గుంటూరు : పరువు హత్య కేసులో దీప్తి తల్లిదండ్రులు సామ్రాజ్యం, హరిబాబు పోలీసులకు లొంగిపోయారు. కులాంతర వివాహం చేసుకుందని కుమార్తెను దీప్తి తల్లిదండ్రులే కసాయిలుగా మారి దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరులోని రాజేంద్ర నగర్ లో చోటు చేసుసుకున్న విషయం తెలిసిందే. రిసెప్షన్ ఏర్పాటు చేసి, సత్యనారాయణ వ్రతం జరిపిస్తామని నమ్మించి దీప్తి తల్లిదండ్రులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. నిందితులను పోలీసులు ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు.