కల్యాణ మండపంలో అగ్ని ప్రమాదం

15 Nov, 2015 14:17 IST|Sakshi

పార్వతీపురం: విజయనగరం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఫంక్షన్ హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పార్వతీపురం మెయిన్‌రోడ్డులోని సూర్యకళా ఫంక్షన్ హాల్ కింది భాగంలో ఉన్న సెల్‌షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. దీంతో మండపంలో ఉంచిన గ్యాస్ సిలిండర్లు పేలిపోతాయన్న భయంతో స్థానికులు పరుగులు తీశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.
 

మరిన్ని వార్తలు