పులిచింతలకు భారీగా వరద నీరు

24 Oct, 2014 23:40 IST|Sakshi
గుంటూరు: పులిచింతల ప్రాజెక్ట్ భారీగా వరద నీరు చేరుతోందని ఆ ప్రాజెక్ట్ ఇంచార్జ్ ఎస్ ఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం పులిచింతలలో 10.29 టీఎంసీల నీటి నిల్వ ఉందని, ఎగువ నుంచి పులిచింతలకు 30 వేల క్యూసెక్కుల నీరు చేరుతోందిని అధికారులు తెలిపారు. 
 
ప్రకాశం బ్యారేజికి 15300 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నామని, మరో 2 టీఎంసీల నీరు చేరితే తెలంగాణలోని 4 గ్రామాలకు ముంపు బెడద ఉంటుందని అధికారులు హెచ్చరించారు. పులిచింతల ప్రాజెక్ట్ లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్న ఇంచార్జ్ ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. 
మరిన్ని వార్తలు