విద్యుత్‌ ఉద్యోగుల మెరుపు సమ్మెపై డీజీపీ సమీక్ష

25 May, 2014 15:08 IST|Sakshi
విద్యుత్‌ ఉద్యోగుల మెరుపు సమ్మెపై డీజీపీ సమీక్ష
హైదరాబాద్: 75 వేల మంది విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న మెరుపు సమ్మెపై డీజీపీ ప్రసాదరావు స్పందించారు.  మెరుపు సమ్మె పేరుతో చట్టాన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. 
 
ప్రభుత్వం, అధికారులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. సమ్మె కారణంగా  ప్రజలకు, సంస్థలకు, ఉత్పత్తి రంగాలకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.  విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెపై డీజీపీ ప్రసాదరావు అధికారులతో సమీక్ష జరిపారు. 
మరిన్ని వార్తలు