తిరుమలలో కిక్కిరిసిన క్యూలైన్లు

18 Jun, 2017 09:41 IST|Sakshi
తిరుమలలో కిక్కిరిసిన క్యూలైన్లు

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం వైకుంఠం కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి కిలోమీటర్‌ మేర బయటివరకు భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం)స్వామివారిని 1,01,386 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు