గోవా డీజీపీ మరణం నన్ను కలచివేసింది

16 Nov, 2019 19:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: గోవా డీజీపీ ప్రణబ్‌నందా హటాన్మరణం నన్ను కలచి వేసిందని డీజీపీ గౌతం సవాంగ్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన గుండెపోటుతో చనిపోయారనే వాస్తవాన్ని నమ్మలేకపోయానన్నారు. నేను, ప్రణబ్‌నందా ఢిల్లీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నామని తెలిపారు. ఐపీఎస్‌గా ఆయన సేవలు మరువలేనివని, ఆయన లేని లోటు పోలీస్‌ శాఖలో తీర్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చదవండి: ఢిల్లీ పర్యటనలో డీజీపీ ఆకస్మిక మృతి

మరిన్ని వార్తలు