వసతులు లేక.. ఏటీఎం గదిలో పడక

17 Oct, 2017 13:20 IST|Sakshi

రేణిగుంట రైల్వేస్టేషన్‌ జంక్షన్‌గా రూపాంతరం చెంది శతాబ్దన్నర కాలం దాటుతున్నా.. స్టేషన్‌లో వసతుల లేమితో ప్రయాణికులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. తిరుమల క్షేత్రం దగ్గర్లోనే ఉండడంతో.. నిత్యం అనేకమంది ఇక్కడికి వస్తుంటారు. వారు సేదతీరడానికి  స్టేషన్‌లో సరిపడా గదులు ఇప్పటికీ ఏర్పాటుచేయలేదు. దీంతో ప్రయాణికులు ప్లాట్‌ఫాంలపైనా, కనిపించిన ఖాళీ చోట్లా ఉంటున్నారు. ఆదివారం రాత్రి స్టేషన్‌కు వచ్చిన ఓ కుటుంబం ఇలా పక్కనే ఉన్న ఏటీఎం గదిలో నిద్రించింది. – రేణిగుంట

మరిన్ని వార్తలు