7 May, 2018 07:17 IST|Sakshi

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కె.లక్ష్మీ శ్రీనాథ్‌ కోరారు. ఆదివారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కౌతవరం వచ్చిన వై.ఎస్‌.జగన్‌మోహనరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విధానం వలన రాష్ట్రంలో 1.86లక్షల మంది ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. విద్యుత్‌ శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఆ సంఘ నేత శ్రీనివాస్‌ నాయకత్వాన జగన్‌కు సీపీఎఫ్‌ను రద్దు చేయాలని రాత పూర్వకంగా కోరారు. పంచాయతీరాజ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ సీఐటీయూ రాష్ట్ర సభ్యుడు మద్దాల జగన్‌ వినతిని అందించారు. 

మరిన్ని వార్తలు