పిడుగురాళ్లరూరల్: బావిలో మొసలి పిల్ల కనిపించిన ఘటన మండలంలోని కామేపల్లి గ్రామ బైపాస్ వద్ద జరిగింది. షేక్ మాబు సైదా తన పొలం పక్కనే ఉన్న బావిలో నుంచి వరి పొలానికి నీళ్లు పెడుతుండగా బుధవారం బావి అడుగున చిన్న మొసలి పిల్ల బయటపడింది. 12 కిలోల బరువు, సుమారు నాలుగు అడుగులు పొడవు ఉంది. ఈ విషయం వెంటనే స్థానికులు ఫారెస్టు అధికారులకు తెలపగా ప్రస్తుతం తాము సీఎం పర్యటనలో ఉన్నామని, గురువారం ఉదయం వస్తామని చెప్పినట్లు సమాచారం.