కచ్చలూరు ప్రమాదం : మత్స్యకారులకు ప్రోత్సాహం​ అందజేత

23 Nov, 2019 20:55 IST|Sakshi
బోటు ప్రమాద దృశ్యం (ఫైల్‌ ఫోటో)

సాక్షి, తూర్పు గోదావరి జిల్లా : కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 26 మంది టూరిస్టులను రక్షించిన మత్స్యకారులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందజేసింది. 20 మందికి రూ. 25 వేల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నజరానా ప్రకటించగా, శనివారం రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ఈ నగదు ప్రోత్సహాన్ని మత్స్యకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనంత ఉదయభాస్కర్‌, ఐటీడీఏ పీఓ నిశాంత్‌ కుమార్‌లు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు