హైదరాబాద్ : మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రధాన అనుచరుడు శాకమూరు నారాయణ ప్రసాద్తో పాటు మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వారు లోటస్పాండ్లో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయమ్మ పార్టీ కండువాలు వేసి వారిని వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు.
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్ట్ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పినట్లు నేతలు తెలిపారు. మోపిదేవి ప్రధాన అనుచరుడు శాఖమూరి నారాయణ ప్రసాద్తో పాటు భూషణం, చిన్నయ్య, నాగమల్లేశ్వర్రావు, వెంకట్రావు, వీరయ్య వైఎస్ఆర్ సీపీ సభ్యత్వం తీసుకున్నారు. పంచాయితీ ఎన్నికలతో సహా రానున్న ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ విజయనానికి కృషి చేస్తామని చెప్పారు.
మరోవైపు మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరనాథ్బాబు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారం ఆయన పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. హరనాథ్బాబు నిన్న తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.