కాళ్లు, చేతులు కట్టేసి వ్యక్తి హత్య!

30 Jun, 2015 07:14 IST|Sakshi

పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దిగమర్రు బైపాస్ రోడ్డులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. విషయాన్ని గమనించిన ప్రయాణీకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు మృతుడిని రాజోలు మండలం చింతపల్లికి చెందిన యనముల దుర్గాప్రసాద్ (30)గా గుర్తించారు.

దుర్గాప్రసాద్ కాళ్లు, చేతులు కట్టేసి ఉండటాన్ని గమనిస్తే ఇది హత్యేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టనున్నట్లు వారు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు