ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని అంతరగంగలో ఆత్మహత్యకు పాల్పడిన వన్నూరప్ప కుటుంబాన్ని ఆయన శుక్రవారం పరామర్శించారు.
రైతుల రుణమాఫీ అమలులో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. రైతుల ఆత్మహత్యల వ్యవహారంపై అసెంబ్లీలో తాము చంద్రబాబును నకచ్చితంగా నిలదీస్తామని చెప్పారు.