అనంతలో దోపిడీ దొంగలు బీభత్సం

16 Sep, 2017 09:42 IST|Sakshi

సాక్షి, గుత్తి : అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తన ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలను అడ్డుకునే క్రమంలో ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని గుత్తి కుమ్మరవీధిలోని ఓ ఇంట్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు.

ఇంట్లో బీరువాలు, లాకర్లు వెతుకుండగా ఇది గమనించిన ఇంటి యజమాని దొంగలను అడ్డుకున్నారు. కానీ దోపిడీ దొంగలు యజమానికి హత్యచేసి 25 తులాల బంగారం, రూ. 5లక్షల నగదుతో ఉడాయించారు. స్థానికుల నుంచి సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు