ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రక్రియ షురూ!

24 Sep, 2016 05:12 IST|Sakshi
ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రక్రియ షురూ!
గన్నవరం: 
విమానాశ్రయ విస్తరణ కోసం ల్యాండ్‌ పూలింగ్‌లో అంగీకరించని రైతుల నుంచి భూసేకరణ చట్ట ప్రకారం భూములను తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా భూసేకరణ గ్రామాల్లో సామాజిక ప్రభావ మదింపు కోసం ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దారు ఎం. మాధురి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయా గ్రామాల్లోని పంచాయితీ కార్యాలయాల్లో జరిగే ఈ సభలకు నిర్వాసిత రైతులందరూ హాజరుకావాలని ఆమె కోరారు.
ఎక్కడెక్కడ.. ఎప్పుడెప్పడు 
 
– సోమవారం ఉదయం 11 గంటలకు కేసరపల్లిలో, 27న ఉదయం 10కు జక్కులనెక్కలం, 12 గంటలకు పురుషోత్తపట్నంలో గ్రామసభలు జరుగుతాయి. 
–28న ఉదయం 10కు గన్నవరంలో, 12 గంటలకు చిన్నఆవుటపల్లిలో. 
– 29న ఉదయం 10కు అల్లాపురంలో, 12 గంటలకు అజ్జంపూడి.
– 30వ తేది ఉదయం 10 గంటలకు బుద్దవరంలో ఈ గ్రామసభలు జరుగుతాయని తెలిపారు. 
 
మరిన్ని వార్తలు