ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

30 Jun, 2015 07:39 IST|Sakshi

ముద్దనూరు : వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి బెంగళూరు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు సోమవారం అర్ధరాత్రి ముద్దనూరు సమీపంలోని నల్లబల్లె వద్ద వంకలో ఒరిగిపోయింది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయిన డ్రైవర్ ఎం.పి.రావు బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లాడు. పక్కనే వంక ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బస్సు ఒరిగిపోయింది. ప్రయాణీకులు వెంటనే కిటికీలోంచి బయటకు దూకారు. వారిలో ఓ ఇద్దరికి గాయాలయ్యాయి.

ప్రొద్దుటూరు నుంచి రాత్రి 10.30 గంటలకు బయలుదేరిన 9288 సర్వీసు నెంబర్ బస్సులో 31 మంది ప్రయాణీకులున్నారు. ప్రమాదం రాత్రి 12 గంటల తర్వాత జరిగింది. సంఘటన స్థలానికి ప్రొద్దుటూరు డిపో మేనేజర్ గిరిధర్ రెడ్డి, ముద్దనూరు పోలీసులు, స్థానికులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణీకులను వేరే బస్సులో బెంగళూరుకు వెళ్లే ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు