వారిద్దరూ సమైక్యాంధ్ర ద్రోహులు: ఉమ

19 Dec, 2013 09:31 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ బిల్లు ముసాయిదాను సరిగా తర్జుమా చేయలేదని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ ఆరోపించారు. తప్పుడు సమాచారం ఇచ్చి సభ్యులను సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ తప్పుదోవ పట్టించారని ఆయన అన్నారు. దేవినేని ఉమ గురువారం అసెంబ్లీ మీడియా వద్ద మాట్లాడుతూ తెలుగు బిల్లు ప్రతులకు... ఇంగ్లీష్ బిల్లు ప్రతులతో సంబంధమే లేకుండా ఉన్నాయన్నారు.

సభ్యులకు పూర్తి సమాచారం ఇవ్వలేకపోయారని....  ఇది సభ్యులను తప్పుదోవ పట్టించటమేనని ఆయన అన్నారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో మకాం వేసి రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని ఉమ మండిపడ్డారు. వారిద్దరూ సమైక్యంధ్ర ద్రోహులని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు