తెలంగాణకు భారీ వర్ష సూచన

21 Aug, 2013 04:52 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ను అనుసరించి వాయవ్య బంగాళాఖాతం మీదుగా వాయుగుండం ఏర్పడినట్టు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది క్రమేపీ పశ్చిమ, వాయవ్య దిశగా పయనించి అల్పపీడన ద్రోణిగా మారే అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. అల్పపీడన ద్రోణి కూడా ఒరిస్సా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్నట్టు తెలిపారు. దీని ప్రభావంతో చాలాచోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. రాగల 48గంటల్లో కోస్తాంధ్రతో పాటు తెలంగాణలో భారీవర్షం పడే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

మరిన్ని వార్తలు